ప్రముఖ వాహన తయారీ సంస్థ హ్యూందాయ్ కొత్త సాంకేతికతను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. తొలిసారిగా ఇంటెలిజెంట్ మాన్యువల్ ట్రాన్స్మిషన్(ఐఎంటీ) సాంకేతికత కలిగిన వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వెల్లడించింది. ఎస్యూవీ మోడల్లో మొదటిసారి ఈ అధునాతన సాంకేతికతను వినియోగించినట్లు పేర్కొంది.
దేశంలోనే ఐఎంటీ సాంకేతికతను ప్రవేశపెట్టిన తొలి ఆటోమొబైల్ సంస్థగా హ్యుందాయ్ అవతరించింది. వినియోగదారులకు అనుకూలంగా సులభంగా డ్రైవ్ చేసేలా క్లచ్ పెడల్ లేని సాంకేతికతను తీసుకొచ్చింది. సంప్రదాయ మాన్యువల్ ట్రాన్స్మిషన్ మాదిరిగా డ్రైవర్లు క్లచ్ పెడల్ను నిరంతరం ఉపయోగించాల్సిన అవసరం లేకుండా ఐఎంటీ టెక్నాలజీ పని చేస్తుందని సంస్థ తెలిపింది.
"భవిష్యత్తు వ్యాపార వ్యూహాలతో మానవ కేంద్రీకృత సాంకేతిక పరిజ్ఞానంతో వినియోగదారులకు డ్రైవింగ్లో ఉండే ఇబ్బందులను తొలగించడానికి మేము నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నాం. అటువంటి ప్రయత్నాల్లో ఐఎంటీ ఒకటి."
- ఎస్ఎస్ కిమ్, హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ సీఈఓ
ఈ సాంకేతికతతో డ్రైవర్ మాన్యువల్గా గేర్లు మార్చవచ్చని... ఇది వాహనం వేగాన్ని నియంత్రించేందుకు కూడా పని చేస్తుందని హ్యుందాయ్ తెలిపింది.
ఇదీ చూడండి: జూమ్కు సవాల్- 'జియో మీట్' యాప్ రిలీజ్