ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్ఐఎల్ నుంచి ఆయిల్ టు కెమికల్ (ఓ2సీ) వ్యాపారాన్ని పూర్తి స్వతంత్ర అనుబంధ కంపెనీగా విభజించనున్నట్లు ప్రకటించింది. అనుబంధ సంస్థలో ఆర్ఐఎల్ 100 శాతం నిర్వహణ, నియంత్రణ అధికారాలు కలిగి ఉండనుంది. స్టాక్ ఎక్స్ఛేంజీలకు ఈ విషయం తెలియచేసింది.
అన్ని రిఫైనరీ, మార్కెటింగ్, కెమికల్ విభాగాల ఆస్తులను నూతన ఓ2సీ సంస్థకు బదిలీ చేయనున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ పేర్కొంది.
కొత్తగా ఏర్పడే వ్యాపారాల్లో ప్రమోటర్ గ్రూప్ 49.14 శాతం వాటను కలిగి ఉండనుంది. ఈ ప్రక్రియతో కంపెనీ వాటాదారుల్లో ఎలాంటి మార్పులు ఉండవని తెలిపింది రిలయన్స్ ఇండస్ట్రీస్. ప్రస్తుతం ఉన్న నిర్వహణ బృందం మొత్తం కొత్తగా ఏర్పడే సంస్థలోకి బదిలీ అవుతుందని స్పష్టం చేసింది. ఆదాయాల తగ్గింపు, క్యాష్ ఫ్లోపై పరిమితులు ఉండవని వివరించింది.
ఓ2సీ వ్యాపారాల్లో 20 శాతం వాటాను సౌదీ ఆరామ్కోకు విక్రయించేందుకు చర్చలు జరుగుతున్నట్లు ఆర్ఐఎల్ వెల్లడించింది.
ఇదీ చదవండి:2020లో 12.5% తగ్గిన స్మార్ట్ఫోన్ల విక్రయాలు