భారత్లో కొన్ని హై-ఎండ్ ఐఫోన్ మోడళ్ల ధరలను పెంచింది యాపిల్ సంస్థ. కేంద్ర బడ్జెట్- 2020లో సాంఘిక సంక్షేమ సర్చార్జితో పాటు దిగుమతి చేసుకున్న మొబైల్ ఫోన్లు, ఛార్జర్లపై సుంకాలను పెంచింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ఐఫోన్ 11 ప్రో, ఐఫోన్ 11 ప్రో మ్యాక్స్, ఐఫోన్ 8 ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది యాపిల్. పెరిగిన ధరలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి.
ఐఫోన్ 11 ప్రో మ్యాక్స్..
ఐఫోన్ 11 ప్రో మ్యాక్స్ మోడల్ ప్రారంభ ధర తొలుత రూ.1,09,900గా ఉండేది. ప్రస్తుతం ధరలు ఇలా..
- 64జీబీ వేరియంట్- రూ.1,11,200
- 256జీబీ వేరియంట్- రూ.1,25,200
- 512జీబీ వేరియంట్- రూ.1,43,200
ఐఫోన్ 11 ప్రో..
ఐఫోన్ 11 ప్రో మోడళ్ల ప్రారంభ ధర రూ.99,900గా ఉండేది. వీటిపై దాదాపు రూ.1,300 మేర పెంచింది యాపిల్.
- 64జీబీ వేరియంట్- రూ.1,01,200
- 256జీబీ వేరియంట్- రూ.1,15,200
- 512జీబీ వేరియంట్- రూ.1,33,200
ఐఫోన్ 8
ఐఫోన్ 8 ప్లస్ (64జీబీ) ధర రూ.50,600.. 128జీబీ ధర రూ.55,600గా ఉంది. ఐఫోన్ 8 (64జీబీ) ధర రూ.40,500.. 128జీబీ ధర రూ.45,500గా ఉంది.
వీటి ధరల్లో మార్పు లేదు..
యాపిల్ సరఫరాదారులు ఫాక్స్కాన్, విస్ట్రాన్.. భారత్లోనే ఐఫోన్ ఎక్స్ఆర్, ఐఫోన్ 7 తయారు చేస్తున్నాయి. ఫలితంగా వీటి ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు యాపిల్. వీటితో పాటు ఐఫోన్ 11, ఐప్యాడ్, యాపిల్ వాచ్, మ్యాక్ డెస్క్టాప్ ధరలనూ పెంచలేదు.
కరోనా ప్రభావేమీ లేదు..
ధరల పెంపునకు కరోనా వైరస్ కారణం కాదని కంపెనీ వర్గాలు తెలిపాయి. కస్టమ్ సుంకాల వల్లే ధరలు పెరిగాయని స్పష్టం చేశాయి.
తొలుత మొబైల్ ఫోన్లకు సంబంధించి 10 శాతం సేవా సంక్షేమ రుసుముగా చెల్లించే పన్నుపై మినహాయింపు ఇచ్చింది ప్రభుత్వం. మొబైల్ ఫోన్ దిగుమతులపై 20 శాతం కస్టమ్ సుంకాలుగా తిరిగి వడ్డించింది. పీసీబీఏ(ప్రింటెడ్ సర్య్కూట్ బోర్డ్ అసెంబ్లీ)పై 10 శాతంగా ఉన్న కస్టమ్స్ సుంకాన్ని 20శాతానికి పెంచింది.
ఇదీ చూడండి: ఈపీఎఫ్ డిపాజిట్లపై వడ్డీ రేటు మళ్లీ 8.65 శాతమే!