భారతీయ కార్పొరేట్ కంపెనీల అంతర్జాతీయ ప్రత్యక్ష పెట్టుబడులు ఈ ఏడాది ఫిబ్రవరిలో 31 శాతం తగ్గినట్లు రిజర్వు బ్యాంక్ డేటాలో వెల్లడైంది. 2021 ఫిబ్రవరిలో భారతీ కార్పొరేట్లు అంతర్జాతీయంగా తమ అనుబంధ కంపెనీల్లో, జాయింట్ వెంచర్లలో 1.85 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టగా.. 2020 ఫిబ్రవరిలో ఈ మొత్తం 2.66 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు ఆర్బీఐ వెల్లడించింది.
ఇందులో 1.36 బిలియన్ డాలర్లు రుణ రూపేణా, 297.37 మిలియన్ డాలర్లు ఈక్విటీ పెట్టుబడులుగా, మిగతా 183.82 మిలియన్ డాలర్లు గ్యారంటీల జారీ ద్వారా పెట్టుబడిగా పెట్టినట్లు ఆర్బీఐ డేటా పేర్కొంది.
టాటా స్టీల్ అత్యధికంగా సింగపూర్లోని దాని అనుబంధ సంస్థలో 1 బిలియన్ డాలర్లు పెట్టుబడిగా పెట్టింది. తర్వాతి స్థానంలో సన్ ఫార్మా అమెరికాలోని దాని సంయుక్త విభాగంలో 100 మిలియన్ డాలర్లు పెట్టుబడిగా పెట్టినట్లు ఆర్బీఐ వివరించింది.
ఇదీ చదవండి:ఎఫ్డీఐల వెల్లువ- 9 నెలల్లో 40% వృద్ధి