ETV Bharat / business

'ఉద్యోగుల టీకా ఖర్చులు మేమే భరిస్తాం' - ఉద్యోగులకు టీకా ఖర్చులు భరించనున్న యాక్సెంచర్​

దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్​ జోరందుకున్న నేపథ్యంలో టెక్​ దిగ్గజాలు ఇన్ఫోసిస్​, యాక్సెంచర్లు కీలక నిర్ణయం తీసుకున్నాయి. తమ సిబ్బందికి కరోనా టీకా కోసమయ్యే ఖర్చులను తామే భరించనున్నట్లు ప్రకటించాయి.

Corona vaccine to  Infosys and Accenture employees for free
ఇన్ఫీ ఉద్యోగులకు కరోనా టీకా ఫ్రీ
author img

By

Published : Mar 4, 2021, 1:51 PM IST

ప్రముఖ ఐటీ దిగ్గజాలు ఇన్ఫోసిస్, యాక్సెంచర్​లు ఉద్యోగుల పట్ల తమ నిబద్ధతను చాటుకున్నాయి. తమ సిబ్బందికి కరోనా టీకా కోసమయ్యే ఖర్చును భరిస్తామని ప్రకటించాయి.

'మా ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు కరోనా టీకా కోసమయ్యే ఖర్చును భరిస్తాం.' అని ఇన్ఫోసిస్​ పేర్కొంది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారమే ఉద్యోగులకు టీకా వేసేందుకు హెల్త్​కేర్ విభాగాలతో భాగస్వామ్యం కుదుర్చుకోనున్నట్లు తెలిపింది.

అమెరికా కేంద్రంగా పని చేస్తున్న మరో టెక్​ దిగ్గజం యాక్సెంచర్​ భారతీయ విభాగం కూడా తమ ఉద్యోగులకు, వారిపై ఆధారపడిన వారికి వ్యాక్సినేషన్​ కోసమయ్యే ఖర్చులు భరించనున్నట్లు తెలిపింది.

భారతీయ అతిపెద్ద టెక్​ దిగ్గజం టీసీఎస్​ కొవిడ్​-19 పరీక్ష, వ్యాక్సినేషన్ నిర్వహణ సూట్​ను ఆవిష్కరించింది. ఇది టెస్టింగ్​ నుంచి వ్యాక్సినేషన్​ వరకు ఉన్న దశలను క్రమబద్దీకరించేందుకు ఉపయోగపడుతుందని వివరించింది. దీనితో వేగంగా పరీక్షలు, వ్యాక్సినేషన్​కు వీలవుతుందని టీసీఎస్​ పేర్కొంది.

ఇదీ చదవండి:జీఎస్​టీ విధిస్తే రూ.75కే లీటర్ పెట్రోల్​!

ప్రముఖ ఐటీ దిగ్గజాలు ఇన్ఫోసిస్, యాక్సెంచర్​లు ఉద్యోగుల పట్ల తమ నిబద్ధతను చాటుకున్నాయి. తమ సిబ్బందికి కరోనా టీకా కోసమయ్యే ఖర్చును భరిస్తామని ప్రకటించాయి.

'మా ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు కరోనా టీకా కోసమయ్యే ఖర్చును భరిస్తాం.' అని ఇన్ఫోసిస్​ పేర్కొంది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారమే ఉద్యోగులకు టీకా వేసేందుకు హెల్త్​కేర్ విభాగాలతో భాగస్వామ్యం కుదుర్చుకోనున్నట్లు తెలిపింది.

అమెరికా కేంద్రంగా పని చేస్తున్న మరో టెక్​ దిగ్గజం యాక్సెంచర్​ భారతీయ విభాగం కూడా తమ ఉద్యోగులకు, వారిపై ఆధారపడిన వారికి వ్యాక్సినేషన్​ కోసమయ్యే ఖర్చులు భరించనున్నట్లు తెలిపింది.

భారతీయ అతిపెద్ద టెక్​ దిగ్గజం టీసీఎస్​ కొవిడ్​-19 పరీక్ష, వ్యాక్సినేషన్ నిర్వహణ సూట్​ను ఆవిష్కరించింది. ఇది టెస్టింగ్​ నుంచి వ్యాక్సినేషన్​ వరకు ఉన్న దశలను క్రమబద్దీకరించేందుకు ఉపయోగపడుతుందని వివరించింది. దీనితో వేగంగా పరీక్షలు, వ్యాక్సినేషన్​కు వీలవుతుందని టీసీఎస్​ పేర్కొంది.

ఇదీ చదవండి:జీఎస్​టీ విధిస్తే రూ.75కే లీటర్ పెట్రోల్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.