ETV Bharat / business

భారత్​ లక్ష్యంగా యాపిల్ నుంచి రెండు బడ్జెట్​ ఫోన్లు!

author img

By

Published : Jan 4, 2020, 12:00 PM IST

భారత మార్కెట్ లక్ష్యంగా ఈ ఏడాది రెండు కొత్త ఐఫోన్​ మోడళ్లను తీసుకువచ్చేందుకు యాపిల్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. 2020లో మొత్తం 6 ఐఫోన్​ మోడళ్లను తీసుకురానున్నట్లు సమాచారం.

IPHOEN
యాపిల్​

లగ్జరీ గాడ్జెట్స్​ తయారీ సంస్థ యాపిల్ ఈ ఏడాది భారీగా కొత్త మోడల్ ఐఫోన్లను తీసుకువచ్చే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. పలు టెక్​ వార్తా సంస్థల ప్రకారం ఈ ఏడాది మొత్తం 6 ఐఫోన్లను​ మార్కెట్లోకి తెచ్చేందుకు యాపిల్​ ప్రణాళికలు చేస్తోంది. విశేషమేంటంటే.. వీటిలో రెండు మోడళ్లు సరసమైన ధరల్లో అందుబాటులోకి రానున్నాయి.

నాలుగు ప్రీమియం మోడళ్లు ఓఎల్​ఈడీ తెర.. తక్కువ ధర మోడళ్లలో ఎల్​​సీడీ డిస్​ప్లేలను కలిగి ఉండే అవకాశముంది.

తక్కువ ధర ఫోన్లు ఎలా ఉండనున్నాయంటే..

యాపిల్ వర్గాల సమాచారం ప్రకారం.. ఎస్​ఈ సిరీస్​ కొనసాగింపులో భాగంగా రెండు బడ్జెట్​ ఫోన్లను తీసుకురానుంది. ఇందులో ఒకటి 5.5 అంగుళాలు, మరొకటి 6.1 అంగుళాల తెరతో రానున్నాయి. ఇంతకు ముందూ.. యాపిల్​ 2020లో 5 ఐఫోన్​ మోడళ్లను తీసుకురానుందనే వార్తలొచ్చాయి. వాటిలో కనీసం రెండు మోడళ్లు 5జీ వేరియంట్లు.. వేరు వేరు ధరల సెగ్మెంట్​లో రానున్నట్లు అవి పేర్కొన్నాయి.

యాపిల్ సంస్థ కూడా..

ఐఫోన్​ ఎస్​ఈకి కొనసాగింపుగా మిడ్​ రేంజ్​లో ఓ మోడల్​ను తీసుకురానున్నట్లు వెల్లడించింది. అయితే తాజా సమాచారం ప్రకారం మిడ్​ రేంజ్​లో రెండు స్మార్ట్​ ఫోన్లను తీసుకురాన్నట్లు తెలుస్తోంది.

ఇప్పుడున్న సమాచారం ప్రకారం.. ఐఫోన్​ ఎస్​ఈకి కొనసాగింపుగా ఐఫోన్​ 9, ఐఫోన్​ 9ప్రో పేరుతో రానున్నాయి. వీటితో పాటు ఈ ఏడాది పలు కొత్త మోడళ్లను తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఇవన్నీ భారత మార్కెట్లో యాపిల్​కు ఏ మేరకు దోహదం చేస్తాయో వేచి చూడాలి.

ఇదీ చూడండి:2636 ఛార్జింగ్‌ కేంద్రాల ఏర్పాటుకు కేంద్రం గ్రీన్​సిగ్నల్​

లగ్జరీ గాడ్జెట్స్​ తయారీ సంస్థ యాపిల్ ఈ ఏడాది భారీగా కొత్త మోడల్ ఐఫోన్లను తీసుకువచ్చే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. పలు టెక్​ వార్తా సంస్థల ప్రకారం ఈ ఏడాది మొత్తం 6 ఐఫోన్లను​ మార్కెట్లోకి తెచ్చేందుకు యాపిల్​ ప్రణాళికలు చేస్తోంది. విశేషమేంటంటే.. వీటిలో రెండు మోడళ్లు సరసమైన ధరల్లో అందుబాటులోకి రానున్నాయి.

నాలుగు ప్రీమియం మోడళ్లు ఓఎల్​ఈడీ తెర.. తక్కువ ధర మోడళ్లలో ఎల్​​సీడీ డిస్​ప్లేలను కలిగి ఉండే అవకాశముంది.

తక్కువ ధర ఫోన్లు ఎలా ఉండనున్నాయంటే..

యాపిల్ వర్గాల సమాచారం ప్రకారం.. ఎస్​ఈ సిరీస్​ కొనసాగింపులో భాగంగా రెండు బడ్జెట్​ ఫోన్లను తీసుకురానుంది. ఇందులో ఒకటి 5.5 అంగుళాలు, మరొకటి 6.1 అంగుళాల తెరతో రానున్నాయి. ఇంతకు ముందూ.. యాపిల్​ 2020లో 5 ఐఫోన్​ మోడళ్లను తీసుకురానుందనే వార్తలొచ్చాయి. వాటిలో కనీసం రెండు మోడళ్లు 5జీ వేరియంట్లు.. వేరు వేరు ధరల సెగ్మెంట్​లో రానున్నట్లు అవి పేర్కొన్నాయి.

యాపిల్ సంస్థ కూడా..

ఐఫోన్​ ఎస్​ఈకి కొనసాగింపుగా మిడ్​ రేంజ్​లో ఓ మోడల్​ను తీసుకురానున్నట్లు వెల్లడించింది. అయితే తాజా సమాచారం ప్రకారం మిడ్​ రేంజ్​లో రెండు స్మార్ట్​ ఫోన్లను తీసుకురాన్నట్లు తెలుస్తోంది.

ఇప్పుడున్న సమాచారం ప్రకారం.. ఐఫోన్​ ఎస్​ఈకి కొనసాగింపుగా ఐఫోన్​ 9, ఐఫోన్​ 9ప్రో పేరుతో రానున్నాయి. వీటితో పాటు ఈ ఏడాది పలు కొత్త మోడళ్లను తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఇవన్నీ భారత మార్కెట్లో యాపిల్​కు ఏ మేరకు దోహదం చేస్తాయో వేచి చూడాలి.

ఇదీ చూడండి:2636 ఛార్జింగ్‌ కేంద్రాల ఏర్పాటుకు కేంద్రం గ్రీన్​సిగ్నల్​

New Delhi, Jan 04 (ANI): Actor Sara Ali Khan is sliding into the weekend in style as she is seen having a refreshing time in the clear blue seawater of Maldives. The actor took to Instagram on Friday to share another bout of her dreamy vacation pictures with her brother Ibrahim Ali Khan. "I always got your back," the 'Simmba' actor captioned the post expressing never-ending support to her brother. The actor looked drop-dead gorgeous in a striped-line design bikini.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.