వాణిజ్య బ్యాంకుల్లో కరెంటు ఖాతాలు తెరవడానికి పలు ఆంక్షలు విధించింది ఆర్బీఐ. రుణగ్రహీతల్లో రుణ క్రమశిక్షణను బలోపేతం చేయడానికి, నిధుల మళ్లింపును నివారించడానికి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ద్రవ్య పరపతి విధాన సమీక్ష అనంతరం వెల్లడించింది.
రుణ గ్రహీతలు బహుళ ఖాతాలు నిర్వహిస్తూ పలు బ్యాంకుల నుంచి రుణాలు పొందుతున్నారని, అందుకే భద్రతా ప్రమాణాల దృష్ట్యా ఆంక్షలు విధిస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. ఒక్కసారి బ్యాంకు ద్వారా క్యాష్ క్రెడిట్/ ఓవర్ డ్రాప్ట్ రుణ సదుపాయాలు పొందిన వారికి మరో కరెంటు ఖాతా తెరవకూడదని అన్ని బ్యాంకులను ఆదేశించారు.
కంపెనీలు, వ్యాపారాలు నిర్వహించే వారు రోజువారి లాావాదేవీలు నిర్వహించేందుకు ఉపయోగించేదే కరెంటు ఖాాతా. దీనిలో లావాదేవీలకు పరిమితులు ఉండవు. క్యాష్ క్రెడిట్, ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయాలుంటాయి. ఒక్కోసారి ఖాతాలో బ్యాలెన్స్ లేకున్నా నగదు విత్డ్రా చేసుకోవచ్చు. దీనినే ఓవర్డ్రాఫ్ట్ అంటారు.
ఇదీ చూడండి:మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారా?