ETV Bharat / business

కరోనా వేళ సెకండ్ హ్యాండ్ వస్తువులు సురక్షితమేనా?

author img

By

Published : Jun 17, 2020, 6:01 AM IST

కరోనా లాక్​డౌన్ సడలింపు తర్వాత ఇప్పుడిప్పుడే జనం సాధారణ జీవనానికి అలవాటు పడుతున్నారు. అయితే దాదాపు రెండు నెలలకుపైగా ఆదాయం తగ్గి చాలా మంది కొనుగోళ్లు జరిపేందుకు ఇబ్బంది పడుతున్నారు. అవసరమైన వస్తువులను సెకండ్​ హ్యాండ్​లో కొందాం అంటే.. అమ్మే వ్యక్తి ద్వారా కరోనా సోకుతుందేమోననే భయాలు వెంటాడుతున్నాయి. అయితే సెకండ్​ హ్యాండ్​ వస్తువులు ఇలాంటి సమయంలో కొనడం మంచిదేనా? ఒకవేళ కొంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తెలుసుకుందాం..!

safe shopping in Corona times
సెకండ్ హ్యాండ్ వస్తువుల కొనుగోలు జాగ్రత్తలు

కరోనా వైరస్‌ రాక ముందు వీకెండ్‌ షాపింగ్‌లు, ఆన్‌లైన్‌ కొనుగోళ్లు జోరుగా కొనసాగేవి. అవసరం ఉన్నా.. లేకున్నా పడి ఉంటాయిలే అని తెగ కొనేసేవారు. అవసరమున్న వస్తువుల ఖరీదు ఎక్కువగా ఉంటే ఓఎల్‌ఎక్స్‌, క్వికర్‌ వంటి ఆన్‌లైన్‌ పోర్టల్స్‌.. కొన్ని దుకాణాల్లో సెకండ్‌ హ్యాండ్‌లో కొనేవారు. అయితే కరోనా విసిరిన పంజాకి అన్ని దేశాలు వణికిపోతున్నాయి. కరోనా కట్టడిలో భాగంగా లాక్‌డౌన్‌ విధించడం వల్లa అనేక మంది ఉపాధి కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులో పడ్డారు. ఇప్పుడిప్పుడే ఎవరి పనుల్లో వారు బిజీ అయిపోతున్నారు. ఈ క్రమంలో అవసరమైన వస్తువులను కొనుగోలు చేసేందుకు డబ్బు సరిపోక సెకండ్‌ హ్యాండ్‌లో కొనాలనుకునేవారి సంఖ్య పెరుగుతోంది. అయితే.. తాము కొనుగోలు చేసిన వస్తువు యజమానులకు కరోనా ఉంటే.. తమకు సోకుతుందేమోనని చాలా మంది భయపడుతున్నారు. ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ కొనుగోళ్లు చేసుకుంటే ఏ సమస్య ఉండదని పలువురు వ్యాపారవేత్తలు, నిపుణులు చెబుతున్నారు.

దుకాణాలకు వెళ్లకుంటేనే మంచిది..

ఏదైనా వస్తువును అమ్మాలన్నా.. కొనాలన్నా దుకాణాలకు వెళ్లకుండా ఉండటం మంచిది. అక్కడికి కరోనా సోకిన వ్యక్తి వచ్చినట్లయితే కరోనా వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆన్‌లైన్‌ పోర్టళ్ల పిక్‌అప్‌, డెలివరీకి ప్రాధాన్యమివ్వండి. దీని ద్వారా ఒక్క మనిషితో మాత్రమే కాంటాక్ట్‌ ఉంటుంది. రిస్క్‌ తక్కువగా ఉంటుంది. వస్తువుల మార్పిడి జరిగిన వెంటనే చేతులను సబ్బు లేదా శానిటైజర్‌తో శుభ్రంగా కడగండి. కరెన్సీ నోట్ల బదులు ఆన్‌లైన్‌ పేమెంట్‌ చేయడం ఉత్తమం. అవసరమైతేనే వస్తువులను కొనండి లేదా అమ్మండి.

24 గంటలు దూరంగా పెట్టండి..

ది న్యూ ఇంగ్లాండ్‌‌ జర్నల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ నివేదిక ప్రకారం అట్టపెట్టెలపై కరనా వైరస్‌ 24 గంటలపాటు జీవించి ఉంటుందట. ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ ఇచ్చే ఏ వస్తువులైనా అట్ట పెట్టెల్లోనే వస్తాయి. కాబట్టి వాటిని తీసుకోగానే తెరవకుండా 24 గంటల పాటు దూరంగా పెట్టండి. వెంటనే చేతులను శుభ్రంగా కడుక్కోండి. 24 గంటల తర్వాతే దానిని తెరవండి. లోపల ఉండే వస్తువులను శానిటైజ్‌ చేయండి. శుభ్రం చేయడానికి వీలులేని వస్తువులను కొనుగోలు చేయకండి. ఒకవేళ మీరు దుస్తులను ఆర్డర్‌ ఇచ్చినట్లయితే.. వాటిని తీసుకున్న తర్వాత వేడినీళ్లతో ఉతకండి. హ్యాండ్‌బ్యాగ్స్‌, పర్స్‌లాంటివి కొనుగోలు చేస్తే.. వాటిని క్రిమిసంహారక రసాయనాలతో శుభ్రం చేయండి. ఎన్‌ఈజేఎం నివేదిక ప్రకారం.. వైరస్‌ ప్లాస్టిక్‌ వస్తువులపై 72 గంటలు, స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ వస్తువులపై 48 గంటలు, అట్టపెట్టెలపై 24 గంటలు, రాగి వస్తువులపై 4 గంటలు జీవిస్తుందట. కాబట్టి ఆయా వస్తువులను బట్టి కొంత సమయం వాటిని దూరంగా పెట్టి ఆ తర్వాత వాడటం మంచిది.

