ETV Bharat / business

కేంద్ర ఆర్థికమంత్రికి పీఎంసీ బాధితుల నిరసన సెగ

పీఎంసీ ఖాతాదారులకు ఊరట కలిగించేందుకు అవసరమైన చట్టపరమైన విధానాలను తీసుకొస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ స్పష్టం చేశారు. బాధితులందరూ ఒకేసారి నగదు విత్​డ్రా చేసుకునేలా ఆర్బీఐ గవర్నర్​తో మాట్లాడే ఏర్పాటు చేస్తామని తెలిపారు.

author img

By

Published : Oct 10, 2019, 3:21 PM IST

Updated : Oct 10, 2019, 4:17 PM IST

MH-SITHARAMAN
కేంద్ర ఆర్థికమంత్రికి పీఎంసీ బాధితుల నిరసన సెగ

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్​కు పీఎంసీ ఖాతాదారుల నిరసన సెగ తగిలింది. మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల ప్రచారం కోసం ముంబయి వచ్చిన ఆమెకు పంజాబ్- మహారాష్ట్ర సహకార బ్యాంకు ఖాతాదారులు తీవ్ర నిరసనలతో స్వాగతం పలికారు.

ముంబయికి సీతారామన్​ చేరుకున్నారని తెలుసుకున్న వందలాది మంది పీఎంసీ ఖాతాదారులు భాజపా కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. బ్యాంకులో డిపాజిట్ చేసుకున్న సొమ్మును నయా పైసలతో సహా తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు.

ఖాతాదారులతో భేటీ

కొంతమంది ఖాతాదారులను పిలిపించుకొని... పాలనాపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. పీఎంసీ బ్యాంకు మూతపడటానికి గల కారణాలను వారికి వివరించారు.

బ్యాంకు యాజమాన్యం ఆర్థిక మోసాలకు పాల్పడిందని, అందువల్లే నగదు విత్ డ్రా చేయడంపై ఆంక్షలను విధించాల్సి వచ్చిందని అన్నారు. ఈ అంశాన్ని రిజర్వు బ్యాంకు గవర్నర్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు నిర్మల.

"ఈ విషయంలో ఆర్థిక శాఖ చేయడానికి ఏమీ లేదు. ఎందుకంటే ఆర్బీఐ బ్యాంకులను నియంత్రిస్తుంది. చట్ట ప్రకారం వాళ్లు చేయాల్సింది చేస్తున్నారు. నా తరఫున ఆర్థిక శాఖ కార్యదర్శులతో మాట్లాడాను. గ్రామీణ, పట్టణ అభివృద్ధి మంత్రిత్వ శాఖతో కలిసి పనిచేయాలని సూచించా. ఈ కమిటీలో డిప్యూటీ గవర్నర్​ స్థాయి ఆర్బీఐ అధికారి ఉంటారు. తర్వాత పాలనపరమైన చర్యలు తీసుకుంటాం. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా నిబంధనలు రూపొందిస్తాం. ఇటువంటి తప్పిదాలు మరోసారి జరగకుండా పకడ్బందీగా చర్యలు చేపడతాం. ఇది ప్రస్తుతానికి హామీ మాత్రమే.. కానీ భవిష్యత్తులో నిజమవుతుంది. వచ్చే శీతకాల సమావేశాల్లో అవసరమైతే కావాల్సిన సవరణలు చేసేందుకూ సిద్ధంగా ఉన్నాం."

-నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక మంత్రి

పీఎంసీ కుంభకోణం...

పీఎంసీ బ్యాంక్ అధికారులు, హౌసింగ్​ డెవలప్​మెంట్​ ఇన్​ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్-హెచ్​డీఐఎల్​ ప్రమోటర్లు కుమ్మక్కయి భారీ స్థాయిలో రుణ అక్రమాలకు పాల్పడ్డారన్నది ప్రధాన ఆరోపణ. ఈ అప్పుల వివరాలను ఆర్బీఐకి చెప్పకుండా బ్యాంక్ ఉన్నతాధికారులు దాచిపెట్టి.... నకిలీ ఖాతాలతో మోసగించారని ప్రాథమిక విచారణలో తేలింది. ఇలా పీఎంసీ బ్యాంక్​ నుంచి హెచ్​డీఐఎల్​ ప్రమోటర్లు రూ.6,500కోట్లు కాజేసినట్లు సమాచారం.

ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చాక పీఎంసీ బ్యాంక్ కార్యకలాపాలపై ఆర్బీఐ ఆంక్షలు విధించింది. భారతీయ బ్యాంకింగ్ రంగ షేర్లు స్టాక్​మార్కెట్లలో తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొన్నాయి.

ఇదీ చూడండి: చైనా దెబ్బకు ఆ యాప్​ను తొలగించిన యాపిల్​

కేంద్ర ఆర్థికమంత్రికి పీఎంసీ బాధితుల నిరసన సెగ

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్​కు పీఎంసీ ఖాతాదారుల నిరసన సెగ తగిలింది. మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల ప్రచారం కోసం ముంబయి వచ్చిన ఆమెకు పంజాబ్- మహారాష్ట్ర సహకార బ్యాంకు ఖాతాదారులు తీవ్ర నిరసనలతో స్వాగతం పలికారు.

