ETV Bharat / business

క్లినికల్ ట్రయల్స్​కు 'సన్​ఫార్మా'కు అనుమతి

author img

By

Published : May 29, 2020, 7:07 PM IST

కరోనాను నాఫమోస్టాట్​ మెసిలేట్ అనే ఔషధం సమర్థవంతంగా నియంత్రిస్తోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆ ఔషధం ఆధారంగా క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడానికి ప్రముఖ ఔషధ తయారీ సంస్థ సన్​ఫార్మాకు భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) అనుమతి ఇచ్చింది.

Nafamostat Mesilate
నాఫమోస్టాట్​ మెసిలేట్

కరోనా రోగులపై 'నాఫమోస్టాట్​ మెసిలేట్' అనే ఔషధంతో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) అనుమతి ఇచ్చిందని ప్రముఖ ఔషధ తయారీ సంస్థ సన్​ఫార్మా తెలిపింది.

జపాన్ ప్రభుత్వం... ప్యాంక్రియాటైటిస్​ (క్లోమ గ్రంథుల వాపు), రక్త నాళాల్లో రక్తం గడ్డకట్టడం (డీఐసీ) లాంటి వ్యాధుల చికిత్సల్లో 'నాఫమోస్టాట్​ మెసిలేట్' ఔషధం ఉపయోగించేందుకు ఆమోదం తెలిపింది. తాజాగా ఈ ఔషధం కరోనాను సమర్థవంతంగా నియంత్రిస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.

"సార్స్​-కోవి-2 వైరస్​ను నాఫమోస్టాట్​ మెసిలేట్ సమర్థవంతంగా నియంత్రిస్తున్నట్లు... ఐరోపా, జపాన్, దక్షిణ కొరియాల్లోని మూడు వేర్వేరు స్వతంత్ర శాస్త్రవేత్తల సమూహాలు చేసిన ప్రయోగాల్లో తేలింది."

- దిలీప్​ సంఘ్వీ, సన్​ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ ఎం​డీ

క్లినికల్ ట్రయల్స్+ ఉత్పత్తి

త్వరలోనే నాఫమోస్టాట్​ మెసిలేట్​ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించనున్నట్లు సన్​ఫార్మా వెల్లడించింది. అలాగే పోలా ఫార్మా జపాన్​ అనే సంస్థ నుంచి అందిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి... భారత్​లోనే నాఫమోస్టాట్​ మెసిలేట్, ఏపీఐ ఔషధాల ఉత్పత్తిని కూడా ప్రారంభించనున్నట్లు స్పష్టం చేసింది.

ఆ ప్రొటీన్​ను అణచివేస్తోంది..!

జపాన్​లోని టోక్యో విశ్వవిద్యాలయం, జర్మనీలోని లీబ్నిజ్​ ఇన్​స్టిట్యూట్​ ఫర్​ ప్రైమేట్ రీసెర్చ్​కు చెందిన శాస్త్రవేత్తలు నాఫమోస్టాట్​పై ప్రయోగాలు చేశారు. ఈ ఔషధం.. కొవిడ్​-19 వైరస్ మానవ శరీరంలోకి ప్రవేశించేందుకు అవకాశం కల్పిస్తున్న ప్రొటీన్​ (టీఎం​పీఆర్​ఎస్​ఎస్​2)ని అణచివేస్తున్నట్లు గుర్తించారు.

ప్రస్తుతానికి జపాన్​, దక్షిణ కొరియా, ఇటలీ-స్విట్జర్లాండ్​ల్లో... నాఫమోస్టాట్​పై క్లీనికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి.

ఇదీ చూడండి: కరోనాపై పోరులో స్వచ్ఛందంగా 38వేల మంది వైద్యులు

కరోనా రోగులపై 'నాఫమోస్టాట్​ మెసిలేట్' అనే ఔషధంతో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) అనుమతి ఇచ్చిందని ప్రముఖ ఔషధ తయారీ సంస్థ సన్​ఫార్మా తెలిపింది.

జపాన్ ప్రభుత్వం... ప్యాంక్రియాటైటిస్​ (క్లోమ గ్రంథుల వాపు), రక్త నాళాల్లో రక్తం గడ్డకట్టడం (డీఐసీ) లాంటి వ్యాధుల చికిత్సల్లో 'నాఫమోస్టాట్​ మెసిలేట్' ఔషధం ఉపయోగించేందుకు ఆమోదం తెలిపింది. తాజాగా ఈ ఔషధం కరోనాను సమర్థవంతంగా నియంత్రిస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.

"సార్స్​-కోవి-2 వైరస్​ను నాఫమోస్టాట్​ మెసిలేట్ సమర్థవంతంగా నియంత్రిస్తున్నట్లు... ఐరోపా, జపాన్, దక్షిణ కొరియాల్లోని మూడు వేర్వేరు స్వతంత్ర శాస్త్రవేత్తల సమూహాలు చేసిన ప్రయోగాల్లో తేలింది."

- దిలీప్​ సంఘ్వీ, సన్​ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ ఎం​డీ

క్లినికల్ ట్రయల్స్+ ఉత్పత్తి

త్వరలోనే నాఫమోస్టాట్​ మెసిలేట్​ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించనున్నట్లు సన్​ఫార్మా వెల్లడించింది. అలాగే పోలా ఫార్మా జపాన్​ అనే సంస్థ నుంచి అందిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి... భారత్​లోనే నాఫమోస్టాట్​ మెసిలేట్, ఏపీఐ ఔషధాల ఉత్పత్తిని కూడా ప్రారంభించనున్నట్లు స్పష్టం చేసింది.

ఆ ప్రొటీన్​ను అణచివేస్తోంది..!

జపాన్​లోని టోక్యో విశ్వవిద్యాలయం, జర్మనీలోని లీబ్నిజ్​ ఇన్​స్టిట్యూట్​ ఫర్​ ప్రైమేట్ రీసెర్చ్​కు చెందిన శాస్త్రవేత్తలు నాఫమోస్టాట్​పై ప్రయోగాలు చేశారు. ఈ ఔషధం.. కొవిడ్​-19 వైరస్ మానవ శరీరంలోకి ప్రవేశించేందుకు అవకాశం కల్పిస్తున్న ప్రొటీన్​ (టీఎం​పీఆర్​ఎస్​ఎస్​2)ని అణచివేస్తున్నట్లు గుర్తించారు.

ప్రస్తుతానికి జపాన్​, దక్షిణ కొరియా, ఇటలీ-స్విట్జర్లాండ్​ల్లో... నాఫమోస్టాట్​పై క్లీనికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి.

ఇదీ చూడండి: కరోనాపై పోరులో స్వచ్ఛందంగా 38వేల మంది వైద్యులు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.