ETV Bharat / business

భారత మార్కెట్​ నుంచి సోనీ ఫోన్లు ఔట్

వరుస నష్టాల కారణంగా భారత్ సహా పలు దేశాల్లో స్మార్ట్​ఫోన్​ వ్యాపారాలు నిలిపివేయనున్నట్లు దిగ్గజ సంస్థ సోనీ ప్రకటించింది. అమ్మకాలు నిలిపివేసినా.. ఇతరత్రా సమస్యలకు అన్ని రకాలుగా వినియోగదార్లకు అందుబాటులో ఉంటామని తెలిపింది.

author img

By

Published : May 24, 2019, 2:21 PM IST

సోనీ

జపాన్​కు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం 'సోనీ' సంచలన నిర్ణయం తీసుకుంది. భారత్​లో స్మార్ట్ ఫోన్ వ్యాపారాలను విరమించుకుంటున్నట్లు ప్రకటించింది. కొన్నేళ్లుగా ఈ వ్యాపారంలో సంస్థకు భారీ నష్టాలు రావడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.

గట్టిపోటీయే కారణం..

నాణ్యమైన ప్రమాణాలు పాటించే స్మార్ట్​ఫోన్​ బ్రాండుగా వినియోగదార్లలో సోనీకి మంచి పేరుంది. అయితే గత కొన్నేళ్లుగా స్మార్ట్​ ఫోన్ల వ్యాపారంలో చాలా కంపెనీలు తక్కువ ధరలో ఎక్కవ ఫీచర్లు ఉన్న ఫోన్లను విక్రయిస్తున్నాయి. వాటితో సోనీ పోటీ పడలేకపోయిందనే చెప్పాలి.

ఈ కారణంగా సంస్థకు వరుసగా నష్టాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సంస్థను గట్టెక్కించేందుకు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది సోనీ.

ఇందుకోసం భారత్​తో సహా దక్షిణ అమెరికా, దక్షిణాసియా, ఆఫ్రికాల్లో సంస్థ స్మార్ట్​ఫోన్​ వ్యాపారాలు మూసివేయనున్నట్లు తెలిపింది. నిర్వహణ వ్యయాలను కూడా తగ్గించుకోనున్నట్లు పేర్కొంది.

అయితే కొత్త ఫోన్ల అమ్మకాలు నిలిపివేసినా.. అన్ని రకాలుగా వినియోగదార్లకు సేవలందించనున్నట్లు పేర్కొంది.

పట్టున్న మార్కెట్లపై దృష్టి

సోనీ బ్రాండ్ ఫోన్లకు పెద్ద మార్కెట్లుగా ఉన్న జపాన్​, యూరప్​, హాంకాంగ్​, తైవాన్​ దేశాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు సోనీ తెలిపింది. 5జీ సాంకేతికతను అందిపుచ్చుకుని 2020 లోపు మళ్లీ లాభాల బాట పట్టించాలని సోనీ పట్టుదలగా ఉంది.

జపాన్​కు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం 'సోనీ' సంచలన నిర్ణయం తీసుకుంది. భారత్​లో స్మార్ట్ ఫోన్ వ్యాపారాలను విరమించుకుంటున్నట్లు ప్రకటించింది. కొన్నేళ్లుగా ఈ వ్యాపారంలో సంస్థకు భారీ నష్టాలు రావడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.

గట్టిపోటీయే కారణం..

నాణ్యమైన ప్రమాణాలు పాటించే స్మార్ట్​ఫోన్​ బ్రాండుగా వినియోగదార్లలో సోనీకి మంచి పేరుంది. అయితే గత కొన్నేళ్లుగా స్మార్ట్​ ఫోన్ల వ్యాపారంలో చాలా కంపెనీలు తక్కువ ధరలో ఎక్కవ ఫీచర్లు ఉన్న ఫోన్లను విక్రయిస్తున్నాయి. వాటితో సోనీ పోటీ పడలేకపోయిందనే చెప్పాలి.

ఈ కారణంగా సంస్థకు వరుసగా నష్టాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సంస్థను గట్టెక్కించేందుకు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది సోనీ.

ఇందుకోసం భారత్​తో సహా దక్షిణ అమెరికా, దక్షిణాసియా, ఆఫ్రికాల్లో సంస్థ స్మార్ట్​ఫోన్​ వ్యాపారాలు మూసివేయనున్నట్లు తెలిపింది. నిర్వహణ వ్యయాలను కూడా తగ్గించుకోనున్నట్లు పేర్కొంది.

అయితే కొత్త ఫోన్ల అమ్మకాలు నిలిపివేసినా.. అన్ని రకాలుగా వినియోగదార్లకు సేవలందించనున్నట్లు పేర్కొంది.

పట్టున్న మార్కెట్లపై దృష్టి

సోనీ బ్రాండ్ ఫోన్లకు పెద్ద మార్కెట్లుగా ఉన్న జపాన్​, యూరప్​, హాంకాంగ్​, తైవాన్​ దేశాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు సోనీ తెలిపింది. 5జీ సాంకేతికతను అందిపుచ్చుకుని 2020 లోపు మళ్లీ లాభాల బాట పట్టించాలని సోనీ పట్టుదలగా ఉంది.

Mumbai, May 24 (ANI): A special screening of film 'PM Narendra Modi' held in Mumbai. B-town celebrities marked their presence at the event. Bollywood actor Vivek Oberoi was seen along with movie's director Omung Kumar and producer Sandip Ssingh during the event. Bollywood celebrities Shakti Kapoor, Divya Khosla Kumar, Vikas Gupta and Suresh Oberoi were also seen during the screening. 'PM Narendra Modi' will hit the theaters on May 24.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.