కరోనా నేపథ్యంలో విధించిన లాక్డౌన్ వల్ల రద్దయిన విమానాలకు ముందే టికెట్ బుక్ చేసుకున్న పాసింజర్లలో 74.3 శాతం మందికి రీఫండ్ ఇచ్చాయి విమాన సంస్థలు. ఈ విషయాన్ని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ శుక్రవారం వెల్లడించింది. మొత్తం రూ.3,200 కోట్లను రీఫండ్ ద్వారా వారికి అందించినట్లు వివరించింది.
మార్చి 25 నుంచి మే 24 మధ్య రద్దయిన విమానాలకు టికెట్ బుక్ చేసుకున్న వారికి మాత్రమే ఈ రీఫండ్ ఇచ్చినట్లు తెలిపింది.
లాక్డౌన్ కాలంలో దేశీయ-విదేశీ ప్రయాణాల కోసం బుక్ చేసుకున్న టికెట్లకు సంబంధించిన నగదును.. వినియోగదారులకు విమాన సంస్థలే పూర్తిగా రీఫండ్ చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ ఆదేశాలకు అనుగుణంగా విమాన సంస్థలు రీఫండ్ ఇచ్చినట్లు తెలిపింది మంత్రిత్వ శాఖ. మిగతా వారికీ.. త్వరలోనే రీఫండ్ చేయనున్నట్లు పేర్కొంది.
ఇదీ చూడండి:'రూ.1.45 లక్షల కోట్ల పన్ను రీఫండ్'