ETV Bharat / business

ఐయూసీ రద్దుతో జియోకే నష్టం!

ఇంటర్‌ యూసేజ్‌ ఛార్జీల (ఐయూసీ) విధానం రద్దుతో జియో పైనే కొంతమేర ప్రభావం పడనుందని సర్వీసెస్‌ సంస్థ క్రెడిట్‌ సూయిజ్‌ పేర్కొంది. వొడాఫోన్‌ ఐడియా (వీఐ)కు లాభం చేకూరనుందని‌ అంచనా వేసింది.

author img

By

Published : Jan 1, 2021, 9:01 PM IST

Scrapping of IUC levy benefit for VIL some impact for Jio says Credit Suisse
ఐయూసీ రద్దుతో జియోకే నష్టం!

ఒక నెట్‌వర్క్‌ నుంచి వేరే నెట్‌వర్క్‌కు కాల్స్‌ చేసినందుకు చెల్లించే ఇంటర్‌ యూసేజ్‌ ఛార్జీల (ఐయూసీ) విధానం రద్దుతో జియోపైనే కొంతమేర ప్రభావం పడనుందని తెలుస్తోంది. దీనివల్ల వొడాఫోన్‌ ఐడియా (వీఐ)కు లాభం చేకూరనుండగా.. ఎయిర్‌టెల్‌పై పెద్దగా ప్రభావం చూపబోదని ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సంస్థ క్రెడిట్‌ సూయిజ్‌ అంచనా వేసింది.

టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్‌) నిబంధనల ప్రకారం ఐయూసీ విధానం జనవరి 1తో ముగిసింది. దీంతో ఇకపై తమ నెట్‌వర్క్‌ నుంచి ఇతర నెట్‌వర్క్‌లకు చేసే కాల్స్‌ పూర్తిగా ఉచితమని జియో ప్రకటించింది. అంతకుముందు వేరే నెట్‌వర్క్‌కు చేసే కాల్‌కు నిమిషానికి 6 పైసలు చొప్పున చెల్లించాల్సి వచ్చేది. అయితే, గత కొంతకాలంగా వీఐ సబ్‌స్క్రైబర్లను భారీగా కోల్పోగా.. జియో అదే స్థాయిలో పెంచుకుంది. దీంతో అతిపెద్ద ఇన్‌కమింగ్‌ కాల్‌ రిసీవర్‌ (నెట్‌ రిసీవర్‌)గా జియో అవతరించింది. వీఐ నెట్‌ పేయర్‌గా నిలిచింది.

జియో ప్రస్తుతం తన ఆల్‌ఇన్‌ వన్‌ ప్లాన్‌లో ఆఫ్‌నెట్‌ కాల్స్‌పై పరిమితి విధిస్తోంది. ఉచిత ప్రకటన అనంతరం ప్లాన్‌ ధరల్లో ఎలాంటి మార్పులూ చేయకుండా ఆఫ్‌ నెట్‌ కాల్స్‌పై పరిమితి తొలగిస్తుందని క్రెడిట్‌ సూయిజ్‌ అంచనా వేస్తోంది. అలాగే, ఆ కంపెనీ ఐయూసీ టాప్‌ అప్‌లు కూడా నిరుపయోగంగా మారనున్నాయని తెలిపింది. వీఐ, ఎయిర్‌టెల్‌ ప్లాన్ల విషయంలో ఆఫ్‌నెట్‌ కాల్స్‌పై ఎలాంటి పరిమితులూ లేవు. దీంతో ఐయూసీ ఛార్జీల రద్దు ప్రకటన కొంతమేర జియోపై ప్రభావం పడనుందని అంచనా వేసింది. బిజినెస్‌ టు బిజినెస్‌ ఆదాయాల విషయంలో జియోకు కొంతమేర ఆదాయం తగ్గే అవకాశం ఉందని పేర్కొంది. అదే సమయంలో వీఐకు కొంతమేర లబ్ధి చేకూరనుందని తెలిపింది. ఎయిర్‌టెల్‌ విషయంలో ఎలాంటి మార్పులూ ఉండబోవని అంచనా వేసింది.

