ETV Bharat / business

శాంసంగ్​ మడత ఫోన్​ ప్రీ-బుకింగ్​.. ధరెంతో తెలుసా? - శాంసంగ్ మొబైల్​

కొరియా దిగ్గజం శాంసంగ్ రూపొందించిన మరో మడత ఫోన్​ గెలాక్సీ జెడ్​ ఫ్లిప్​ ప్రీ -బుకింగ్​ను ప్రకటించింది. ఈ నెల 26న భారత మార్కెట్లోకి రానున్న మడతఫోన్​ కోసం ఫిబ్రవరి 21 నుంచి బుకింగ్​ చేసుకోవచ్చని తెలిపింది.

samsung
జెడ్​ ఫ్లిప్​
author img

By

Published : Feb 20, 2020, 8:17 PM IST

Updated : Mar 1, 2020, 11:59 PM IST

శాంసంగ్​ ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన మరో మడత ఫోన్ 'గెలాక్సీ జెడ్​ ఫ్లిప్'​ను​ భారత్​లో ఆవిష్కరించనుంది. ఈ నెల 26 నుంచి భారత మార్కెట్​లో ప్రవేశపెట్టనుంది. ఇందుకు సంబంధించి ఫిబ్రవరి 21 నుంచి ప్రీ-బుకింగ్​ సౌకర్యాన్ని కల్పించనుంది శాంసంగ్.

samsung
గెలాక్సీ జెడ్​ ఫ్లిప్​

ప్రత్యేకమైన ఆఫర్లు..

శాంసంగ్​లో అత్యంత ఖరీదైన ఫోన్లలో ఒకటైన జెడ్​ ఫ్లిప్​కు అనేక సౌకర్యాలు కల్పిస్తోంది.

  • ప్రమాద బీమా కవరేజీ
  • వన్​టైం స్క్రీన్​ ప్రొటెక్షన్​ (రాయితీపై)
  • 24X7 కాల్ ​సెంటర్​ సపోర్ట్​
  • 12 నెలల జీరో ఈఎంఐ సదుపాయం
  • నాలుగు నెలల యూట్యూబ్​ ప్రీమియం చందా

గెలాక్సీ జెడ్​ ఫ్లిప్​ కొత్త తరం ఫోల్డబుల్​ గ్లాస్​తో తయారైంది. 6.7 అంగుళాల తెర కలిగిన ఈ ఫోన్ మడతపెట్టిన తర్వాత​ జేటులో ఇమిడిపోతుంది. ఇందులో పవర్​షేర్ వైర్​లెస్​, వైర్​ ద్వారా ఫాస్ట్​ ఛార్జింగ్​​ సౌకర్యం కల్పించింది.

ఇది ప్రీమియం ఫోన్​ అయినప్పటికీ ఇందులో రెండు సిమ్​లను ఉపయోగించుకోవచ్చని సంస్థ తెలిపింది. అయితే ఒకటి మాత్రం ఈ-సిమ్​ స్లాట్​ ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేసింది. ప్రస్తుతం ఎయిర్​టెల్​, జియోలు మాత్రమే ఈ-సిమ్​ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి.

ప్రత్యేకతలు..

  • 6.7 అంగుళాల మడత తెర
  • డైనమిక్ ఎమోలెడ్​ ఇన్​ఫినిటీ ఫ్లెక్స్ డిస్​ప్లే
  • ఆండ్రాయిడ్​ 10 ఆపరేటింగ్ సిస్టమ్​
  • 7 నానోమీటర్​ అక్టాకోర్ ప్రాసెసర్​
  • 8 జీబీ ర్యామ్​-256 జీబీ రామ్​
  • 3,300 ఎంఏహెచ్​ బ్యాటరీ (వైర్​, వైర్​ లెస్​ ఫాస్ట్ ఛార్జింగ్​)
  • వెనుక కెమెరాలు (12 ఎంపీ+12 ఎంపీ)
  • 10 ఎంపీ సెల్ఫీ కెమెరా
  • లభించే రంగులు: మిర్రర్​ పర్పుల్​, మిర్రర్ బ్లాక్​, మిర్రర్​ గోల్డ్​
  • ధర రూ.1,09,999.00

శాంసంగ్​ ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన మరో మడత ఫోన్ 'గెలాక్సీ జెడ్​ ఫ్లిప్'​ను​ భారత్​లో ఆవిష్కరించనుంది. ఈ నెల 26 నుంచి భారత మార్కెట్​లో ప్రవేశపెట్టనుంది. ఇందుకు సంబంధించి ఫిబ్రవరి 21 నుంచి ప్రీ-బుకింగ్​ సౌకర్యాన్ని కల్పించనుంది శాంసంగ్.

samsung
గెలాక్సీ జెడ్​ ఫ్లిప్​

ప్రత్యేకమైన ఆఫర్లు..

శాంసంగ్​లో అత్యంత ఖరీదైన ఫోన్లలో ఒకటైన జెడ్​ ఫ్లిప్​కు అనేక సౌకర్యాలు కల్పిస్తోంది.

  • ప్రమాద బీమా కవరేజీ
  • వన్​టైం స్క్రీన్​ ప్రొటెక్షన్​ (రాయితీపై)
  • 24X7 కాల్ ​సెంటర్​ సపోర్ట్​
  • 12 నెలల జీరో ఈఎంఐ సదుపాయం
  • నాలుగు నెలల యూట్యూబ్​ ప్రీమియం చందా

గెలాక్సీ జెడ్​ ఫ్లిప్​ కొత్త తరం ఫోల్డబుల్​ గ్లాస్​తో తయారైంది. 6.7 అంగుళాల తెర కలిగిన ఈ ఫోన్ మడతపెట్టిన తర్వాత​ జేటులో ఇమిడిపోతుంది. ఇందులో పవర్​షేర్ వైర్​లెస్​, వైర్​ ద్వారా ఫాస్ట్​ ఛార్జింగ్​​ సౌకర్యం కల్పించింది.

ఇది ప్రీమియం ఫోన్​ అయినప్పటికీ ఇందులో రెండు సిమ్​లను ఉపయోగించుకోవచ్చని సంస్థ తెలిపింది. అయితే ఒకటి మాత్రం ఈ-సిమ్​ స్లాట్​ ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేసింది. ప్రస్తుతం ఎయిర్​టెల్​, జియోలు మాత్రమే ఈ-సిమ్​ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి.

ప్రత్యేకతలు..

  • 6.7 అంగుళాల మడత తెర
  • డైనమిక్ ఎమోలెడ్​ ఇన్​ఫినిటీ ఫ్లెక్స్ డిస్​ప్లే
  • ఆండ్రాయిడ్​ 10 ఆపరేటింగ్ సిస్టమ్​
  • 7 నానోమీటర్​ అక్టాకోర్ ప్రాసెసర్​
  • 8 జీబీ ర్యామ్​-256 జీబీ రామ్​
  • 3,300 ఎంఏహెచ్​ బ్యాటరీ (వైర్​, వైర్​ లెస్​ ఫాస్ట్ ఛార్జింగ్​)
  • వెనుక కెమెరాలు (12 ఎంపీ+12 ఎంపీ)
  • 10 ఎంపీ సెల్ఫీ కెమెరా
  • లభించే రంగులు: మిర్రర్​ పర్పుల్​, మిర్రర్ బ్లాక్​, మిర్రర్​ గోల్డ్​
  • ధర రూ.1,09,999.00
Last Updated : Mar 1, 2020, 11:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.