ETV Bharat / business

మాస్క్​ వినియోగంపై  అంకురాల 'అప్నామాస్క్​' ట్రెండ్​!

author img

By

Published : May 4, 2020, 2:52 PM IST

అర్బన్​​ కంపెనీ, మేక్​మై ట్రిప్​, డంజో, హెల్తీఫైమీ, జొమాటో వంటి అంతర్జాల సంస్థలు తమ సామాజిక మాధ్యమాల ఖాతాలు, యాప్​ ఐకాన్లలో మార్పులు చేసి.. మాస్క్​ ప్రాముఖ్యంపై అవగాహన కల్పిస్తున్నాయి. అప్నా మాస్క్​ కార్యక్రమంలో భాగంగా సరికొత్తగా ప్రయత్నిస్తున్నాయి. ఈ ఇనిషియేటివ్​కు నెటిజన్ల నుంచి విశేష స్పందన లభిస్తోంది.

face masks
'అప్నామాస్క్'​తో ఇంట్లో చేసిన మాస్కులపై అంతర్జాల సంస్థల ప్రచారం!

అర్బన్​ కంపనీ, మేక్​మై ట్రిప్​, డంజో, హెల్తీఫైమీ, జొమాటో, రెడ్​ బస్​, ఐక్జిగో, మనీట్యాప్​, మైఉప్​చార్​, బౌన్స్​, రాజోర్​పే, మేదాంత, విట్టీఫీడ్​, ఎల్​బీబీ, పోర్టర్​, మీషో, డైలీ హంట్​, 1ఎంజీ, పేటీఎం గేమ్స్​...అన్నీ స్టార్టప్​ సంస్థలు. కొన్నైతే ప్రత్యర్థులు కూడా. అయినా.. ఇవన్నీ ఒక విషయంలో ఏకతాటిపై నడుస్తున్నాయి. కరోనా సమయంలో.. మాస్కు, భౌతిక దూరం ఆవశ్యకతను తెలిపేందుకు ఉన్న అవకాశాలన్నింటినీ ఉపయోగించుకుంటున్నాయి. ఇందులో మొదటిది.. సామాజిక మాధ్యమ ఖాతాలు, యాప్​ ఐకాన్స్​లో మార్పులు చేయడం.

ఈ స్టార్టప్​ల వెనకుండి నడిపిస్తోంది అప్నా మాస్క్​ కార్యక్రమం. ఇంట్లో తయారు చేసిన మాస్కులపై అవగాహన కల్పించేందుకు ప్రారంభమైన ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. అసలు ఏమిటీ అప్నా మాస్క్​?

ప్రతి ఒక్కరు మాస్కులు ధరించాలనే లక్ష్యంతో 'స్టార్టప్​వర్సెస్​​కొవిడ్'​ స్టార్టప్​ కమ్యూనిటీ... సామాజిక మాధ్యమాల వేదికగా అప్నామాస్క్​ పేరిట వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో వెయ్యి మంది వరకు సభ్యులు ఉన్నారు. ఇంట్లోనే తయారు చేసుకున్న మాస్కును ధరించటం, బయటికి వెళ్లిన క్రమంలో సురక్షితంగా ఉండేలా ప్రజల్లో అవగాహన కల్పించటం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం.

# అప్నాదేశ్​అప్నామాస్క్​..

అప్నామాస్క్​ కార్యక్రమంలో భాగంగా.. #అప్నాదేశ్అప్నామాస్క్ యాష్​ ట్యాగ్​తో సామాజిక మాధ్యమాల్లో ప్రచారాన్ని ప్రారంభించారు పలు అంకుర సంస్థల అధినేతలు. ఇంట్లోనే మాస్క్​ తయారు చేసుకుని.. బయటికి వెళ్లిన ప్రతి సారి ధరించాలని కోరుతూ.. వీడియో సందేశాలు అందిస్తున్నారు. ఇందులో సెకోషియా ఇండియాకు చెందిన రాజన్​ ఆనందన్​, పేటీఎం- విజయ్​ శేఖర్​ శర్మ, ఇండిఫై- అలోక్​ మిట్టల్​ వంటి ఇతర సంస్థల ప్రముఖులు ఉన్నారు.

విద్యాబాలన్​ అవగాహన..

సామాజిక మాధ్యమాల్లో అప్నామాస్క్​ ప్రచార జోరును తెలుసుకున్న ప్రముఖ నటి విద్యాబాలన్​ ఆ కార్యక్రమంలో చేరారు. ఇంట్లోనే మాస్క్​ తయారు చేయటం ఎలాగో చెబుతూ.. అప్నాదేశ్​, అప్నమాస్క్​ యాష్​ ట్యాగ్​ ద్వారా వీడియో సందేశం అందించారు.

ఆమెతో పాటు దియా మీర్జా, జుహీ చావ్లా, దివ్య ఖోస్లాకుమార్​, దీపికా దేశ్​ముఖ్​, సోనూ సూద్, షమా సికందర్​, ప్రీతికా రావు​ వంటి సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో చేశారు.

రెండు వారాల్లోనే 10 కోట్ల మంది..

కేవలం రెండు వారాల్లోనే.. అప్నాదేశ్​అప్నామాస్క్​ ప్రచారానికి సుమారు 10 కోట్ల మంది జత చేరారు. అయితే.. ఈ ప్రచారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఇంకొన్ని సంస్థలు తమతో చేతులు కలపాలని కోరుతున్నారు బృందం సభ్యులు.

"మా ప్రయత్నానికి భారీ స్పందన వస్తోంది. మరిన్ని సంస్థలు మా అప్నామాస్క్​ కార్యక్రమంలో చేరనున్నాయి. ఇంట్లో తయారు చేసిన మాస్కులు ధరించాలనే ఆలోచన ప్రజల్లో కలిగించేందుకు మా ఈ చర్యలు ఉపయోగపడతాయనే నమ్మకం ఉంది."

– పూనమ్​ కౌల్​, అప్నామాస్క్​ సహ వ్యవస్థాపకురాలు.

క్రౌడేరా సాయం..

కరోనాపై పోరులో భాగంగా వ్యక్తిగతంగా, కుటుంబాలకు, ఆరోగ్య సిబ్బందికి సాయం చేస్తోన్న సంస్థలు, ఎన్​జీఓలకు తమ వంతుగా నిధుల సేకరణ సాంకేతిక పరిష్కారాలను ఉచితంగా అందిస్తామని ఆన్​లైన్​ నిధుల సమీకరణ సంస్థ క్రౌడేరా ప్రకటించింది. సుమారు కోటి రూపాయల విలువైన ఉత్పత్తులు, సేవలను అందించనున్నట్లు తెలిపింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.