ఇదీ చూడండి: 'ట్రాన్సాక్షన్ ఫెయిలైతే...​ రీఫండ్​లో జాప్యమేల?'

ఒక నెట్‌వర్క్‌ నుంచి వేరే నెట్‌వర్క్‌కు కాల్స్‌ చేసినందుకు చెల్లించే ఇంటర్‌ యూసేజ్‌ ఛార్జీల (ఐయూసీ) విధానం రద్దుతో జియోపైనే కొంతమేర ప్రభావం పడనుందని తెలుస్తోంది. దీనివల్ల వొడాఫోన్‌ ఐడియా (వీఐ)కు లాభం చేకూరనుండగా.. ఎయిర్‌టెల్‌పై పెద్దగా ప్రభావం చూపబోదని ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సంస్థ క్రెడిట్‌ సూయిజ్‌ అంచనా వేసింది.

టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్‌) నిబంధనల ప్రకారం ఐయూసీ విధానం జనవరి 1తో ముగిసింది. దీంతో ఇకపై తమ నెట్‌వర్క్‌ నుంచి ఇతర నెట్‌వర్క్‌లకు చేసే కాల్స్‌ పూర్తిగా ఉచితమని జియో ప్రకటించింది. అంతకుముందు వేరే నెట్‌వర్క్‌కు చేసే కాల్‌కు నిమిషానికి 6 పైసలు చొప్పున చెల్లించాల్సి వచ్చేది. అయితే, గత కొంతకాలంగా వీఐ సబ్‌స్క్రైబర్లను భారీగా కోల్పోగా.. జియో అదే స్థాయిలో పెంచుకుంది. దీంతో అతిపెద్ద ఇన్‌కమింగ్‌ కాల్‌ రిసీవర్‌ (నెట్‌ రిసీవర్‌)గా జియో అవతరించింది. వీఐ నెట్‌ పేయర్‌గా నిలిచింది.

జియో ప్రస్తుతం తన ఆల్‌ఇన్‌ వన్‌ ప్లాన్‌లో ఆఫ్‌నెట్‌ కాల్స్‌పై పరిమితి విధిస్తోంది. ఉచిత ప్రకటన అనంతరం ప్లాన్‌ ధరల్లో ఎలాంటి మార్పులూ చేయకుండా ఆఫ్‌ నెట్‌ కాల్స్‌పై పరిమితి తొలగిస్తుందని క్రెడిట్‌ సూయిజ్‌ అంచనా వేస్తోంది. అలాగే, ఆ కంపెనీ ఐయూసీ టాప్‌ అప్‌లు కూడా నిరుపయోగంగా మారనున్నాయని తెలిపింది. వీఐ, ఎయిర్‌టెల్‌ ప్లాన్ల విషయంలో ఆఫ్‌నెట్‌ కాల్స్‌పై ఎలాంటి పరిమితులూ లేవు. దీంతో ఐయూసీ ఛార్జీల రద్దు ప్రకటన కొంతమేర జియోపై ప్రభావం పడనుందని అంచనా వేసింది. బిజినెస్‌ టు బిజినెస్‌ ఆదాయాల విషయంలో జియోకు కొంతమేర ఆదాయం తగ్గే అవకాశం ఉందని పేర్కొంది. అదే సమయంలో వీఐకు కొంతమేర లబ్ధి చేకూరనుందని తెలిపింది. ఎయిర్‌టెల్‌ విషయంలో ఎలాంటి మార్పులూ ఉండబోవని అంచనా వేసింది.

ఇదీ చూడండి: 'ట్రాన్సాక్షన్ ఫెయిలైతే...​ రీఫండ్​లో జాప్యమేల?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.