ETV Bharat / business

ఎమిరేట్స్​ ఎయిర్​కు 30 ఏళ్లలో అత్యధిక నష్టం! - 2021లో ఎమిరేట్స్​ ఎయిర్​నష్టం

ప్రపంచంలోనే అతిపెద్ద విమానయాన సంస్థల్లో ఒకటైన ఎమిరేట్స్ ఎయిర్​లైన్​ రికార్డు స్థాయిలో నష్టాలను మూటగట్టుకుంది. కరోనా ప్రభావంతో ఏడాది కాలంలో 5.5 బిలియన్ డాలర్లు (రూ.40 వేల కోట్ల పైమాటే) నష్టపోయినట్లు తెలిపింది. నిర్వహణ ఖర్చులు తగ్గించుకున్నా ఈ స్థాయిలో నష్టాలు వచ్చినట్లు వివరించింది.

Record level Lose to Emirates Air
ఎమిరేట్స్ ఎయిర్​కు రికార్డు స్థాయి నష్టాలు
author img

By

Published : Jun 15, 2021, 2:43 PM IST

ప్రపంచవ్యాప్తంగా విమానయాన సంస్థలను కరోనా మహమ్మారి ఓ కుదుపునకు గురి చేసింది. దుబాయ్​ కేంద్రంగా పని చేస్తున్న ఎమిరేట్స్ ఎయిర్​లైన్స్​​ గత ఏడాది కాలంలో 5.5 బిలియన్ డాలర్ల నష్టాన్ని నమోదు చేసినట్లు మంగళవారం ప్రకటించింది. గత మూడు దశాబ్దాల కాలంలో ఎమిరేట్స్​కు ఇదే అతి పెద్ద నష్టం. పశ్చిమాసియాలోనే ఎమిరేట్స్ అతిపెద్ద విమానయాన సంస్థ కావడం గమనార్హం.

ఏడాది కాలంలో ఆదాయం 66 శాతం తగ్గినట్లు వెల్లడించింది ఎమిరేట్స్​. కరోనా ప్రభావంతో ప్రయాణాలపై పలు దేశాలు ఆంక్షలు విధించడం ఇందుకు కారణంగా పేర్కొంది. నిర్వహణ ఖర్చులు 46 శాతం తగ్గించుకున్నా.. ఆదాయం 8.4 బిలియన్​ డాలర్లు క్షీణించినట్లు వివరించింది.

క్రితం ఏడాదితో పోలిస్తే ప్యాసింజర్​, కార్గో రవాణా 58 శాతం తగ్గిందని ఎమిరేట్స్ వెల్లడించింది. ఈ ఏడాది కాలానికి ముందు సంస్థ లాభం 288 మిలియన్​ డాలర్లుగా నమోదైనట్లు తెలిపింది.

కరోనా తర్వాత ఏడాది కాలంలో 66 లక్షల మంది మాత్రమే తమ విమానాల్లో ప్రయాణించిననట్లు పేర్కొంది ఎమిరేట్స్. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 90 శాతం తక్కువని వివరించింది. ప్రస్తుతం ఈ సంస్థ 259 విమానాలను (కార్గోతో కలిపి) నిర్వహిస్తోంది.

ఇదీ చదవండి:Galwan Clash: 'మేడ్ ఇన్​ చైనా వస్తువులు మాకొద్దు'

ప్రపంచవ్యాప్తంగా విమానయాన సంస్థలను కరోనా మహమ్మారి ఓ కుదుపునకు గురి చేసింది. దుబాయ్​ కేంద్రంగా పని చేస్తున్న ఎమిరేట్స్ ఎయిర్​లైన్స్​​ గత ఏడాది కాలంలో 5.5 బిలియన్ డాలర్ల నష్టాన్ని నమోదు చేసినట్లు మంగళవారం ప్రకటించింది. గత మూడు దశాబ్దాల కాలంలో ఎమిరేట్స్​కు ఇదే అతి పెద్ద నష్టం. పశ్చిమాసియాలోనే ఎమిరేట్స్ అతిపెద్ద విమానయాన సంస్థ కావడం గమనార్హం.

ఏడాది కాలంలో ఆదాయం 66 శాతం తగ్గినట్లు వెల్లడించింది ఎమిరేట్స్​. కరోనా ప్రభావంతో ప్రయాణాలపై పలు దేశాలు ఆంక్షలు విధించడం ఇందుకు కారణంగా పేర్కొంది. నిర్వహణ ఖర్చులు 46 శాతం తగ్గించుకున్నా.. ఆదాయం 8.4 బిలియన్​ డాలర్లు క్షీణించినట్లు వివరించింది.

క్రితం ఏడాదితో పోలిస్తే ప్యాసింజర్​, కార్గో రవాణా 58 శాతం తగ్గిందని ఎమిరేట్స్ వెల్లడించింది. ఈ ఏడాది కాలానికి ముందు సంస్థ లాభం 288 మిలియన్​ డాలర్లుగా నమోదైనట్లు తెలిపింది.

కరోనా తర్వాత ఏడాది కాలంలో 66 లక్షల మంది మాత్రమే తమ విమానాల్లో ప్రయాణించిననట్లు పేర్కొంది ఎమిరేట్స్. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 90 శాతం తక్కువని వివరించింది. ప్రస్తుతం ఈ సంస్థ 259 విమానాలను (కార్గోతో కలిపి) నిర్వహిస్తోంది.

ఇదీ చదవండి:Galwan Clash: 'మేడ్ ఇన్​ చైనా వస్తువులు మాకొద్దు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.