ETV Bharat / business

IT Rules 2021: 'కొత్త నిబంధనలు గూగుల్​కు వర్తించవు' - గూగుల్​ ఢిల్లీ హైకోర్టు

కేంద్రం ప్రవేశపెట్టిన కొత్త ఐటీ నిబంధనలు(IT Rules 2021) తమ సెర్చ్​ ఇంజిన్​కు వర్తించవని గూగుల్​ పేర్కొంది. ఇటీవల దిల్లీ హైకోర్టులో సింగిల్​ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్​ చేస్తూ దాఖలైన పిటిషన్​పై ధర్మాసనం విచారణ చేపట్టింది.

google to delhi high court, గూగుల్​ సెర్చ్​ ఇంజిన్​ ఐటీ రూల్స్​
దిల్లీ హైకోర్టు తీర్పుపై గూగుల్​ విజ్ఞప్తి
author img

By

Published : Jun 2, 2021, 12:57 PM IST

గూగుల్​కు ఐటీ నిబంధనలు(IT Rules 2021) వర్తిపంజేస్తూ ఇదివరకు దిల్లీ హైకోర్టు సింగిల్​ జడ్జి ఇచ్చిన ఆదేశాలను ఆ సంస్థ సవాల్​ చేసింది. కేంద్రం విధించిన నిబంధనలు తమ సెర్చ్​ ఇంజిన్​కు వర్తించవని పేర్కొంది. సింగిల్​ జడ్జి ఇచ్చిన తీర్పుపై ధర్మాసనం స్టే విధించాలని విజ్ఞప్తి చేసింది. ఆ న్యాయమూర్తి తమ సంస్థను సామాజిక మాధ్యమాల కిందకు వస్తుందని తప్పుగా పేర్కొన్నారని తెలిపింది. ఈ పిటిషన్​పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ డీఎన్​ పటేల్​, జస్టీస్​ జ్యోతి సింగ్​ల ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టిన సందర్భంగా గూగుల్​ ఈ వాదనలు వినిపించింది.

గూగుల్​ వాదనలపై స్పందించిన ధర్మాసనం బాధిత మహిళ, సంబంధిత పోర్నోగ్రఫిక్​ సైట్​ సహా ఫేస్​బుక్​, కేంద్రం, దిల్లీ ప్రభుత్వం, ఇంటర్నెట్​ సర్వీస్​ ప్రొవైడర్స్​ అసోసియేషన్ ఆఫ్​ ఇండియాకు నోటీసులు జారీ చేసింది. జూలై 25లోగా దీనిపై స్పందించాలని ఆదేశించింది. సింగిల్​ జడ్జి ఆదేశాలపై స్టే ఇచ్చే అవకాశం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది.

ఇటీవల ఓ మహిళ తన చిత్రాలను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పోర్నోగ్రఫిక్​ సైట్లలో అప్లోడ్​ చేశారని పేర్కొంటూ కోర్టును ఆశ్రయించింది. తక్షణం ఆ చిత్రాలను అంతర్జాలం నుంచి తొలగించాలని కోర్టు ఆదేశించినా.. పూర్తిస్థాయిలో అది అమలు కాలేదు. దీంతో న్యాయమూర్తి గూగుల్​కు కొత్త ఐటీ నిబంధనలు(IT Rules 2021) వర్తిస్తాయని, ఈ మేరకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

ఇదీ చదవండి : New IT Rules: ట్విట్టర్​కు హైకోర్టు షాక్!

గూగుల్​కు ఐటీ నిబంధనలు(IT Rules 2021) వర్తిపంజేస్తూ ఇదివరకు దిల్లీ హైకోర్టు సింగిల్​ జడ్జి ఇచ్చిన ఆదేశాలను ఆ సంస్థ సవాల్​ చేసింది. కేంద్రం విధించిన నిబంధనలు తమ సెర్చ్​ ఇంజిన్​కు వర్తించవని పేర్కొంది. సింగిల్​ జడ్జి ఇచ్చిన తీర్పుపై ధర్మాసనం స్టే విధించాలని విజ్ఞప్తి చేసింది. ఆ న్యాయమూర్తి తమ సంస్థను సామాజిక మాధ్యమాల కిందకు వస్తుందని తప్పుగా పేర్కొన్నారని తెలిపింది. ఈ పిటిషన్​పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ డీఎన్​ పటేల్​, జస్టీస్​ జ్యోతి సింగ్​ల ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టిన సందర్భంగా గూగుల్​ ఈ వాదనలు వినిపించింది.

గూగుల్​ వాదనలపై స్పందించిన ధర్మాసనం బాధిత మహిళ, సంబంధిత పోర్నోగ్రఫిక్​ సైట్​ సహా ఫేస్​బుక్​, కేంద్రం, దిల్లీ ప్రభుత్వం, ఇంటర్నెట్​ సర్వీస్​ ప్రొవైడర్స్​ అసోసియేషన్ ఆఫ్​ ఇండియాకు నోటీసులు జారీ చేసింది. జూలై 25లోగా దీనిపై స్పందించాలని ఆదేశించింది. సింగిల్​ జడ్జి ఆదేశాలపై స్టే ఇచ్చే అవకాశం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది.

ఇటీవల ఓ మహిళ తన చిత్రాలను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పోర్నోగ్రఫిక్​ సైట్లలో అప్లోడ్​ చేశారని పేర్కొంటూ కోర్టును ఆశ్రయించింది. తక్షణం ఆ చిత్రాలను అంతర్జాలం నుంచి తొలగించాలని కోర్టు ఆదేశించినా.. పూర్తిస్థాయిలో అది అమలు కాలేదు. దీంతో న్యాయమూర్తి గూగుల్​కు కొత్త ఐటీ నిబంధనలు(IT Rules 2021) వర్తిస్తాయని, ఈ మేరకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

ఇదీ చదవండి : New IT Rules: ట్విట్టర్​కు హైకోర్టు షాక్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.