స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ 848 పాయింట్ల లాభంతో 49,581 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ 245 పాయింట్లు పెరిగి 14,923 వద్దకు చేరింది.
బ్యాంకింగ్, వాహన రంగ షేర్ల జోరు, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి హెవీ వెయిట్ షేర్ల సానుకూలతలు లాభాలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 49,606 పాయింట్ల అత్యధిక స్థాయి, 48,923 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 14,931 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 14,725 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
ఇండస్ఇండ్ బ్యాంక్, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు భారీగా లాభాలను గడించాయి.
భారతీ ఎయిర్టెల్, ఎల్&టీ, నెస్లే ఇండియా, మారుతీ సుజుకీ, సన్ఫార్మా షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.
ఇతర మార్కెట్లు
ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లలో.. షాంఘై, హాంకాంగ్ సూచీలు లాభాలను నమోదు చేశాయి. నిక్కీ, కోస్పీ సూచీలు నష్టపోయాయి.
ఇవీ చదవండి: