ETV Bharat / business

రిలయన్స్- ఆరాంకో డీల్​కు బ్రేక్​.. కారణం అదే!

author img

By

Published : Nov 20, 2021, 4:05 PM IST

సౌదీ అరామ్​కోకు తన 20 శాతం వాటా విక్రయించేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance-Aramco deal) జరుపుతున్న ప్రయత్నాలు మధ్యలోనే ఆగిపోయాయి. ఆయిల్​ టు కెమికల్(ఓ2సీ) వ్యాపారాల్లో ప్రతిపాదిత పెట్టుబడులను మళ్లీ లెక్కిస్తే ఇరు పక్షాలకు ప్రయోజనకరంగా ఉంటుందని సౌదీ అరామ్​కో, రిలయన్స్ నిర్ణయించాయి.

Reliance-Aramco deal latest news
రిలయన్స్- ఆరాంకో డీల్

సౌదీ అరామ్​కోకు తన 20 శాతం వాటా (Reliance-Aramco deal) విక్రయించేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ జరుపుతున్న ప్రయత్నాలు మధ్యలోనే ఆగిపోయాయి. తన చమురు శుద్ధి, పెట్రో కెమికల్ వ్యాపారాల్లో 20శాతా వాటాను విక్రయించి, 15 బిలియన్ డాలర్లను సమీకరించాలని రిలయన్స్ ఆశించింది. అయితే.. ఈ ప్రయత్నాలు విరమించుకున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ తెలిపింది.

"ఆయిల్​ టు కెమికల్(ఓ2సీ) వ్యాపారాల్లో ప్రతిపాదిత పెట్టుబడులను మళ్లీ లెక్కిస్తే ఇరు పక్షాలకు ప్రయోజనకరంగా ఉంటుందని సౌదీ అరామ్​కో, రిలయన్స్ నిర్ణయించుకున్నాయి. భారత ప్రైవేట్ రంగంలో పెట్టుబడులకు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎప్పటికీ ప్రాధాన్య భాగస్వామిగా ఉంటుంది."

-రిలయన్స్ ఇండస్ట్రీస్.

తమ ఆయిల్ టు కెమికల్ వ్యాపారంలో 20శాతం వాటాను (Reliance-Aramco deal latest news) సౌదీ అరామ్​కో విక్రయించడానికి ప్రయత్నాలు చేస్తున్నామని 2019లో జరిగిన రిలయన్స్​ వార్షిక సర్వసభ్య సమావేశంలో(ఏజీఎం) రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ప్రకటించారు. 2020 మార్చి నాటికి ఈ ఒప్పందం ముగుస్తుందని చెప్పారు.

అయితే.. ఆ నిర్దేశించుకున్న గడువును రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance-Aramco deal news) చేరుకోలేకపోయింది. అందుకు కరోనానే కారణమని చెప్పింది. ఈ ఏడాది చివరినాటికి ఈ ఒప్పందం జరుగుతుందని ఈ ఏడాది జరిగిన ఏజీఎంలోనూ అంబానీ తెలిపారు. అయితే.. ఈ ప్రయత్నాలు కూడా ఆగిపోయాయి.

ఇదీ చదవండి:ప్రధాని మానసపుత్రిక ' ఐఎఫ్​ఎస్​సీ ' పురోగతిపై కీలక చర్చ!

సౌదీ అరామ్​కోకు తన 20 శాతం వాటా (Reliance-Aramco deal) విక్రయించేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ జరుపుతున్న ప్రయత్నాలు మధ్యలోనే ఆగిపోయాయి. తన చమురు శుద్ధి, పెట్రో కెమికల్ వ్యాపారాల్లో 20శాతా వాటాను విక్రయించి, 15 బిలియన్ డాలర్లను సమీకరించాలని రిలయన్స్ ఆశించింది. అయితే.. ఈ ప్రయత్నాలు విరమించుకున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ తెలిపింది.

"ఆయిల్​ టు కెమికల్(ఓ2సీ) వ్యాపారాల్లో ప్రతిపాదిత పెట్టుబడులను మళ్లీ లెక్కిస్తే ఇరు పక్షాలకు ప్రయోజనకరంగా ఉంటుందని సౌదీ అరామ్​కో, రిలయన్స్ నిర్ణయించుకున్నాయి. భారత ప్రైవేట్ రంగంలో పెట్టుబడులకు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎప్పటికీ ప్రాధాన్య భాగస్వామిగా ఉంటుంది."

-రిలయన్స్ ఇండస్ట్రీస్.

తమ ఆయిల్ టు కెమికల్ వ్యాపారంలో 20శాతం వాటాను (Reliance-Aramco deal latest news) సౌదీ అరామ్​కో విక్రయించడానికి ప్రయత్నాలు చేస్తున్నామని 2019లో జరిగిన రిలయన్స్​ వార్షిక సర్వసభ్య సమావేశంలో(ఏజీఎం) రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ప్రకటించారు. 2020 మార్చి నాటికి ఈ ఒప్పందం ముగుస్తుందని చెప్పారు.

అయితే.. ఆ నిర్దేశించుకున్న గడువును రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance-Aramco deal news) చేరుకోలేకపోయింది. అందుకు కరోనానే కారణమని చెప్పింది. ఈ ఏడాది చివరినాటికి ఈ ఒప్పందం జరుగుతుందని ఈ ఏడాది జరిగిన ఏజీఎంలోనూ అంబానీ తెలిపారు. అయితే.. ఈ ప్రయత్నాలు కూడా ఆగిపోయాయి.

ఇదీ చదవండి:ప్రధాని మానసపుత్రిక ' ఐఎఫ్​ఎస్​సీ ' పురోగతిపై కీలక చర్చ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.