ETV Bharat / business

ఆన్​లైన్​లో 2 లక్షలకుపైగా మారుతీ కార్లు విక్రయం - ఆన్​లైన్ ద్వారా మారుతీ 2 లక్షల కార్ల విక్రయం

ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఆన్​లైన్​ విక్రయాల్లో భారీ వృద్ధి నమోదైనట్లు ప్రకటించింది. ఆన్​లైన్ మాధ్యమం ద్వారా 2 లక్షల యూనిట్లకుపైగా విక్రయించినట్లు సోమవారం ప్రకటించింది.

Maruti Sale 2 lakh Unit Via Online
ఆన్​లైన్ ద్వారా మారుతీ 2 లక్షల కార్ల విక్రయం
author img

By

Published : Nov 16, 2020, 1:15 PM IST

దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా.. ఆన్​లైన్​ మాద్యమం ద్వారా 2 లక్షలకుపైగా యూనిట్లను విక్రయించినట్లు ప్రకటించింది.

దాదాపు రెండేళ్ల క్రితం ఆన్​లైన్​ విక్రయాలు ప్రారంభించింది మారుతీ సుజుకీ. దేశవ్యాప్తంగా ప్రస్తుతం వెయ్యి డీలర్​షిప్​లను ఆన్​లైన్​కు అనుసంధానం చేసింది.

గత ఏడాది ఏప్రిల్ నుంచి డిజిటల్ ఎంక్వైరీలు మూడు రెట్లు పెరగగా.. దాదాపు 2 లక్షల యూనిట్లు విక్రయించామని మారుతీ సుజుకీ పేర్కొంది. దాదాపు 21 లక్షలకుపైగా వినియోగదారుల సందేహాలను తీర్చేందుకు మాధ్యమం ఉపయోగపడిందని తెలిపింది.

'గూగుల్ ఆటో గెయిర్​ షిఫ్ట్ ఇండియా 2020' నివేదిక ప్రకారం.. 95 శాతం కొత్త కార్ల విక్రయాలు డిజిటల్​గా ప్రభావితమవుతున్నట్లు వివరించింది మారుతీ. వినియోగదారులు ముందు ఆన్​లైన్​లో కావాల్సిన మోడల్​ గురించి తెలుసుకొని.. ఆఫ్​లైన్ డీలర్​షిప్​లలో కొనుగోళ్లు జరుపుతున్నారని వెల్లడించింది. కొవిడ్ 19 ప్రభావంతో.. గడిచిన ఐదు నెలల్లో ఆన్​లైన్​ ఎంక్వైరీలు 33 శాతం పెరిగినట్లు పేర్కొంది.

ఇదీ చూడండి:డీజిల్​ మోడళ్ల కొనసాగింపునకే హ్యుందాయ్​ మోటర్స్ మొగ్గు

దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా.. ఆన్​లైన్​ మాద్యమం ద్వారా 2 లక్షలకుపైగా యూనిట్లను విక్రయించినట్లు ప్రకటించింది.

దాదాపు రెండేళ్ల క్రితం ఆన్​లైన్​ విక్రయాలు ప్రారంభించింది మారుతీ సుజుకీ. దేశవ్యాప్తంగా ప్రస్తుతం వెయ్యి డీలర్​షిప్​లను ఆన్​లైన్​కు అనుసంధానం చేసింది.

గత ఏడాది ఏప్రిల్ నుంచి డిజిటల్ ఎంక్వైరీలు మూడు రెట్లు పెరగగా.. దాదాపు 2 లక్షల యూనిట్లు విక్రయించామని మారుతీ సుజుకీ పేర్కొంది. దాదాపు 21 లక్షలకుపైగా వినియోగదారుల సందేహాలను తీర్చేందుకు మాధ్యమం ఉపయోగపడిందని తెలిపింది.

'గూగుల్ ఆటో గెయిర్​ షిఫ్ట్ ఇండియా 2020' నివేదిక ప్రకారం.. 95 శాతం కొత్త కార్ల విక్రయాలు డిజిటల్​గా ప్రభావితమవుతున్నట్లు వివరించింది మారుతీ. వినియోగదారులు ముందు ఆన్​లైన్​లో కావాల్సిన మోడల్​ గురించి తెలుసుకొని.. ఆఫ్​లైన్ డీలర్​షిప్​లలో కొనుగోళ్లు జరుపుతున్నారని వెల్లడించింది. కొవిడ్ 19 ప్రభావంతో.. గడిచిన ఐదు నెలల్లో ఆన్​లైన్​ ఎంక్వైరీలు 33 శాతం పెరిగినట్లు పేర్కొంది.

ఇదీ చూడండి:డీజిల్​ మోడళ్ల కొనసాగింపునకే హ్యుందాయ్​ మోటర్స్ మొగ్గు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.