ETV Bharat / business

ఫోన్​పేలో యూపీఐ లావాదేవీలు ఉచితమే.. కానీ...

తమ ప్లాట్​ఫాంపై యూపీఐ లావాదేవీలు ఉచితంగానే చేసుకోవచ్చని ఫోన్​పే స్పష్టం చేసింది. ఛార్జీలు వసూలు (Phone pe UPI charges) చేస్తున్నట్లు వచ్చిన వార్తలను కొట్టిపారేసింది. అయితే, ఛార్జీల వసూలు (Phone pe charges) విషయంలో కొద్దిమంది వినియోగదారులపై ప్రయోగాలు నిర్వహిస్తున్నట్లు తెలిపింది.

author img

By

Published : Oct 26, 2021, 4:24 PM IST

phonepe transaction
ఫోన్​పేలో యూపీఐ లావాదేవీలు ఉచితమే, కానీ...!

యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు వసూలు (Phone pe UPI charges) చేయనున్నట్లు వస్తున్న వార్తలను పాపులర్ డిజిటల్ పేమెంట్ ప్లాట్​ఫాం 'ఫోన్​పే' ఖండించింది. తాము ఎలాంటి ఛార్జీలు వసూలు చేయబోమని (Phone pe charges) స్పష్టం చేసింది. ఎలాంటి యూపీఐ లావాదేవీ (Phone pe UPI) నిర్వహించినా.. అది పూర్తిగా ఉచితమని పేర్కొంది.

అయితే, ఛార్జీల వసూలుపై కొంతమంది వినియోగదారులపై ప్రయోగం నిర్వహిస్తున్నట్లు ఫోన్​పే తెలిపింది. రూ.50 నుంచి రూ.100 మధ్య చెల్లింపులు చేస్తే ఒక రూపాయి, రూ.100 కన్నా ఎక్కువ చేసే చెల్లింపులకు రూ.రెండు వసూలు (Phone pe UPI charges) చేస్తున్నట్లు తెలిపింది. ఈ ప్రయోగం ప్రకారం రూ. 50 లోపు ఛార్జీలకు ఎలాంటి ఛార్జీలు ఉండవని చెప్పుకొచ్చింది.

యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు వసూలు (Phone pe charges) చేయనున్నట్లు ఇటీవల వార్తలు చక్కర్లు కొట్టాయి. దీంతో వినియోగదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

రూ.50 క్యాష్​బ్యాక్

మరోవైపు, వినియోగదారులకు రూ.50 క్యాష్​బ్యాక్ ఆఫర్​ను అందిస్తున్నట్లు ఫోన్​పే తెలిపింది. మూడుసార్లు రూ.51 లేదా అంతకన్నా ఎక్కువ రీఛార్జ్ చేసిన యూజర్లకు క్యాష్​బ్యాక్ వస్తుందని వెల్లడించింది.

భారత్​లో 'ఫోన్​పే'కు 32.5 కోట్ల మంది రిజిస్టర్డ్ యూజర్లు ఉన్నారు. రీఛార్జిలతో పాటు, బిల్ పేమెంట్స్ కోసం ఈ యాప్​ను (Phone pe UPI) విరివిగా ఉపయోగిస్తున్నారు. టికెట్ బుకింగ్, మనీ ట్రాన్స్​ఫర్, డిజిటల్ గోల్డ్ కొనుగోలు చేసే సదుపాయాలు సైతం ఇందులో ఉన్నాయి. 2.2 కోట్ల మంది వ్యాపారులు ఫోన్​పేతో రిజిస్టర్ అయ్యారు. దీంతో ఇది దేశంలోనే అతిపెద్ద డిజిటల్ ప్లాట్​ఫాంలలో ఒకటిగా ఎదిగింది.

ఇదీ చదవండి:

యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు వసూలు (Phone pe UPI charges) చేయనున్నట్లు వస్తున్న వార్తలను పాపులర్ డిజిటల్ పేమెంట్ ప్లాట్​ఫాం 'ఫోన్​పే' ఖండించింది. తాము ఎలాంటి ఛార్జీలు వసూలు చేయబోమని (Phone pe charges) స్పష్టం చేసింది. ఎలాంటి యూపీఐ లావాదేవీ (Phone pe UPI) నిర్వహించినా.. అది పూర్తిగా ఉచితమని పేర్కొంది.

అయితే, ఛార్జీల వసూలుపై కొంతమంది వినియోగదారులపై ప్రయోగం నిర్వహిస్తున్నట్లు ఫోన్​పే తెలిపింది. రూ.50 నుంచి రూ.100 మధ్య చెల్లింపులు చేస్తే ఒక రూపాయి, రూ.100 కన్నా ఎక్కువ చేసే చెల్లింపులకు రూ.రెండు వసూలు (Phone pe UPI charges) చేస్తున్నట్లు తెలిపింది. ఈ ప్రయోగం ప్రకారం రూ. 50 లోపు ఛార్జీలకు ఎలాంటి ఛార్జీలు ఉండవని చెప్పుకొచ్చింది.

యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు వసూలు (Phone pe charges) చేయనున్నట్లు ఇటీవల వార్తలు చక్కర్లు కొట్టాయి. దీంతో వినియోగదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

రూ.50 క్యాష్​బ్యాక్

మరోవైపు, వినియోగదారులకు రూ.50 క్యాష్​బ్యాక్ ఆఫర్​ను అందిస్తున్నట్లు ఫోన్​పే తెలిపింది. మూడుసార్లు రూ.51 లేదా అంతకన్నా ఎక్కువ రీఛార్జ్ చేసిన యూజర్లకు క్యాష్​బ్యాక్ వస్తుందని వెల్లడించింది.

భారత్​లో 'ఫోన్​పే'కు 32.5 కోట్ల మంది రిజిస్టర్డ్ యూజర్లు ఉన్నారు. రీఛార్జిలతో పాటు, బిల్ పేమెంట్స్ కోసం ఈ యాప్​ను (Phone pe UPI) విరివిగా ఉపయోగిస్తున్నారు. టికెట్ బుకింగ్, మనీ ట్రాన్స్​ఫర్, డిజిటల్ గోల్డ్ కొనుగోలు చేసే సదుపాయాలు సైతం ఇందులో ఉన్నాయి. 2.2 కోట్ల మంది వ్యాపారులు ఫోన్​పేతో రిజిస్టర్ అయ్యారు. దీంతో ఇది దేశంలోనే అతిపెద్ద డిజిటల్ ప్లాట్​ఫాంలలో ఒకటిగా ఎదిగింది.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.