ఇదీ చూడండి:ఈపీఎఫ్‌ఓ కొత్త విధానం.. ఎక్కడి నుంచైనా అభ్యర్థనల పరిశీలన

కరోనా వైరస్‌ రాక ముందు వీకెండ్‌ షాపింగ్‌లు, ఆన్‌లైన్‌ కొనుగోళ్లు జోరుగా కొనసాగేవి. అవసరం ఉన్నా.. లేకున్నా పడి ఉంటాయిలే అని తెగ కొనేసేవారు. అవసరమున్న వస్తువుల ఖరీదు ఎక్కువగా ఉంటే ఓఎల్‌ఎక్స్‌, క్వికర్‌ వంటి ఆన్‌లైన్‌ పోర్టల్స్‌.. కొన్ని దుకాణాల్లో సెకండ్‌ హ్యాండ్‌లో కొనేవారు. అయితే కరోనా విసిరిన పంజాకి అన్ని దేశాలు వణికిపోతున్నాయి. కరోనా కట్టడిలో భాగంగా లాక్‌డౌన్‌ విధించడం వల్లa అనేక మంది ఉపాధి కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులో పడ్డారు. ఇప్పుడిప్పుడే ఎవరి పనుల్లో వారు బిజీ అయిపోతున్నారు. ఈ క్రమంలో అవసరమైన వస్తువులను కొనుగోలు చేసేందుకు డబ్బు సరిపోక సెకండ్‌ హ్యాండ్‌లో కొనాలనుకునేవారి సంఖ్య పెరుగుతోంది. అయితే.. తాము కొనుగోలు చేసిన వస్తువు యజమానులకు కరోనా ఉంటే.. తమకు సోకుతుందేమోనని చాలా మంది భయపడుతున్నారు. ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ కొనుగోళ్లు చేసుకుంటే ఏ సమస్య ఉండదని పలువురు వ్యాపారవేత్తలు, నిపుణులు చెబుతున్నారు.

దుకాణాలకు వెళ్లకుంటేనే మంచిది..

ఏదైనా వస్తువును అమ్మాలన్నా.. కొనాలన్నా దుకాణాలకు వెళ్లకుండా ఉండటం మంచిది. అక్కడికి కరోనా సోకిన వ్యక్తి వచ్చినట్లయితే కరోనా వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆన్‌లైన్‌ పోర్టళ్ల పిక్‌అప్‌, డెలివరీకి ప్రాధాన్యమివ్వండి. దీని ద్వారా ఒక్క మనిషితో మాత్రమే కాంటాక్ట్‌ ఉంటుంది. రిస్క్‌ తక్కువగా ఉంటుంది. వస్తువుల మార్పిడి జరిగిన వెంటనే చేతులను సబ్బు లేదా శానిటైజర్‌తో శుభ్రంగా కడగండి. కరెన్సీ నోట్ల బదులు ఆన్‌లైన్‌ పేమెంట్‌ చేయడం ఉత్తమం. అవసరమైతేనే వస్తువులను కొనండి లేదా అమ్మండి.

24 గంటలు దూరంగా పెట్టండి..

ది న్యూ ఇంగ్లాండ్‌‌ జర్నల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ నివేదిక ప్రకారం అట్టపెట్టెలపై కరనా వైరస్‌ 24 గంటలపాటు జీవించి ఉంటుందట. ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ ఇచ్చే ఏ వస్తువులైనా అట్ట పెట్టెల్లోనే వస్తాయి. కాబట్టి వాటిని తీసుకోగానే తెరవకుండా 24 గంటల పాటు దూరంగా పెట్టండి. వెంటనే చేతులను శుభ్రంగా కడుక్కోండి. 24 గంటల తర్వాతే దానిని తెరవండి. లోపల ఉండే వస్తువులను శానిటైజ్‌ చేయండి. శుభ్రం చేయడానికి వీలులేని వస్తువులను కొనుగోలు చేయకండి. ఒకవేళ మీరు దుస్తులను ఆర్డర్‌ ఇచ్చినట్లయితే.. వాటిని తీసుకున్న తర్వాత వేడినీళ్లతో ఉతకండి. హ్యాండ్‌బ్యాగ్స్‌, పర్స్‌లాంటివి కొనుగోలు చేస్తే.. వాటిని క్రిమిసంహారక రసాయనాలతో శుభ్రం చేయండి. ఎన్‌ఈజేఎం నివేదిక ప్రకారం.. వైరస్‌ ప్లాస్టిక్‌ వస్తువులపై 72 గంటలు, స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ వస్తువులపై 48 గంటలు, అట్టపెట్టెలపై 24 గంటలు, రాగి వస్తువులపై 4 గంటలు జీవిస్తుందట. కాబట్టి ఆయా వస్తువులను బట్టి కొంత సమయం వాటిని దూరంగా పెట్టి ఆ తర్వాత వాడటం మంచిది.

ఇదీ చూడండి:ఈపీఎఫ్‌ఓ కొత్త విధానం.. ఎక్కడి నుంచైనా అభ్యర్థనల పరిశీలన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.