ముంబయికి సీతారామన్​ చేరుకున్నారని తెలుసుకున్న వందలాది మంది పీఎంసీ ఖాతాదారులు భాజపా కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. బ్యాంకులో డిపాజిట్ చేసుకున్న సొమ్మును నయా పైసలతో సహా తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు.

ఖాతాదారులతో భేటీ

కొంతమంది ఖాతాదారులను పిలిపించుకొని... పాలనాపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. పీఎంసీ బ్యాంకు మూతపడటానికి గల కారణాలను వారికి వివరించారు.

బ్యాంకు యాజమాన్యం ఆర్థిక మోసాలకు పాల్పడిందని, అందువల్లే నగదు విత్ డ్రా చేయడంపై ఆంక్షలను విధించాల్సి వచ్చిందని అన్నారు. ఈ అంశాన్ని రిజర్వు బ్యాంకు గవర్నర్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు నిర్మల.

"ఈ విషయంలో ఆర్థిక శాఖ చేయడానికి ఏమీ లేదు. ఎందుకంటే ఆర్బీఐ బ్యాంకులను నియంత్రిస్తుంది. చట్ట ప్రకారం వాళ్లు చేయాల్సింది చేస్తున్నారు. నా తరఫున ఆర్థిక శాఖ కార్యదర్శులతో మాట్లాడాను. గ్రామీణ, పట్టణ అభివృద్ధి మంత్రిత్వ శాఖతో కలిసి పనిచేయాలని సూచించా. ఈ కమిటీలో డిప్యూటీ గవర్నర్​ స్థాయి ఆర్బీఐ అధికారి ఉంటారు. తర్వాత పాలనపరమైన చర్యలు తీసుకుంటాం. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా నిబంధనలు రూపొందిస్తాం. ఇటువంటి తప్పిదాలు మరోసారి జరగకుండా పకడ్బందీగా చర్యలు చేపడతాం. ఇది ప్రస్తుతానికి హామీ మాత్రమే.. కానీ భవిష్యత్తులో నిజమవుతుంది. వచ్చే శీతకాల సమావేశాల్లో అవసరమైతే కావాల్సిన సవరణలు చేసేందుకూ సిద్ధంగా ఉన్నాం."

-నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక మంత్రి

పీఎంసీ కుంభకోణం...

పీఎంసీ బ్యాంక్ అధికారులు, హౌసింగ్​ డెవలప్​మెంట్​ ఇన్​ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్-హెచ్​డీఐఎల్​ ప్రమోటర్లు కుమ్మక్కయి భారీ స్థాయిలో రుణ అక్రమాలకు పాల్పడ్డారన్నది ప్రధాన ఆరోపణ. ఈ అప్పుల వివరాలను ఆర్బీఐకి చెప్పకుండా బ్యాంక్ ఉన్నతాధికారులు దాచిపెట్టి.... నకిలీ ఖాతాలతో మోసగించారని ప్రాథమిక విచారణలో తేలింది. ఇలా పీఎంసీ బ్యాంక్​ నుంచి హెచ్​డీఐఎల్​ ప్రమోటర్లు రూ.6,500కోట్లు కాజేసినట్లు సమాచారం.

ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చాక పీఎంసీ బ్యాంక్ కార్యకలాపాలపై ఆర్బీఐ ఆంక్షలు విధించింది. భారతీయ బ్యాంకింగ్ రంగ షేర్లు స్టాక్​మార్కెట్లలో తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొన్నాయి.

ఇదీ చూడండి: చైనా దెబ్బకు ఆ యాప్​ను తొలగించిన యాపిల్​

RESTRICTION SUMMARY: ANHA (HAWAR NEWS) - MUST CREDIT 'ANHA (HAWAR NEWS)'/DO NOT OBSCURE LOGO
SHOTLIST:
ANHA (HAWAR NEWS) - MUST CREDIT 'ANHA (HAWAR NEWS)'/DO NOT OBSCURE LOGO
Ras al-Ayn - 9 October 2019
++NIGHT SHOTS++
1. Various of exchange of fire between Syrian Democratic Forces (SDF) and Turkey-backed Syrian opposition fighters, AUDIO: rapid gunfire
STORYLINE:
Fighting between the Syrian Democratic Forces (SDF) and Turkey-backed Syrian opposition troops continued during the night on Wednesday after Turkey launched an offensive against Kurdish fighters in northern Syria.
Turkish President Recep Tayyip Erdogan announced the start of the campaign after US troops pulled back from the area, paving the way for an assault on forces that have long been allied with the United States.
Turkey's Defense Ministry said Turkish jets and artillery had struck 181 targets east of the Euphrates River since the incursion started.
Turkey says it intends to create a "safe zone" that would push Kurdish militia away from its border and eventually allow the repatriation of up to two million Syrian refugees.
The abrupt decision that American troops would step aside was taken by US President Donald Trump on Sunday.
Trump's move, which has drawn harsh bipartisan opposition at home, represented a shift in US policy that essentially abandoned the Syrian Kurdish fighters who have been America's only allies inside Syria in the fight against the Islamic State group.
SDF forces said they used their "right of legitimate defense to defend the peoples of northern and eastern Syria."
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Oct 10, 2019, 4:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.