ETV Bharat / business

ఎస్​ బ్యాంక్ కేసులో ఈడీ కస్టడీకి 'రానా' - Mumbai's Special Holiday Court sends #YesBank founder Rana Kapoor to Enforcement Directorate custody till 11th March

ఎస్ బ్యాంక్ అక్రమ నగదు చలామణి వ్యవహారంలో సంస్థ వ్యవస్థాపకుడు, డైరెక్టర్ రానా కపూర్​ను ఎన్​ఫోర్స్​మెంట్(ఈడీ) కస్టడీకి అప్పగించింది ముంబయి కోర్టు. బ్యాంకులో జరిగిన అవకతవకలపై ఈనెల 11 వరకు రానాను ప్రశ్నించనుంది ఈడీ.

rana kapoor
ఎస్​ బ్యాంక్ వ్యవహారంలో ఈడీ కస్టడీకి రానా కపూర్
author img

By

Published : Mar 8, 2020, 2:15 PM IST

ఎస్​ బ్యాంక్ వ్యవస్థాపకుడు, డైరెక్టర్​ రానా కపూర్​ను ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ కస్టడీకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది ముంబయి న్యాయస్థానం. ఆదివారం సెలవు దినాన ప్రత్యేకంగా సమావేశమైన కోర్టు 11వ తేదీవరకు ఆయనను కస్టడీలో ఉంచేందుకు అనుమతించింది.

ఎస్​ బ్యాంకు సంక్షోభంలో కీలక పాత్రధారి అయిన రానా కపూర్ ఇంట్లో శుక్రవారం రాత్రి సోదాలు చేసింది ఈడీ. 20 గంటల పాటు ఆయనను విచారించింది. అనంతరం ఆయనను ఇవాళ ఉదయం 3 గంటల సమయంలో మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం అరెస్టు చేసింది. ఆ వెంటనే కోర్టులో ప్రవేశపెట్టింది. మరింత విచారణ కోసం తమ కస్టడీకి అప్పగించాలని కోర్టును అభ్యర్థించింది. ఈడీ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించింది ముంబయి కోర్టు.

అభియోగాలు.. విచారణ

ఎస్ బ్యాంకు సంక్షోభానికి దారితీసిన అవకతవకల్లో కపూర్‌ పాత్ర ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. డీహెచ్ఎఫ్​ఎల్​ సంస్థకు ఎస్​ బ్యాంకు ఇచ్చిన రుణాలు నిరర్ధక ఆస్తులుగా మారాయి. ఈ రుణాల విషయంలో రానాకపూర్​ పాత్రను ఈడీ అనుమానిస్తోంది. మరో కార్పొరేటు సంస్థకు ఇచ్చిన రుణాల్లోనూ కపూర్‌ అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. సదరు సంస్థకు ఇచ్చిన రుణాలకు ప్రతిఫలంగా వారి నుంచి ఆయన కొంత సొమ్ము పొందారన్న అభియోగాలు ఉన్నాయి. ఆయన భార్య ఖాతాలోకి అవి చేరినట్లు ఆధారాలు కూడా ఉన్నట్లు సమాచారం. వీటన్నింటిపై 11 వరకు కొనసాగనున్న కస్టడీలో విచారించనుంది ఈడీ.

ఇదీ చూడండి: ఎస్​ బ్యాంక్​ వ్యవస్థాపకుడు​ రానా కపూర్ అరెస్టు

ఎస్​ బ్యాంక్ వ్యవస్థాపకుడు, డైరెక్టర్​ రానా కపూర్​ను ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ కస్టడీకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది ముంబయి న్యాయస్థానం. ఆదివారం సెలవు దినాన ప్రత్యేకంగా సమావేశమైన కోర్టు 11వ తేదీవరకు ఆయనను కస్టడీలో ఉంచేందుకు అనుమతించింది.

ఎస్​ బ్యాంకు సంక్షోభంలో కీలక పాత్రధారి అయిన రానా కపూర్ ఇంట్లో శుక్రవారం రాత్రి సోదాలు చేసింది ఈడీ. 20 గంటల పాటు ఆయనను విచారించింది. అనంతరం ఆయనను ఇవాళ ఉదయం 3 గంటల సమయంలో మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం అరెస్టు చేసింది. ఆ వెంటనే కోర్టులో ప్రవేశపెట్టింది. మరింత విచారణ కోసం తమ కస్టడీకి అప్పగించాలని కోర్టును అభ్యర్థించింది. ఈడీ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించింది ముంబయి కోర్టు.

అభియోగాలు.. విచారణ

ఎస్ బ్యాంకు సంక్షోభానికి దారితీసిన అవకతవకల్లో కపూర్‌ పాత్ర ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. డీహెచ్ఎఫ్​ఎల్​ సంస్థకు ఎస్​ బ్యాంకు ఇచ్చిన రుణాలు నిరర్ధక ఆస్తులుగా మారాయి. ఈ రుణాల విషయంలో రానాకపూర్​ పాత్రను ఈడీ అనుమానిస్తోంది. మరో కార్పొరేటు సంస్థకు ఇచ్చిన రుణాల్లోనూ కపూర్‌ అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. సదరు సంస్థకు ఇచ్చిన రుణాలకు ప్రతిఫలంగా వారి నుంచి ఆయన కొంత సొమ్ము పొందారన్న అభియోగాలు ఉన్నాయి. ఆయన భార్య ఖాతాలోకి అవి చేరినట్లు ఆధారాలు కూడా ఉన్నట్లు సమాచారం. వీటన్నింటిపై 11 వరకు కొనసాగనున్న కస్టడీలో విచారించనుంది ఈడీ.

ఇదీ చూడండి: ఎస్​ బ్యాంక్​ వ్యవస్థాపకుడు​ రానా కపూర్ అరెస్టు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.