ETV Bharat / business

'బ్యాంకుల్లో నిరర్ధక ఆస్తులు భారీగా పెరిగిపోతాయి'

author img

By

Published : Jun 5, 2020, 1:15 PM IST

కరోనా కారణంగా బ్యాంకుల్లో నిరర్ధక ఆస్తులు పెరిగిపోతాయని ఐసీఆర్​ఏ నివేదిక వెల్లడించింది. రుణ గ్రహీతలపై లాక్​డౌన్ తీవ్ర ప్రభావం చూపిందని ఐసీఆర్​ఏ స్పష్టం చేసింది.

There is an increase in intangible assets in Banks due to Corona
బ్యాంకుల్లో ఈ ఏడాది భారీగా పేరుకుపోనున్న నిరర్థక ఆస్తులు

కొవిడ్-19 సృష్టించిన ఇబ్బందుల కారణంగా ఈ ఆర్థిక ఏడాది ముగిసే నాటికి బ్యాంకుల్లో 11.6 శాతం మేర నిరర్ధక ఆస్తులు పేరుకుపోతాయని ఇండియన్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ (ఐసీఆర్​ఏ) ఓ నివేదికలో పేర్కొంది. ఈ ఏడాది మార్చి నాటికి 8.6 శాతంగా ఉన్న స్థూల నిరర్ధక ఆస్తులు.. ఆర్థిక ఏడాది చివరకి 11.3 నుంచి 11.6 శాతానికి చేరుకుంటాయని అంచనా వేసింది.

లాక్​డౌన్​ వల్లే..

బ్యాంకుల లాభదాయకత తగ్గిన కారణంగా ప్రభుత్వరంగ బ్యాంకులకు ఈ ఆర్థిక ఏడాదిలో రూ. 45వేల కోట్ల నుంచి రూ. 82వేల 500 కోట్ల వరకు మూలధనం అవసరం అవుతుందని ఐసీఆర్​ఏ పేర్కొంది. రుణ గ్రహీతల చెల్లింపు సామర్థ్యంపై.. లాక్​డౌన్​ తీవ్ర ప్రభావం చూపిందని వివరించింది ఐసీఆర్​ఏ.

ఇదీ చదవండి: 'వలస కార్మికుల సంక్షోభం వారికి ఓ గుణపాఠం'

కొవిడ్-19 సృష్టించిన ఇబ్బందుల కారణంగా ఈ ఆర్థిక ఏడాది ముగిసే నాటికి బ్యాంకుల్లో 11.6 శాతం మేర నిరర్ధక ఆస్తులు పేరుకుపోతాయని ఇండియన్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ (ఐసీఆర్​ఏ) ఓ నివేదికలో పేర్కొంది. ఈ ఏడాది మార్చి నాటికి 8.6 శాతంగా ఉన్న స్థూల నిరర్ధక ఆస్తులు.. ఆర్థిక ఏడాది చివరకి 11.3 నుంచి 11.6 శాతానికి చేరుకుంటాయని అంచనా వేసింది.

లాక్​డౌన్​ వల్లే..

బ్యాంకుల లాభదాయకత తగ్గిన కారణంగా ప్రభుత్వరంగ బ్యాంకులకు ఈ ఆర్థిక ఏడాదిలో రూ. 45వేల కోట్ల నుంచి రూ. 82వేల 500 కోట్ల వరకు మూలధనం అవసరం అవుతుందని ఐసీఆర్​ఏ పేర్కొంది. రుణ గ్రహీతల చెల్లింపు సామర్థ్యంపై.. లాక్​డౌన్​ తీవ్ర ప్రభావం చూపిందని వివరించింది ఐసీఆర్​ఏ.

ఇదీ చదవండి: 'వలస కార్మికుల సంక్షోభం వారికి ఓ గుణపాఠం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.