ETV Bharat / business

అమెజాన్​తో వివాదంలో 'ఫ్యూచర్'​కు ఊరట

author img

By

Published : Mar 22, 2021, 12:51 PM IST

రిలయన్స్ రిటైల్​తో ఒప్పందం విషయంలో ముందుకెళ్లేలా ఫ్యూచర్​ గ్రూప్​నకు ఊరట లభించింది. అమెజాన్ అభ్యంతరం వల్ల.. ఈ ఒప్పందం విషయంలో ముందుకెళ్లొద్దని దిల్లీ హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం గత వారం వెలువరించిన తీర్పుపై.. డివిజన్​ బెంచ్ స్టే విధించింది.

HC stays order restraining FRL
అమెజాన్​తో వివాదంలో ఫ్యూచర్​ గ్రూప్​కు ఊరట

ఈ-కామర్స్​ దిగ్గజం అమెజాన్​తో వివాదం విషయంలో ఫ్యూచర్​ గ్రూప్​నకు దిల్లీ హైకోర్టు డివిజన్​ బెంచ్​లో ఊరట లభించింది. రిలయన్స్ రిటైల్​తో ఒప్పందం విషయంలో ఏ మాత్రం ముందుకెళ్లొద్దని, కిశోర్​ బియానీ సహా ఇతర ప్రమోటర్ల ఆస్తులను అటాచ్​ చేయాలని ఏకసభ్య ధర్మాసనం గత వారం వెలువరించిన తీర్పుపై డివిజన్​ బెంచ్​ సోమవారం స్టే ఇచ్చింది. ఫ్యూచర్​ గ్రూప్​ అప్పీలుపై స్పందించాలని అమెజాన్​కు నోటీసులు పంపింది.

వివాదం ఇదీ..

రిలయన్స్​ రిటైల్​తో ప్యూచర్​ గ్రూప్ కుదుర్చుకున్న రూ.24,713 కోట్ల ఒప్పందంలో సింగపూర్​ ఆర్బిట్రేషన్​ ప్యానెల్​ తీర్పును సమర్థిస్తూ.. జస్టిస్ ఆర్​జే మిధా నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం గత వారం తీర్పునిచ్చింది. ఫ్యూచర్​ రిటైల్​​ సింగపూర్​ ఆర్బిట్రేటర్స్​ ఆదేశాలను ఉద్దేశపూర్వకంగానే ఉల్లంఘించినట్లు పేర్కొంది. అమెజాన్​ను కాదని.. రిలయన్స్ రిటైల్​తో​ ఒప్పందం విషయంలో ముందుకెళ్లొద్దని ఫ్యూచర్​ గ్రూప్​ను ఆదేశించింది.

ఫ్యూచర్​ గ్రూప్​ అధినేత కిశోర్​ బియానీ సహా ఇతరులు తమ ఆస్తుల వివరాలతో ఏప్రిల్​ 28న కోర్టు ముందు హాజరుకావాలని స్పష్టం చేసింది ఏకసభ్య ధర్మాసనం. అత్యవసర ఆర్బిట్రేటర్స్​ ఆదేశాలను ఉల్లంఘించినందుకు 3 నెలల పాటు ఎందుకు జైలులో పెట్టకూడదో కూడా వివరించాలని బియానీని ఆదేశించింది.

దిల్లీ హైకోర్టు​ ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన ఈ తీర్పును.. డివిజెన్ బెంచ్​లో సవాలు చేసింది ఫ్యూచర్​ రిటైల్​. దీనిపై సోమవారం విచారణ జరిపిన డివిజన్​ బెంచ్ ఫ్యూచర్ రిటైల్​కు అనుకూలంగా తీర్పునిచ్చింది.

ఇవీ చదవండి:

ఈ-కామర్స్​ దిగ్గజం అమెజాన్​తో వివాదం విషయంలో ఫ్యూచర్​ గ్రూప్​నకు దిల్లీ హైకోర్టు డివిజన్​ బెంచ్​లో ఊరట లభించింది. రిలయన్స్ రిటైల్​తో ఒప్పందం విషయంలో ఏ మాత్రం ముందుకెళ్లొద్దని, కిశోర్​ బియానీ సహా ఇతర ప్రమోటర్ల ఆస్తులను అటాచ్​ చేయాలని ఏకసభ్య ధర్మాసనం గత వారం వెలువరించిన తీర్పుపై డివిజన్​ బెంచ్​ సోమవారం స్టే ఇచ్చింది. ఫ్యూచర్​ గ్రూప్​ అప్పీలుపై స్పందించాలని అమెజాన్​కు నోటీసులు పంపింది.

వివాదం ఇదీ..

రిలయన్స్​ రిటైల్​తో ప్యూచర్​ గ్రూప్ కుదుర్చుకున్న రూ.24,713 కోట్ల ఒప్పందంలో సింగపూర్​ ఆర్బిట్రేషన్​ ప్యానెల్​ తీర్పును సమర్థిస్తూ.. జస్టిస్ ఆర్​జే మిధా నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం గత వారం తీర్పునిచ్చింది. ఫ్యూచర్​ రిటైల్​​ సింగపూర్​ ఆర్బిట్రేటర్స్​ ఆదేశాలను ఉద్దేశపూర్వకంగానే ఉల్లంఘించినట్లు పేర్కొంది. అమెజాన్​ను కాదని.. రిలయన్స్ రిటైల్​తో​ ఒప్పందం విషయంలో ముందుకెళ్లొద్దని ఫ్యూచర్​ గ్రూప్​ను ఆదేశించింది.

ఫ్యూచర్​ గ్రూప్​ అధినేత కిశోర్​ బియానీ సహా ఇతరులు తమ ఆస్తుల వివరాలతో ఏప్రిల్​ 28న కోర్టు ముందు హాజరుకావాలని స్పష్టం చేసింది ఏకసభ్య ధర్మాసనం. అత్యవసర ఆర్బిట్రేటర్స్​ ఆదేశాలను ఉల్లంఘించినందుకు 3 నెలల పాటు ఎందుకు జైలులో పెట్టకూడదో కూడా వివరించాలని బియానీని ఆదేశించింది.

దిల్లీ హైకోర్టు​ ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన ఈ తీర్పును.. డివిజెన్ బెంచ్​లో సవాలు చేసింది ఫ్యూచర్​ రిటైల్​. దీనిపై సోమవారం విచారణ జరిపిన డివిజన్​ బెంచ్ ఫ్యూచర్ రిటైల్​కు అనుకూలంగా తీర్పునిచ్చింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.