ప్రముఖ ఆటో మొబైల్ దిగ్గజం పియాజియో ఇండియా మరో స్కూటర్ను భారత మార్కెట్లోకి తీసుకురానుంది. ఇటీవల తీసుకువచ్చిన 'ఏప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160'కు బడ్జెట్ వర్షన్గా ఏప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 125ని విడుదల చేయనుంది. ఇందుకు సంబంధించి ప్రీ బుకింగ్ను ప్రారంభించింది.
ఈ వాహనాన్ని సొంతం చేసుకోవాలనుకునే వారు ముందస్తుగా కంపెనీ ఆఫీషియల్ సైట్లో రూ.5వేలు ఆన్లైన్ పద్ధతిన చెల్లించాల్సి ఉంటుంది. లేక డీలర్ వద్ద నుంచి అయినా బుక్ చేసుకోవచ్చని సంస్థ తెలిపింది.
ప్రత్యేకతలు...
- వ్రాప్ ఎల్ఈడీ హెడ్ లైట్స్
- ఎల్ఈటీ టైల్ లైట్స్
- కంఫర్టబుల్ సీటింగ్
- ఫుల్ డిజిటల్ క్లస్టర్
- బ్లూటూత్ మొబైల్ కనెక్టివిటీ
- అడ్జెస్టబుల్ రేర్ సస్పెన్షన్
- డిస్క్బ్రేక్
మ్యాట్ బ్లూ, మ్యాట్ బ్లాక్, గ్లాసీ వైట్, గ్లాసీ రెడ్ అనే నాలుగు రంగుల్లో ఎస్ఎక్స్ఆర్ 125 అందుబాటులోకి రానుంది.
దీని ధర షోర్రూం ధర రూ. 95 వేల నుంచి రూ. లక్ష వరకు ఉండొచ్చని సమాచారం.
ఇదీ చూడండి: మార్కెట్లోకి ఏప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160- ధరెంతంటే?