ETV Bharat / business

బడ్జెట్​పైనే అందరి దృష్టి.. స్టాక్ మార్కెట్ల దారెటు?

author img

By

Published : Jan 30, 2022, 3:47 PM IST

Stock Market Outlook: కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో దేశీయ స్టాక్​ మార్కెట్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. బడ్జెట్​తో పాటు స్థూల ఆర్థిక గణాంకాలు, సంస్థల త్రైమాసిక ఫలితాలు, అంతర్జాతీయ పరిణామాలు ఈ వారం మార్కెట్లకు నడిపించనున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Stock Market Outlook
Stock Market Outlook

Stock Market Outlook: ఈ వారం స్టాక్ ​మార్కెట్లకు పలు కీలక అంశాలు దిశా నిర్దేశం చేయనున్నాయి. ప్రస్తుతం అందరి చూపు కేంద్రం ప్రవేశపెట్టబోయే బడ్జెట్​పైనే ఉంది. దీంతో పాటు స్థూల ఆర్థిక గణాంకాలు, సంస్థల త్రైమాసిక లాభాల ప్రకటన, అంతర్జాతీయ పరిణామాలు ఈ వారం మార్కెట్లను నడిపించనున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.

"మార్కెట్లతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థకు ఈ వారం ఎంతో కీలమైంది. ఫిబ్రవరి 1న కేంద్రం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించేలా.. అభివృద్ధి అజెండాతో సానుకూల నిర్ణయాలు ఉంటాయని మదుపరులు ఆశిస్తున్నారు. బడ్జెట్​ ప్రవేశపెట్టే వారంలో సూచీల్లో ఒడుదొడుకులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అంతర్జాతీయ మదుపరుల అమ్మకాల నేపథ్యంలో బడ్జెట్​.. దేశీయ మార్కెట్లను నడిపించనుంది. పెట్టుబడిదారులు అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది."

-అజిత్​ మిశ్రా, రెలిగేర్ బ్రోకింగ్ లిమిటెడ్ ఉపాధ్యక్షుడు

కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో దేశీయ స్టాక్​ మార్కెట్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటాయి. బడ్జెట్​ అనంతరం పుంజుకునే అవకాశం ఉంది. గత ఏడాది ఇదే ధోరణి కనిపించింది. బడ్జెట్​కు ముందు అమ్మకాలు వెల్లువెత్తాయి. బడ్జెట్ తర్వాత సూచీలు పుంజుకున్నాయి. మూడో త్రైమాసికంలో సంస్థల లాభాల ప్రకటనపై మదుపరుల దృష్టి సారించే అవకాశముంది."

- సంతోష్ మీనా, స్వస్తిక ఇన్వెస్ట్‌మార్ట్ లిమిటెడ్ రీసెర్చ్ హెడ్​​

బడ్జెట్ కాకుండా.. అంతర్జాతీయంగా డాలర్​ విలువ, చముర ధరల పెరుగుదల వంటివి దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపవచ్చని మీనా అంచనా వేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి: 2030 కల్లా పది లక్షల ఉద్యోగాలు!- ఆ ఒక్క రంగంలోనే..

Stock Market Outlook: ఈ వారం స్టాక్ ​మార్కెట్లకు పలు కీలక అంశాలు దిశా నిర్దేశం చేయనున్నాయి. ప్రస్తుతం అందరి చూపు కేంద్రం ప్రవేశపెట్టబోయే బడ్జెట్​పైనే ఉంది. దీంతో పాటు స్థూల ఆర్థిక గణాంకాలు, సంస్థల త్రైమాసిక లాభాల ప్రకటన, అంతర్జాతీయ పరిణామాలు ఈ వారం మార్కెట్లను నడిపించనున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.

"మార్కెట్లతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థకు ఈ వారం ఎంతో కీలమైంది. ఫిబ్రవరి 1న కేంద్రం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించేలా.. అభివృద్ధి అజెండాతో సానుకూల నిర్ణయాలు ఉంటాయని మదుపరులు ఆశిస్తున్నారు. బడ్జెట్​ ప్రవేశపెట్టే వారంలో సూచీల్లో ఒడుదొడుకులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అంతర్జాతీయ మదుపరుల అమ్మకాల నేపథ్యంలో బడ్జెట్​.. దేశీయ మార్కెట్లను నడిపించనుంది. పెట్టుబడిదారులు అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది."

-అజిత్​ మిశ్రా, రెలిగేర్ బ్రోకింగ్ లిమిటెడ్ ఉపాధ్యక్షుడు

కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో దేశీయ స్టాక్​ మార్కెట్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటాయి. బడ్జెట్​ అనంతరం పుంజుకునే అవకాశం ఉంది. గత ఏడాది ఇదే ధోరణి కనిపించింది. బడ్జెట్​కు ముందు అమ్మకాలు వెల్లువెత్తాయి. బడ్జెట్ తర్వాత సూచీలు పుంజుకున్నాయి. మూడో త్రైమాసికంలో సంస్థల లాభాల ప్రకటనపై మదుపరుల దృష్టి సారించే అవకాశముంది."

- సంతోష్ మీనా, స్వస్తిక ఇన్వెస్ట్‌మార్ట్ లిమిటెడ్ రీసెర్చ్ హెడ్​​

బడ్జెట్ కాకుండా.. అంతర్జాతీయంగా డాలర్​ విలువ, చముర ధరల పెరుగుదల వంటివి దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపవచ్చని మీనా అంచనా వేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి: 2030 కల్లా పది లక్షల ఉద్యోగాలు!- ఆ ఒక్క రంగంలోనే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.