భారత్లో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి.. ప్రముఖ మోడల్ ఇగ్నిస్లో బీఎస్-6 వాహనాన్ని విడుదల చేసింది. దీని ధర రూ.4.89 నుంచి 7.19 లక్షల మధ్య ఉంటుందని నిర్ణయించింది.
ఈ కొత్త ఇగ్నిస్లో 1.2 లీటర్ల పెట్రోల్ ఇంజిన్ సామర్థ్యాన్ని కల్పించామని సంస్థ తెలిపింది. మాన్యువల్తో పాటు ఆటో గేర్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చామన్నారు. క్రోమ్ గ్రిల్, సరికొత్త బంపర్, స్కిడ్ ప్లేట్లు, దీంతో పాటు రూఫ్ రెయిల్స్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.
ఎస్యూవీలకు ఆదరణ పెరుగుతోందని.. అందువల్ల కొత్త ఇగ్నిస్ను ఎస్యూవీ తరహాలోనే తయారు చేశామని తెలిపింది మారుతి. ఈ కొత్త మోడల్ ఆరు రంగుల్లో అందుబాటులో ఉండనుంది. వీటిల్లో లూసెంట్ ఆరెంజ్, న్యూ టర్కోయిస్ రంగులు ఉన్నాయి. డ్యూయల్ టోన్ ఆప్షన్లలోనూ లభిస్తోంది.
మాన్యువల్ గేర్ సిస్టమ్ మోడల్లో మొత్తం 4 వేరియంట్లలో లభించే ఇగ్నిస్ ధర.. రూ.4.89 - రూ.6.73 లక్షల మధ్య నిర్ణయించింది సంస్థ. ఆటోగేర్ సిస్టమ్లో రూ.6.13 - రూ.7.19 లక్షల మధ్య లభిస్తాయి.