ETV Bharat / business

రాష్ట్ర ఐటీలో 17.97% వృద్ధిరేటు.. జాతీయ సగటుకు రెట్టింపు

author img

By

Published : Jun 21, 2020, 7:22 AM IST

ఐటీ రంగంలో రాష్ట్రం 17.97 శాతం వృద్ధిరేటు సాధించిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. జాతీయ సగటు కన్న రెట్టింపని వివరించారు. ఐటీ ఎగుమతుల వాటా పెరిగిందని పేర్కొన్నారు. ఐటీశాఖ ఆరో వార్షిక ప్రగతి నివేదికను కేటీఆర్‌ విడుదల చేశారు.

KTR
KTR

రాష్ట్రంలో ఐటీ రంగం జాతీయ సగటు కన్నా మెరుగైన వృద్ధిరేటు నమోదు చేసిందని ఆ శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. జాతీయ సగటు వృద్ధిరేటు 8.09 శాతం ఉంటే, తెలంగాణలో 17.97 శాతంగా నమోదైందని పేర్కొన్నారు. కరోనా సంక్షోభంలోనూ ఐటీశాఖ అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. శనివారం ఐటీ శాఖ ఆరో వార్షిక ప్రగతి నివేదికను మంత్రి విడుదల చేశారు. గత ఏడాదితో పోలిస్తే దేశంలో తెలంగాణ ఐటీ ఎగుమతుల వాటా 10.61 శాతం నుంచి 11.58 శాతానికి పెరిగిందన్నారు. రాష్ట్ర ఉద్యోగ వృద్ధిరేటు 7.2 శాతంగా ఉందని వివరించారు.

1.16 లక్షల మందికి ఉపాధి

2020ని ఆర్టిఫిషల్‌ ఇంటెలిజెన్స్‌ ఏడాదిగా ప్రకటించామని, ఈ విభాగంలోని సంస్థలతో ఇప్పటికే ఎనిమిది ఒప్పందాలు చేసుకున్నామన్నారు. రాష్ట్రంలో 250కి పైగా సంస్థలు 1.16 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాయని, 2019లో రూ.7,337 కోట్ల పెట్టుబడులు వచ్చాయని వివరించారు. వన్‌ప్లస్‌ సంస్థ రూ.1000 కోట్ల పెట్టుబడితో అతిపెద్ద పరిశోధన, అభివృద్ధి సంస్థలను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిందని తెలిపారు. టాస్క్‌ ద్వారా 3.5 లక్షల మంది యువకులకు శిక్షణ ఇచ్చామని, దాదాపు 4,500 మంది ప్రత్యక్షంగా నియామకాలు పొందారన్నారు.

లక్ష్యంతో పనిచేస్తున్నాం

కరోనా నేపథ్యంలో టీవర్క్‌ సంస్థ తక్కువ ధరతో వెంటిలేటరు తయారు చేసిందని కేటీఆర్ తెలిపారు. టీశాట్‌ ద్వారా 4,612 కార్యక్రమాలను ప్రసారం చేశామని, యూట్యూబ్‌లో టీశాట్‌ కార్యక్రమాలకు వీక్షకుల సంఖ్య 5.3 కోట్లు దాటిందని వెల్లడించారు. డిజిటల్‌ మీడియా విభాగం తరఫున తెలుగు వికీ¨పీడియా కోసం ట్రిపుల్‌ఐటీ హైదరాబాద్‌ ఆధ్వర్యంలో 30 లక్షల వ్యాపార లక్ష్యంతో పనిచేస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణ వ్యాలెట్‌ ద్వారా 11 లక్షల రిజిస్ట్రేషన్లు జరిగాయని, రూ.6,795 కోట్ల నగదు లావాదేవీలు నిర్వహించామన్నారు. వీహబ్‌ ద్వితీయ, తృతీయశ్రేణి పట్టణాల్లోని అతివలకు సహాయం చేస్తోందని కేటీఆర్‌ తెలిపారు.

ఇదీ చదవండి: కరోనాకు డ్రగ్​ రిలీజ్​- ఒక్కో టాబ్లెట్ రూ.103

రాష్ట్రంలో ఐటీ రంగం జాతీయ సగటు కన్నా మెరుగైన వృద్ధిరేటు నమోదు చేసిందని ఆ శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. జాతీయ సగటు వృద్ధిరేటు 8.09 శాతం ఉంటే, తెలంగాణలో 17.97 శాతంగా నమోదైందని పేర్కొన్నారు. కరోనా సంక్షోభంలోనూ ఐటీశాఖ అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. శనివారం ఐటీ శాఖ ఆరో వార్షిక ప్రగతి నివేదికను మంత్రి విడుదల చేశారు. గత ఏడాదితో పోలిస్తే దేశంలో తెలంగాణ ఐటీ ఎగుమతుల వాటా 10.61 శాతం నుంచి 11.58 శాతానికి పెరిగిందన్నారు. రాష్ట్ర ఉద్యోగ వృద్ధిరేటు 7.2 శాతంగా ఉందని వివరించారు.

1.16 లక్షల మందికి ఉపాధి

2020ని ఆర్టిఫిషల్‌ ఇంటెలిజెన్స్‌ ఏడాదిగా ప్రకటించామని, ఈ విభాగంలోని సంస్థలతో ఇప్పటికే ఎనిమిది ఒప్పందాలు చేసుకున్నామన్నారు. రాష్ట్రంలో 250కి పైగా సంస్థలు 1.16 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాయని, 2019లో రూ.7,337 కోట్ల పెట్టుబడులు వచ్చాయని వివరించారు. వన్‌ప్లస్‌ సంస్థ రూ.1000 కోట్ల పెట్టుబడితో అతిపెద్ద పరిశోధన, అభివృద్ధి సంస్థలను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిందని తెలిపారు. టాస్క్‌ ద్వారా 3.5 లక్షల మంది యువకులకు శిక్షణ ఇచ్చామని, దాదాపు 4,500 మంది ప్రత్యక్షంగా నియామకాలు పొందారన్నారు.

లక్ష్యంతో పనిచేస్తున్నాం

కరోనా నేపథ్యంలో టీవర్క్‌ సంస్థ తక్కువ ధరతో వెంటిలేటరు తయారు చేసిందని కేటీఆర్ తెలిపారు. టీశాట్‌ ద్వారా 4,612 కార్యక్రమాలను ప్రసారం చేశామని, యూట్యూబ్‌లో టీశాట్‌ కార్యక్రమాలకు వీక్షకుల సంఖ్య 5.3 కోట్లు దాటిందని వెల్లడించారు. డిజిటల్‌ మీడియా విభాగం తరఫున తెలుగు వికీ¨పీడియా కోసం ట్రిపుల్‌ఐటీ హైదరాబాద్‌ ఆధ్వర్యంలో 30 లక్షల వ్యాపార లక్ష్యంతో పనిచేస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణ వ్యాలెట్‌ ద్వారా 11 లక్షల రిజిస్ట్రేషన్లు జరిగాయని, రూ.6,795 కోట్ల నగదు లావాదేవీలు నిర్వహించామన్నారు. వీహబ్‌ ద్వితీయ, తృతీయశ్రేణి పట్టణాల్లోని అతివలకు సహాయం చేస్తోందని కేటీఆర్‌ తెలిపారు.

ఇదీ చదవండి: కరోనాకు డ్రగ్​ రిలీజ్​- ఒక్కో టాబ్లెట్ రూ.103

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.