కరోనా సంక్షోభంలోనూ చాలా సంస్థలు వ్యాపార విస్తరణకు ముందడుగు వేస్తున్నాయి. ఐపీఓలకు వచ్చే కొత్త కంపనీలు పెరగటమే ఇందుకు నిదర్శనం. తెలుగు రాష్ట్రాల నుంచి రానున్న రోజుల్లో మూడు సంస్థలు ఐపీఓకు రానున్నాయి. కిమ్స్, దొడ్ల డెయిరీ ఇదె నెలలో ఐపీఓకు వచ్చేందుకు సిద్ధమయ్యాయి. విజయ డయాగ్నోస్టిక్స్ కూడా ఐపీఓ సన్నాహకాలు ముమ్మరం చేసింది.
జూన్ 16 నుంచి కిమ్స్ ఐపీఓ
హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న కిమ్స్ (క్రిష్ణ ఇన్స్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లిమిటెడ్) నెల 16న ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)కు రానుంది. జూన్ 18న ఐపీఓ ముగియనుంది.
మొత్తం రూ.2,144 కోట్లను సమీకరించే లక్ష్యంతో ఐపీఓకు వస్తోంది కిమ్స్. 2,35,60,538 ఈక్విటీ షేర్లను ఇందులో విక్రయించనుంది. షేరు ప్రైస్ బ్యాండ్ను రూ.815-825గా నిర్ణయించింది కిమ్స్.
దొడ్ల డైయిరీ ఐపీఓ లక్ష్యం రూ.520 కోట్లు..
హైదరాబాద్కు చెందిన పాల ఉత్పత్తుల సంస్థ దొడ్ల డెయిరీ కూడా జూన్ 16-18 మధ్య ఐపీఓకు అందుబాటులో ఉండనుంది. రూ.520 కోట్లు సమీకరించే లక్ష్యంతో 1,09,85,444 షేర్లను ఇష్యూ చేయనుంది. షేరు ప్రైస్ బ్యాండ్ను రూ.421-428 మధ్య నిర్ణయించింది కంపెనీ.
దొడ్ల డెయిరీ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు.. కర్ణాటక, మహారాష్ట్రలోనూ కార్యకలాపాలు సాగిస్తోంది.
విజయ డయగ్నోస్టిక్స్ ఐపీఓ ధరఖాస్తు..
హైదరాబాద్ కేంద్రంగా ఉన్న విజయ డయాగ్నోస్టిక్స్ కూడా ఐపీఓకు వచ్చేందుకు సిద్ధమైంది. ఇందుకు సంబంధించి ప్రాథమిక ముసాయిదాను సెబీకి ఇటీవల సమర్పించింది.
ఐపీఓ ద్వారా సంస్థ ప్రమోటర్లు.. డాక్టర్ ఎస్. సురేంద్రనాథ్ రెడ్డి, కారాకోరమ్ లిమిటెడ్ ఇన్వెస్టర్లు, కేధార క్యాపిటల్ ఆల్టర్నెటివ్స్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ 35,688,064 ఇక్విటీ షేర్లను.. విక్రయించనున్నట్లు పేర్కొంది విజయ డయాగ్నోస్టిక్స్. ఈ మొత్తం కంపెనీ వాటాలో 35 శాతానికి సమానం.
విజయ డయాగ్నోస్టిక్స్ ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, దిల్లీ ఎన్సీఆర్, కోల్కతా సహా 13 నగరాల్లో సేవలందిస్తోంది.
2020-21 ఆర్థిక సంవత్సరంలో విజయ డయాగ్నోస్టిక్స్ రూ.84.91 కోట్ల లాభాన్ని గడించింది. ఆదాయం రూ.388.59 కోట్లుగా నమోదైంది.
ఇవీ చదవండి: