ETV Bharat / business

'మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలు ధరలు తగ్గించొచ్చు'

మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో చమురుపై పన్నులు తగ్గిస్తే.. ఆర్థిక వ్యవస్థపై అధిక ప్రభావం ఉండదని పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్​ తెలిపారు. ముంబయి వంటి ప్రాంతాల్లో పన్నుల భారం ఎక్కువగా ఉందన్న ఆయన.. అలాంటి చోట పన్నుల భారం తగ్గిస్తే ప్రజలకు ఉపశమనం కలుగుతుందన్నారు.

author img

By

Published : Mar 18, 2021, 5:52 AM IST

Updated : Mar 18, 2021, 9:24 AM IST

Some states like Maharashtra should reduce taxes on Fuel to give relief to people: Dharmendra Pradhan
'మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలు ధరలు తగ్గించొచ్చు'

మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు చమురుపై పన్నులు తగ్గించినంత మాత్రన రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలపై పెద్దగా ప్రభావమేమీ పడబోదని పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. ఈ మేరకు ఆయా ప్రభుత్వాలు వినియోగదారులపై భారం పడకుండా పన్నులు తగ్గించవచ్చని సూచించారు. రాజ్యసభలో బుధవారం ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడిన ప్రధాన్​.. ఇంధన ధరల పన్నులను కేంద్రం ఎందుకు తగ్గించడం లేదో కేంద్ర ఆర్థిక మంత్రి ఇప్పటికే విస్పష్టంగా సమాధానమిచ్చారన్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో పెద్ద రాష్ట్రాలు పన్నులు తగ్గించవచ్చని సూచించారు. ఈ విషయాన్ని తాను రాజకీయం చేయడం లేదని, ముఖ్యంగా ముంబయిలో పన్నుల భారం ఎక్కువగా ఉందని చెప్పారు. అటువంటి చోట పన్నులను కొంతైనా తగ్గిస్తే ప్రజలకు మేలు జరుగుతుందని వెల్లడించారు.

కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు పెట్రోల్‌తో ఇథనాల్‌ను కలిపే విధానాన్ని కేంద్రం తీసుకొచ్చినప్పటికీ.. ఇంధన ధరల తగ్గింపు విషయంలో చర్యలు ఎందుకు తీసుకోవడంలేదని శివసేన నేత అనిల్ దేశాయ్‌ ప్రశ్నించారు. దీనికి.. వాజ్‌పేయీ హయాంలో ఇథనాల్‌ బ్లెండింగ్(పెట్రోల్‌తో ఇథనాల్‌ను కలిపే పద్ధతి)ని తీసుకొచ్చారని ప్రధాన్​ సమాధానమిచ్చారు. ఆ తర్వాతి ప్రభుత్వ కాలంలో ఈ విధానాన్ని పక్కకు పెట్టారన్నారు. తమ ప్రభుత్వం మళ్లీ దానికి పెద్దపీట వేస్తోందని చెప్పారు. 2025 నాటికి పెట్రోల్‌లో ఇథనాల్‌ వాటాను 20 శాతానికి పెంచాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్టు వివరించారు. ఈ మేరకు డిస్టిలరీ, నిల్వల సామర్థ్యాలను పెంచేందుకు కృషి చేస్తున్నామని వెల్లడించారు.

ఇదీ చదవండి: 'పట్టపగలే మోదీ సర్కార్​ దోపిడీ'

మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు చమురుపై పన్నులు తగ్గించినంత మాత్రన రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలపై పెద్దగా ప్రభావమేమీ పడబోదని పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. ఈ మేరకు ఆయా ప్రభుత్వాలు వినియోగదారులపై భారం పడకుండా పన్నులు తగ్గించవచ్చని సూచించారు. రాజ్యసభలో బుధవారం ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడిన ప్రధాన్​.. ఇంధన ధరల పన్నులను కేంద్రం ఎందుకు తగ్గించడం లేదో కేంద్ర ఆర్థిక మంత్రి ఇప్పటికే విస్పష్టంగా సమాధానమిచ్చారన్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో పెద్ద రాష్ట్రాలు పన్నులు తగ్గించవచ్చని సూచించారు. ఈ విషయాన్ని తాను రాజకీయం చేయడం లేదని, ముఖ్యంగా ముంబయిలో పన్నుల భారం ఎక్కువగా ఉందని చెప్పారు. అటువంటి చోట పన్నులను కొంతైనా తగ్గిస్తే ప్రజలకు మేలు జరుగుతుందని వెల్లడించారు.

కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు పెట్రోల్‌తో ఇథనాల్‌ను కలిపే విధానాన్ని కేంద్రం తీసుకొచ్చినప్పటికీ.. ఇంధన ధరల తగ్గింపు విషయంలో చర్యలు ఎందుకు తీసుకోవడంలేదని శివసేన నేత అనిల్ దేశాయ్‌ ప్రశ్నించారు. దీనికి.. వాజ్‌పేయీ హయాంలో ఇథనాల్‌ బ్లెండింగ్(పెట్రోల్‌తో ఇథనాల్‌ను కలిపే పద్ధతి)ని తీసుకొచ్చారని ప్రధాన్​ సమాధానమిచ్చారు. ఆ తర్వాతి ప్రభుత్వ కాలంలో ఈ విధానాన్ని పక్కకు పెట్టారన్నారు. తమ ప్రభుత్వం మళ్లీ దానికి పెద్దపీట వేస్తోందని చెప్పారు. 2025 నాటికి పెట్రోల్‌లో ఇథనాల్‌ వాటాను 20 శాతానికి పెంచాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్టు వివరించారు. ఈ మేరకు డిస్టిలరీ, నిల్వల సామర్థ్యాలను పెంచేందుకు కృషి చేస్తున్నామని వెల్లడించారు.

ఇదీ చదవండి: 'పట్టపగలే మోదీ సర్కార్​ దోపిడీ'

Last Updated : Mar 18, 2021, 9:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.