ETV Bharat / business

సర్వత్రా సానుకూలం... మార్కెట్లలో నవోత్సాహం

author img

By

Published : Nov 26, 2019, 9:48 AM IST

Updated : Nov 26, 2019, 10:14 AM IST

stocks
వడ్డీరేట్లు తగ్గవచ్చనే అంచనాలతో.. భారీ లాభాలు

09:21 November 26

దేశీయ స్టాక్​మార్కెట్లలో లాభాల జోరు కొనసాగుతోంది. వరుసగా రెండో సెషన్​లో సూచీలు సరికొత్త గరిష్ఠస్థాయిల్ని తాకాయి. ఉదయం బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్​ 200 పాయింట్లకుపైగా పెరిగి చరిత్రలో అత్యధికంగా 41 వేల 120 పాయింట్ల గరిష్ఠస్థాయికి చేరింది. ప్రస్తుతం 175 పాయింట్ల లాభంతో 41 వేల 65 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ ఉదయం రికార్డు స్థాయిలో 12 వేల 132 పాయింట్ల గరిష్ఠస్థాయిని తాకింది. ప్రస్తుతం 40 పాయింట్ల లాభంతో 12 వేల 115 వద్ద కొనసాగుతోంది.

ఇవీ కారణాలు

అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందంపై ఆశలు, విదేశీ పెట్టుబడుల రాక స్థిరంగా కొనసాగడం నేటి లాభాలకు ప్రధాన కారణం. ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ ప్రకటనలు, వచ్చే  పరపతి సమీక్షలో రిజర్వ్​ బ్యాంకు ఆఫ్​ ఇండియా కీలక వడ్డీ రేట్లు తగ్గించవచ్చన్న అంచనాలు కూడా మదుపరుల సెంటిమెంట్​ను బలోపేతం చేశాయి. నవంబర్​ డెరివేటివ్స్ కాంట్రాక్టుల గడువుకు ముందు చిన్న కవరేజ్​ కూడా ర్యాలీకి దోహదపడిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

లాభాల్లో

ఎస్​ బ్యాంకు, సన్​ఫార్మా, టాటా స్టీల్​, ఐసీఐసీఐ బ్యాంకు, హిందాల్కో, ఇన్​ఫోసిస్​, ఎస్​ బ్యాంకు, ఆర్​ఐఎల్​ లాభాల్లో కొనసాగుతున్నాయి.

నష్టాల్లో

భారతీ ఇన్​ఫ్రాటెల్, కోటక్​ బ్యాంకు, ఎల్​ అండ్​ టీ, జీ ఎంటర్​టైన్​మెంట్​, భారతీ ఎయిర్​టెల్, నెస్లే, ఇండస్​ఇండ్ బ్యాంకు, బజాజ్​ ఆటో, హీరో మోటోకార్ప్, కోటక్ మహీంద్ర నష్టాల్లో కొనసాగుతున్నాయి.

ఆసియా మార్కెట్లు

షాంగై, హాంకాంగ్, సియోల్, టోక్యో మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. సోమవారం వాల్​స్ట్రీట్​ లాభాలతో ముగిసింది.

రూపాయి విలువ

రూపాయి విలువ 8 పైసలు వృద్ధి చెంది, ఒక డాలరుకు రూ.71.66గా ఉంది.

ముడిచమురు..

ప్రపంచ మార్కెట్​లో ముడిచమురు ధర 0.05 శాతం తగ్గింది. ప్రస్తుతం బ్యారెల్ ధర 62.59 డాలర్లుగా ఉంది.

ఇదీ చూడండి: మ్యూచువ‌ల్ ఫండ్లలో పెడుతున్నారా? ఇవి గుర్తుంచుకోండి

09:21 November 26

దేశీయ స్టాక్​మార్కెట్లలో లాభాల జోరు కొనసాగుతోంది. వరుసగా రెండో సెషన్​లో సూచీలు సరికొత్త గరిష్ఠస్థాయిల్ని తాకాయి. ఉదయం బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్​ 200 పాయింట్లకుపైగా పెరిగి చరిత్రలో అత్యధికంగా 41 వేల 120 పాయింట్ల గరిష్ఠస్థాయికి చేరింది. ప్రస్తుతం 175 పాయింట్ల లాభంతో 41 వేల 65 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ ఉదయం రికార్డు స్థాయిలో 12 వేల 132 పాయింట్ల గరిష్ఠస్థాయిని తాకింది. ప్రస్తుతం 40 పాయింట్ల లాభంతో 12 వేల 115 వద్ద కొనసాగుతోంది.

ఇవీ కారణాలు

అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందంపై ఆశలు, విదేశీ పెట్టుబడుల రాక స్థిరంగా కొనసాగడం నేటి లాభాలకు ప్రధాన కారణం. ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ ప్రకటనలు, వచ్చే  పరపతి సమీక్షలో రిజర్వ్​ బ్యాంకు ఆఫ్​ ఇండియా కీలక వడ్డీ రేట్లు తగ్గించవచ్చన్న అంచనాలు కూడా మదుపరుల సెంటిమెంట్​ను బలోపేతం చేశాయి. నవంబర్​ డెరివేటివ్స్ కాంట్రాక్టుల గడువుకు ముందు చిన్న కవరేజ్​ కూడా ర్యాలీకి దోహదపడిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

లాభాల్లో

ఎస్​ బ్యాంకు, సన్​ఫార్మా, టాటా స్టీల్​, ఐసీఐసీఐ బ్యాంకు, హిందాల్కో, ఇన్​ఫోసిస్​, ఎస్​ బ్యాంకు, ఆర్​ఐఎల్​ లాభాల్లో కొనసాగుతున్నాయి.

నష్టాల్లో

భారతీ ఇన్​ఫ్రాటెల్, కోటక్​ బ్యాంకు, ఎల్​ అండ్​ టీ, జీ ఎంటర్​టైన్​మెంట్​, భారతీ ఎయిర్​టెల్, నెస్లే, ఇండస్​ఇండ్ బ్యాంకు, బజాజ్​ ఆటో, హీరో మోటోకార్ప్, కోటక్ మహీంద్ర నష్టాల్లో కొనసాగుతున్నాయి.

ఆసియా మార్కెట్లు

షాంగై, హాంకాంగ్, సియోల్, టోక్యో మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. సోమవారం వాల్​స్ట్రీట్​ లాభాలతో ముగిసింది.

రూపాయి విలువ

రూపాయి విలువ 8 పైసలు వృద్ధి చెంది, ఒక డాలరుకు రూ.71.66గా ఉంది.

ముడిచమురు..

ప్రపంచ మార్కెట్​లో ముడిచమురు ధర 0.05 శాతం తగ్గింది. ప్రస్తుతం బ్యారెల్ ధర 62.59 డాలర్లుగా ఉంది.

ఇదీ చూడండి: మ్యూచువ‌ల్ ఫండ్లలో పెడుతున్నారా? ఇవి గుర్తుంచుకోండి

Rajouri (JandK), Nov 26 (ANI): The security forces destroyed several live mortal shells in Nowshera sector of Rajouri district in Jammu and Kashmir. The live mortar shells are result of ceasefire violation by Pakistan which fires mortar shells across the Line of Control (LoC). Even presently, Pakistan violated ceasefire by firing of small arms and shelling with mortars in Akhnoor sector. Indian Army retaliated strongly to the unprovoked border firing.
Last Updated : Nov 26, 2019, 10:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.