ETV Bharat / business

మాల్యా రాక లాంఛనమే.. న్యాయ ప్రక్రియ పూర్తి! - all legalities done

పరారీలో ఉన్న రుణ ఎగవేతదారు విజయ్​మాల్యాను భారత్​కు ఎప్పుడైనా తీసుకురావొచ్చని సమాచారం. ఈ మేరకు ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్​కు చెందిన ఓ అధికారి అనధికారికంగా వెల్లడించారని తెలుస్తోంది. మాల్యాను భారత్​కు తీసుకొచ్చేందుకు ఇప్పటికే న్యాయప్రక్రియ పూర్తయిందని ఆ అధికారి పేర్కొన్నారు.

mallya
మాల్యా రాక లాంఛనమే.. న్యాయ ప్రక్రియ పూర్తి!
author img

By

Published : Jun 3, 2020, 6:59 PM IST

పరారీలో ఉన్న రుణఎగవేతదారు, భారతీయ వ్యాపారవేత్త విజయ్ ​మాల్యాను భారత్​కు తీసుకొచ్చే అంశమై న్యాయపరమైన ప్రక్రియ పూర్తయినట్లు తెలుస్తోంది. ఆయనను ఎప్పుడైనా భారత్​కు తీసుకొచ్చే అవకాశం ఉందని ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్​కు చెందిన ఓ అధికారి అనధికారికంగా వెల్లడించినట్లు సమాచారం.

ప్రక్రియ షురూ..

సీబీఐ, ఈడీ మాల్యాను వెనక్కి తెచ్చేందుకు ఇప్పటికే ప్రక్రియ ప్రారంభించాయి. భారత్​కు వచ్చిన వెంటనే కస్టడీకి తీసుకోవాలని సీబీఐ అధికారులు భావిస్తున్నారు. అయితే మాల్యాను ఎప్పుడు వెనక్కి తీసుకొస్తారనే అంశమై స్పష్టత లేదని తెలుస్తోంది.

మే 14నే మార్గం సుగమం..

మే 14న బ్రిటన్ అత్యున్నత న్యాయస్థానంలో.. తనని భారత్​కు అప్పగించకూడదన్న మాల్యా అప్పీలు వీగిపోయిన సమయంలోనే మాల్యాను భారత్​కు తెచ్చే అంశమై మార్గం సుగమమైంది.

17 భారతీయ బ్యాంకులకు రూ. 9,000కోట్ల రుణాలను ఎగవేశారు మాల్యా. ఈ మొత్తంతో 40 విదేశీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారని అభియోగాలు ఉన్నాయి.

ఇదీ చూడండి: చిన్నారి కష్టం: సోదరుడిని వెతకలేక.. తల్లిని విడవలేక..

పరారీలో ఉన్న రుణఎగవేతదారు, భారతీయ వ్యాపారవేత్త విజయ్ ​మాల్యాను భారత్​కు తీసుకొచ్చే అంశమై న్యాయపరమైన ప్రక్రియ పూర్తయినట్లు తెలుస్తోంది. ఆయనను ఎప్పుడైనా భారత్​కు తీసుకొచ్చే అవకాశం ఉందని ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్​కు చెందిన ఓ అధికారి అనధికారికంగా వెల్లడించినట్లు సమాచారం.

ప్రక్రియ షురూ..

సీబీఐ, ఈడీ మాల్యాను వెనక్కి తెచ్చేందుకు ఇప్పటికే ప్రక్రియ ప్రారంభించాయి. భారత్​కు వచ్చిన వెంటనే కస్టడీకి తీసుకోవాలని సీబీఐ అధికారులు భావిస్తున్నారు. అయితే మాల్యాను ఎప్పుడు వెనక్కి తీసుకొస్తారనే అంశమై స్పష్టత లేదని తెలుస్తోంది.

మే 14నే మార్గం సుగమం..

మే 14న బ్రిటన్ అత్యున్నత న్యాయస్థానంలో.. తనని భారత్​కు అప్పగించకూడదన్న మాల్యా అప్పీలు వీగిపోయిన సమయంలోనే మాల్యాను భారత్​కు తెచ్చే అంశమై మార్గం సుగమమైంది.

17 భారతీయ బ్యాంకులకు రూ. 9,000కోట్ల రుణాలను ఎగవేశారు మాల్యా. ఈ మొత్తంతో 40 విదేశీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారని అభియోగాలు ఉన్నాయి.

ఇదీ చూడండి: చిన్నారి కష్టం: సోదరుడిని వెతకలేక.. తల్లిని విడవలేక..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.