ఎయిర్ఇండియాలో వాటా కొనుగోలుపై ఆసక్తి లేదని ఖతర్ ఎయిర్వేస్ స్పష్టం చేసింది. ఈ మేరకు సంస్థ సీఈఓ అక్బర్ అల్ బాకర్ అధికారిక ప్రకటన చేశారు.
ప్రభుత్వాధినంలోని ఎయిర్ఇండియాలో పెట్టుబడులను ఉపసంహరించుకోవాలని కేంద్రం భావిస్తోంది. ఇందుకోసం ఎయిర్ ఇండియాలో వాటాలు కొనుగోలు చేయాలని సింగపూర్, లండన్లలో రోడ్ షోలు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో వాటా కొనుగోలుపై ఆసక్తిలేదని ఖతర్ ఎయిర్వేస్ స్పష్టం చేసింది. అప్పుల్లో కూరుకుపోయిన ఎయిర్ ఇండియాను గట్టెక్కించేందుకు సంస్థలో వాటాను విక్రయించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోన్న విషయం తెలిసిందే.
అయితే ఇండిగో సంస్థలో పెట్టుబడులకు మాత్రం ఆసక్తిగా ఉన్నట్లు ఖతర్ ఎయిర్వేస్ వెల్లడించింది. కానీ ఇండిగో ప్రమోటర్ల మధ్య వివాదం తలెత్తిన నేపథ్యంలో పెట్టడులకు ఇది సరైన సమయం కాదని భావిస్తున్నట్లు తెలిపింది.
దేశంలో ప్రస్తుతం 48 శాతం దేశీయ మార్కెట్ వాటాతో ఇండిగో అగ్రస్థానంలో ఉంది. ఇటీవలే కొత్త విమానాలకు భారీ ఆర్డర్ ఇచ్చింది ఇండిగో.
ఇదీ చూడండి: సెన్సెక్స్ సరికొత్త రికార్డు.. 12 వేల మార్క్ దాటిన నిఫ్టీ