ETV Bharat / business

ఆద్యంతం ఒడుదొడుకులు.. చివరకు స్వల్ప లాభాలు

author img

By

Published : Oct 13, 2020, 4:13 PM IST

Updated : Oct 13, 2020, 5:28 PM IST

ఒడుదొడుకుల ట్రేడింగ్​లో స్టాక్ మార్కెట్లు మంగళవారం స్వల్ప లాభాలను నమోదు చేశాయి. సెన్సెక్స్ 32 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 11,934 వద్ధ ఫ్లాట్​గా ముగిసింది.

share markets today
నేటి స్టాక్ మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు మంగళవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ 32 పాయింట్లు పుంజుకుని.. 40,625 వద్దకు చేరింది. ఎన్​​ఎస్​ఈ-నిఫ్టీ 3 పాయింట్ల అతి స్వల్ప లాభంతో 11,934 వద్ద ఫ్లాట్​గా స్థిరపడింది.

సెప్టెంబర్​లో రిటైల్ ద్రవ్యోల్బణం పెరగటం, ఆగస్టులోనూ పారిశ్రామికోత్పత్తి తేరుకోలేదన్న గణాంకాలతో మదుపరుల సెంటిమెంట్​ దెబ్బతింది. దీనితో వారు అమ్మకాలవైపు మొగ్గు చూపడం వల్ల మంగళవారం సెషన్​ మొత్తం ఒడుదొడుకుల్లో సాగినట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అయితే రిలయన్స్, హెచ్​సీఎల్​టెక్ వంటి షేర్లు లాభాలను నమోదు చేయడం వల్ల.. సూచీలు చివరకు సానుకూలంగా ముగిసినట్లు విశ్లేషిస్తున్నారు.

markets today
నేటి మార్కెట్ల ట్రేడింగ్ ఇలా

ఇంట్రాడే సాగిందిలా

సెన్సెక్స్ 40,787 పాయింట్ల అత్యధిక స్థాయి, 40,462 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.

నిఫ్టీ 11,988 పాయింట్ల గరిష్ఠ స్థాయి;11,889 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

హెచ్​సీఎల్​టెక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇన్ఫోసిస్, రిలయన్స్, అల్ట్రాటెక్, టెక్ మహీంద్రా షేర్లు లాభాల్లో ఉన్నాయి.

టైటాన్, సన్​ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాక్, బజాజ్ ఫినాన్స్, ఎస్​బీఐ షేర్లు నష్టపోయాయి.

ఆసియా మార్కెట్లు

ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లలో షాంఘై, నిక్కీ సూచీలు లాభాలను గడించాయి. కోస్పీ నష్టాలతో ముగిసింది.

రూపాయి, ముడి చమురు

కరెన్సీ మార్కెట్​లో రూపాయి.. 7 పైసలు తగ్గింది. దీనితో డాలర్​తో పోలిస్తే మారకం విలువ 73.35 వద్దకు చేరింది.

ముడి చమురు ధరల సూచీ-బ్రెంట్ 0.74 శాతం పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్​లో బ్యారెల్ ముడి చమురు ధర 42.03డాలర్లుగా ఉంది.

ఇదీ చూడండి:పసిడి ధరల జోరుకు బ్రేక్- నేడు ఎంత తగ్గిందంటే...

స్టాక్ మార్కెట్లు మంగళవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ 32 పాయింట్లు పుంజుకుని.. 40,625 వద్దకు చేరింది. ఎన్​​ఎస్​ఈ-నిఫ్టీ 3 పాయింట్ల అతి స్వల్ప లాభంతో 11,934 వద్ద ఫ్లాట్​గా స్థిరపడింది.

సెప్టెంబర్​లో రిటైల్ ద్రవ్యోల్బణం పెరగటం, ఆగస్టులోనూ పారిశ్రామికోత్పత్తి తేరుకోలేదన్న గణాంకాలతో మదుపరుల సెంటిమెంట్​ దెబ్బతింది. దీనితో వారు అమ్మకాలవైపు మొగ్గు చూపడం వల్ల మంగళవారం సెషన్​ మొత్తం ఒడుదొడుకుల్లో సాగినట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అయితే రిలయన్స్, హెచ్​సీఎల్​టెక్ వంటి షేర్లు లాభాలను నమోదు చేయడం వల్ల.. సూచీలు చివరకు సానుకూలంగా ముగిసినట్లు విశ్లేషిస్తున్నారు.

markets today
నేటి మార్కెట్ల ట్రేడింగ్ ఇలా

ఇంట్రాడే సాగిందిలా

సెన్సెక్స్ 40,787 పాయింట్ల అత్యధిక స్థాయి, 40,462 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.

నిఫ్టీ 11,988 పాయింట్ల గరిష్ఠ స్థాయి;11,889 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

హెచ్​సీఎల్​టెక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇన్ఫోసిస్, రిలయన్స్, అల్ట్రాటెక్, టెక్ మహీంద్రా షేర్లు లాభాల్లో ఉన్నాయి.

టైటాన్, సన్​ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాక్, బజాజ్ ఫినాన్స్, ఎస్​బీఐ షేర్లు నష్టపోయాయి.

ఆసియా మార్కెట్లు

ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లలో షాంఘై, నిక్కీ సూచీలు లాభాలను గడించాయి. కోస్పీ నష్టాలతో ముగిసింది.

రూపాయి, ముడి చమురు

కరెన్సీ మార్కెట్​లో రూపాయి.. 7 పైసలు తగ్గింది. దీనితో డాలర్​తో పోలిస్తే మారకం విలువ 73.35 వద్దకు చేరింది.

ముడి చమురు ధరల సూచీ-బ్రెంట్ 0.74 శాతం పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్​లో బ్యారెల్ ముడి చమురు ధర 42.03డాలర్లుగా ఉంది.

ఇదీ చూడండి:పసిడి ధరల జోరుకు బ్రేక్- నేడు ఎంత తగ్గిందంటే...

Last Updated : Oct 13, 2020, 5:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.