ETV Bharat / business

అయ్యో.. స్మార్ట్​ఫోన్​ పరిశ్రమకూ కరోనా ఎఫెక్ట్​

author img

By

Published : Feb 11, 2020, 7:58 PM IST

Updated : Mar 1, 2020, 12:36 AM IST

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా ప్రభావం ఇప్పుడు స్మార్ట్​ఫోన్ పరిశ్రమపై పడింది. చైనాలో కరోనా ప్రభావం తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న కారణంగా అక్కడ చాలా వరకు ఫ్యాక్టరీలు కార్యకలాపాలు నిలిపేశాయి. ఈ నేపథ్యంలో చైనాపై అధికంగా ఆధారపడే భారత స్మార్ట్​ఫోన్ పరిశ్రమపై తీవ్ర ప్రభావం పడుతోంది.

carona effect on smartphone
కరోనా దెబ్బకు స్మార్ట్​ఫోన్ పరిశ్రమ విలవిల

భారత్​లో స్మార్ట్​ఫోన్ల పరిశ్రమను కరోనావైరస్​ తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. స్మార్ట్​ఫోన్ల విడిభాగాలు, ఇతర ముడి పరికరాల కోసం భారత్​ చైనాపైనే అధికంగా ఆధారపడుతోంది. అయితే చైనాలో కరోనా వైరస్​ విజృంభిస్తోన్న కారణంగా చాలా వరకు ఆ దేశ సంస్థలు కార్యకలాపాలు నిలిపేశాయి. ఫలితంగా చైనా నుంచి స్మార్ట్​ఫోన్ల పరిశ్రమకు వచ్చే ముడి సరుకు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి.

నిశితంగా పరిశీలిస్తున్నాం..

చైనాలో మూతపడిన ఫ్యాక్టరీలు మరికొన్ని రోజుల్లో తెరుచుకుంటాయా? ఈ వారంలో సరఫరా తిరిగి సాధారణ స్థాయికి చేరుకుంటాయా అనే అంశాన్ని భారత పరిశ్రమ నిశితంగా పరిశీలిస్తోంది.

"అవును, భారత స్మార్ట్​ఫోన్ల పరిశ్రమపై ఇప్పటికే కరోనా ప్రభావం పడింది. కొన్ని రకాల మోడల్స్​ ప్రభావితమయ్యాయి. ఇది ఇంకా ప్రారంభ దశ అయినందున ఇప్పుడే ఒక నిర్ణయానికి రాలేము. "- పంకజ్​ మహీంద్రూ, ఇండియన్​ సెల్యులార్​ అండ్​ ఎలక్ట్రానిక్స్​ అసోసియేషన్​ ఛైర్మన్​

అయితే మార్కెట్ విశ్లేషకులు మాత్రం క్షేత్రస్థాయిలో పరిశ్రమ పరిస్థితులు అధ్వాన్నంగా ఉన్నాయంటున్నారు. స్మార్ట్​ఫోన్​ పరికరాలు ప్రధానంగా చైనా నుంచి వస్తునందున మార్కెట్​తో పాటు డిమాండ్​ మందకొడిగా సాగుతున్నట్లు చెబుతున్నారు.

సరఫరాపై దిగ్గజ సంస్థలైన షియోమీ, ఒప్పో, వివో, రియల్​మీ, పోకో వంటి సంస్థలను సంప్రదించగా ఎలాంటి స్పందన రాలేదు.

మొబైల్ కాంగ్రెస్​పై కరోనా పడగ..

కరోనా దెబ్బతో మొబైల్ ప్రపంచ మొబైల్ కాంగ్రెస్​ (డబ్ల్యూఎంసీ)పై తీవ్ర ప్రభావం పడనుందన్న సంకేతాలు వస్తున్నాయి. ఇప్పటికే ఎరిక్సన్​, అమెజాన్​, సోనీ సహా పలు ఇతర సంస్థలు.. స్పెయిన్​లోని బర్సెలినాలో ఈ నెల 24-27 తేదీల్లో జరగనున్న డబ్ల్యూఎంసీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాయి.

చైనాకు చెందిన 'వివో' ఇలాంటి ప్రకటనే చేసింది. కరోనా వైరస్​ తీవ్రతను క్షుణ్ణంగా పరిశిలిస్తున్నాం. ఈ కారణంగా డబ్ల్యూఎంసీలో తొలిసారి అడుగుపెట్టాలన్న నిర్ణయాన్ని వెనక్కితీసుకుంటున్నామని ప్రకటించింది.

ఇదీ చూడండి:పిచాయ్​కు వరుస షాక్​లు... గూగుల్​కు ఏమైంది?

భారత్​లో స్మార్ట్​ఫోన్ల పరిశ్రమను కరోనావైరస్​ తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. స్మార్ట్​ఫోన్ల విడిభాగాలు, ఇతర ముడి పరికరాల కోసం భారత్​ చైనాపైనే అధికంగా ఆధారపడుతోంది. అయితే చైనాలో కరోనా వైరస్​ విజృంభిస్తోన్న కారణంగా చాలా వరకు ఆ దేశ సంస్థలు కార్యకలాపాలు నిలిపేశాయి. ఫలితంగా చైనా నుంచి స్మార్ట్​ఫోన్ల పరిశ్రమకు వచ్చే ముడి సరుకు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి.

నిశితంగా పరిశీలిస్తున్నాం..

చైనాలో మూతపడిన ఫ్యాక్టరీలు మరికొన్ని రోజుల్లో తెరుచుకుంటాయా? ఈ వారంలో సరఫరా తిరిగి సాధారణ స్థాయికి చేరుకుంటాయా అనే అంశాన్ని భారత పరిశ్రమ నిశితంగా పరిశీలిస్తోంది.

"అవును, భారత స్మార్ట్​ఫోన్ల పరిశ్రమపై ఇప్పటికే కరోనా ప్రభావం పడింది. కొన్ని రకాల మోడల్స్​ ప్రభావితమయ్యాయి. ఇది ఇంకా ప్రారంభ దశ అయినందున ఇప్పుడే ఒక నిర్ణయానికి రాలేము. "- పంకజ్​ మహీంద్రూ, ఇండియన్​ సెల్యులార్​ అండ్​ ఎలక్ట్రానిక్స్​ అసోసియేషన్​ ఛైర్మన్​

అయితే మార్కెట్ విశ్లేషకులు మాత్రం క్షేత్రస్థాయిలో పరిశ్రమ పరిస్థితులు అధ్వాన్నంగా ఉన్నాయంటున్నారు. స్మార్ట్​ఫోన్​ పరికరాలు ప్రధానంగా చైనా నుంచి వస్తునందున మార్కెట్​తో పాటు డిమాండ్​ మందకొడిగా సాగుతున్నట్లు చెబుతున్నారు.

సరఫరాపై దిగ్గజ సంస్థలైన షియోమీ, ఒప్పో, వివో, రియల్​మీ, పోకో వంటి సంస్థలను సంప్రదించగా ఎలాంటి స్పందన రాలేదు.

మొబైల్ కాంగ్రెస్​పై కరోనా పడగ..

కరోనా దెబ్బతో మొబైల్ ప్రపంచ మొబైల్ కాంగ్రెస్​ (డబ్ల్యూఎంసీ)పై తీవ్ర ప్రభావం పడనుందన్న సంకేతాలు వస్తున్నాయి. ఇప్పటికే ఎరిక్సన్​, అమెజాన్​, సోనీ సహా పలు ఇతర సంస్థలు.. స్పెయిన్​లోని బర్సెలినాలో ఈ నెల 24-27 తేదీల్లో జరగనున్న డబ్ల్యూఎంసీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాయి.

చైనాకు చెందిన 'వివో' ఇలాంటి ప్రకటనే చేసింది. కరోనా వైరస్​ తీవ్రతను క్షుణ్ణంగా పరిశిలిస్తున్నాం. ఈ కారణంగా డబ్ల్యూఎంసీలో తొలిసారి అడుగుపెట్టాలన్న నిర్ణయాన్ని వెనక్కితీసుకుంటున్నామని ప్రకటించింది.

ఇదీ చూడండి:పిచాయ్​కు వరుస షాక్​లు... గూగుల్​కు ఏమైంది?

ZCZC
PRI GEN INT
.LONDON FGN37
UK-LD ECONOMY
UK economy stalls in fourth quarter of 2019
         London, Feb 11 (AFP) Britain's economy saw zero growth in the final quarter of last year as manufacturing shrank heading into the country's general election that unlocked Brexit, official data showed Tuesday.
         "There was no growth in the last quarter of 2019 as increases in the services and construction sectors were offset by another poor showing from manufacturing, particularly the motor industry," said Rob Kent-Smith at the Office for National Statistics (ONS).
         UK manufacturing contracted 0.8 percent in the October-December period, the ONS said.
         Britain finally departed the European Union on January 31 after Prime Minister Boris Johnson in December led the Conservative party to victory in national polls.
         "We've broken the deadlock and left the EU -- now we need to seize this moment to level up and prepare our great nation for long-term success," finance minister Sajid Javid said in a statement Tuesday following release of the growth data.
         "In my budget, exactly one month from today, I'll set out how we will move forward, with more ambition and new thinking, and empower our people and businesses so everyone has the opportunity to thrive," Chancellor of the Exchequer Javid said.
         On the eve of Brexit however, the Bank of England slashed its UK economic growth forecasts for this year and next, as the country faces tough negotiations with the EU on striking a new trade deal.
         The British economy would expand by only 0.8 percent this year, the BoE said last month, down sharply on its previous 1.2-percent forecast.
         In 2021, gross domestic product was expected to grow 1.4 percent, down on the central bank's estimate of 1.7 percent given in November.
         The ONS on Tuesday added that the UK economy grew by 1.4 percent last year, up from 1.3 percent in 2018.
         It expanded 0.5 percent in the third quarter of 2019. (AFP)
RS
02111608
NNNN
Last Updated : Mar 1, 2020, 12:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.