ETV Bharat / business

వడ్డీరేటు మార్పుపై ఉత్కంఠ.. నష్టాల్లో సూచీలు

ఆర్​బీఐ సమీక్షలో భాగంగా పరపతి విధాన కమిటీ సమావేశ నిర్ణయాలు నేడు వెలువడనున్నాయి. వడ్డీ రేటు మార్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఫలితంగా మదుపరుల అప్రమత్తతతో.. నేటి ట్రేడింగ్​లో స్టాక్​ మార్కెట్లు ప్రతికూలంగా కొనసాగుతున్నాయి. సెన్సెక్స్​ 104, నిఫ్టీ 45 పాయింట్లు పతనమయ్యాయి.

author img

By

Published : Jun 6, 2019, 9:59 AM IST

నష్టాల్లో స్టాక్​మార్కెట్లు

స్టాక్​ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. మూడు రోజులుగా సమావేశమైన ఆర్​బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ నేడు నిర్ణయాలను ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో మదుపరులు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. మార్కెట్లు ప్రతికూలంగా కొనసాగుతున్నాయి.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజీ సూచీ - సెన్సెక్స్​ 104 పాయింట్లు కోల్పోయింది. 39 వేల 978 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజీ సూచీ- నిఫ్టీ 45 పాయింట్లు క్షీణించి 11 వేల 976 వద్ద కొనసాగుతోంది. ఆరంభ ట్రేడింగ్​లో మార్కెట్లు ఫ్లాట్​గా మొదలై... అనంతరం నష్టాల్లోకి వెళ్లాయి.

లాభనష్టాల్లోనివివే...

పవర్​ గ్రిడ్​ కార్పొరేషన్​, ఐఓసీ, బజాజ్​ ఆటో, డాక్టర్​ రెడ్డీస్​ ల్యాబ్స్​ల షేర్లు లాభాల జాబితాలో ఉన్నాయి.

గెయిల్​, ఇండియా బుల్స్​ హెచ్​ఎస్​జీ, యెస్​ బ్యాంక్​, ఎస్​బీఐ, వేదాంత, ఐసీఐసీఐ, హెచ్​డీఎఫ్​సీ, జీ ఎంటర్​టైన్​మెంట్​​, ఇండస్​ ఇండ్​ బ్యాంకుల షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

ఆర్బీఐ గవర్నర్​ శక్తికాంతదాస్​ అధ్యక్షతన ఆర్థిక విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశం నేటితో ముగుస్తుంది. అనంతరం నూతన విధానాలను ప్రకటించనుంది ఆర్బీఐ.
గత రెండు విధాన సమీక్ష సమావేశాల్లో రెపోరేట్​ను 25 బేసిస్​ పాయింట్లు తగ్గించింది ఆర్బీఐ. ఈసారీ రెపోరేట్​ను తగ్గించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

అంతర్జాతీయంగా మిశ్రమ ఫలితాలు

ఆరంభ ట్రేడింగ్​లో ఆసియాకు చెందిన చైనా, జపాన్​, కొరియా మార్కెట్లు మిశ్రమ ఫలితాలతో ప్రారంభమయ్యాయి.

రూపాయి పతనం...

రూపాయి 13 పైసలు క్షీణించింది. డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ 69.39 వద్ద ట్రేడవుతోంది.

స్టాక్​ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. మూడు రోజులుగా సమావేశమైన ఆర్​బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ నేడు నిర్ణయాలను ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో మదుపరులు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. మార్కెట్లు ప్రతికూలంగా కొనసాగుతున్నాయి.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజీ సూచీ - సెన్సెక్స్​ 104 పాయింట్లు కోల్పోయింది. 39 వేల 978 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజీ సూచీ- నిఫ్టీ 45 పాయింట్లు క్షీణించి 11 వేల 976 వద్ద కొనసాగుతోంది. ఆరంభ ట్రేడింగ్​లో మార్కెట్లు ఫ్లాట్​గా మొదలై... అనంతరం నష్టాల్లోకి వెళ్లాయి.

లాభనష్టాల్లోనివివే...

పవర్​ గ్రిడ్​ కార్పొరేషన్​, ఐఓసీ, బజాజ్​ ఆటో, డాక్టర్​ రెడ్డీస్​ ల్యాబ్స్​ల షేర్లు లాభాల జాబితాలో ఉన్నాయి.

గెయిల్​, ఇండియా బుల్స్​ హెచ్​ఎస్​జీ, యెస్​ బ్యాంక్​, ఎస్​బీఐ, వేదాంత, ఐసీఐసీఐ, హెచ్​డీఎఫ్​సీ, జీ ఎంటర్​టైన్​మెంట్​​, ఇండస్​ ఇండ్​ బ్యాంకుల షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

ఆర్బీఐ గవర్నర్​ శక్తికాంతదాస్​ అధ్యక్షతన ఆర్థిక విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశం నేటితో ముగుస్తుంది. అనంతరం నూతన విధానాలను ప్రకటించనుంది ఆర్బీఐ.
గత రెండు విధాన సమీక్ష సమావేశాల్లో రెపోరేట్​ను 25 బేసిస్​ పాయింట్లు తగ్గించింది ఆర్బీఐ. ఈసారీ రెపోరేట్​ను తగ్గించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

అంతర్జాతీయంగా మిశ్రమ ఫలితాలు

ఆరంభ ట్రేడింగ్​లో ఆసియాకు చెందిన చైనా, జపాన్​, కొరియా మార్కెట్లు మిశ్రమ ఫలితాలతో ప్రారంభమయ్యాయి.

రూపాయి పతనం...

రూపాయి 13 పైసలు క్షీణించింది. డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ 69.39 వద్ద ట్రేడవుతోంది.

AP Video Delivery Log - 0300 GMT News
Thursday, 6 June, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0133: Mexico Church Leader AP Clients Only 4214455
Mexico church leader charged in US with child rape
AP-APTN-0103: Denmark Election Victory AP Clients Only 4214452
Social Democrats clear winners in Danish election
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.