భారత అంతరిక్ష పరిశోధన సంస్థ 'ఇస్రో' మాజీ ఛైర్మన్ కె.కస్తూరీ రంగన్ ఎన్ఐఐటీ విశ్వవిద్యాలయ నూతన ఛైర్పర్సన్గా నియమితులయ్యారు. రాజస్థాన్లోని నిమరణలో జరిగిన యూనివర్సిటీ 11 వార్షిక లెక్చర్లో అధికారికంగా ఈ ప్రకటన వెలువడింది. పార్లమెంట్ మాజీ సభ్యుడు కరణ్ సింగ్ స్థానంలో.. కస్తూరీ రంగన్ ఈ పదవికి ఎంపికైనట్లు ప్రకటన పేర్కొంది.
కస్తూరీ రంగన్ 1994 నుంచి 2003 వరకు ఇస్రో ఛైర్మన్గా వ్యవహరించారు. ఆయన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వ అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మవిభూషణ్ దక్కింది.
కస్తూరీ రంగన్ అనుభవం ఎన్ఐఐటీ దృక్పథాన్ని.. విలువలను మరింత బలోపేతం చేసేందుకు దోహదం చేస్తాయని.. యూనివర్సిటీ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ రాజేంద్ర ఎస్ పవార్ అశాభావం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి:వాట్సాప్ వెబ్లో ఈ ట్రిక్లు తెలుసా?