ETV Bharat / business

దివాలా స్మృతి కేసులన్నీ సుప్రీంకోర్టుకు

author img

By

Published : Oct 30, 2020, 5:56 AM IST

దివాలా స్మృతిలోని నిబంధనలు సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను తనకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు అన్ని హైకోర్టులను ఆదేశించింది. ఇకపై ఇందుకు సంబంధించి కొత్త వ్యాజ్యాలను స్వీకరించకూడదని హైకోర్టులకు సూచించింది. ఇంతవరకు హైకోర్టులు ఇచ్చిన తాత్కాలిక ఉత్తర్వులు చెల్లుబాటు అవుతాయని తెలిపింది.

sc-transfers-to-itself-batch-of-pleas-challenging-provisions-of-ibc-on-personal-insolvency
దివాలా స్మృతి కేసులన్నీ సుప్రీంకోర్టుకు

దివాలా స్మృతిలోని కొన్ని నిబంధనలను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలన్నింటినీ తనకు బదిలీ చేయాలని గురువారం సుప్రీంకోర్టు అన్ని హైకోర్టులను ఆదేశించింది. ముఖ్యంగా వ్యక్తిగత దివాలా విషయంలో కేసులు నమోదయ్యాయి.

ఇకపై ఇందుకు సంబంధించి కొత్త వ్యాజ్యాలను స్వీకరించకూడదని హైకోర్టులకు సూచించింది. ఇంతవరకు హైకోర్టులు ఇచ్చిన తాత్కాలిక ఉత్తర్వులు చెల్లుబాటు అవుతాయని తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఎల్. నాగేశ్వరరావు, జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ అజయ్ రస్తోగిలతో కూడిన ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది.

ఆ తదుపరి విచారణను డిసెంబరు రెండో తేదీకి వాయిదా వేసింది.

దివాలా స్మృతిలోని కొన్ని నిబంధనలను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలన్నింటినీ తనకు బదిలీ చేయాలని గురువారం సుప్రీంకోర్టు అన్ని హైకోర్టులను ఆదేశించింది. ముఖ్యంగా వ్యక్తిగత దివాలా విషయంలో కేసులు నమోదయ్యాయి.

ఇకపై ఇందుకు సంబంధించి కొత్త వ్యాజ్యాలను స్వీకరించకూడదని హైకోర్టులకు సూచించింది. ఇంతవరకు హైకోర్టులు ఇచ్చిన తాత్కాలిక ఉత్తర్వులు చెల్లుబాటు అవుతాయని తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఎల్. నాగేశ్వరరావు, జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ అజయ్ రస్తోగిలతో కూడిన ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది.

ఆ తదుపరి విచారణను డిసెంబరు రెండో తేదీకి వాయిదా వేసింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.