ETV Bharat / business

ద్రవ్యోల్బణ అంచనా చేరుకుంటాం: శక్తికాంత దాస్‌

author img

By

Published : Nov 11, 2021, 7:00 AM IST

దేశంలో ఈ ఆర్థిక సంవత్సరంలో అంచనా వేసిన జీడీపీ 9.5 శాతం వృద్ధి నమోదవుతుందని ఆర్​బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ విశ్వాసం వ్యక్తం చేశారు. వృద్ధి పెరిగేందుకు అవకాశాలు బలంగా ఉన్నాయని చెప్పారు.

sakthi kantha das
శక్తికాంత దాస్‌

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణ లక్ష్యమైన 5.3 శాతానికి ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాబోవని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) గవర్నర్‌ శక్తికాంత దాస్‌ పేర్కొన్నారు. డీజిల్‌, పెట్రోలుపై ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించడం వల్ల ఆహార సరఫరా వైపు సమస్యలు తొలగుతాయని, తద్వారా ద్రవ్యోల్బణ నిర్వహణకు ఈ చర్యలు సానుకూలంగా మారాయని ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన అన్నారు. దాస్‌ ఇంకా ఏమన్నారంటే..

అంతర్జాతీయంగా ప్రతికూలతలు..: ద్రవ్యోల్బణం అనేది చాలా వరకు సరఫరా వైపు సమస్యగా ఉంటోంది. ప్రభుత్వ చర్యల వల్ల ఆహార ద్రవ్యోల్బణం నియంత్రణలోకి వచ్చింది. టోకు ద్రవ్యోల్బణం వైపు ఇంకా కొన్ని సమస్యలను పరిష్కరించాల్సి ఉంది. వంటనూనెల ధరలు తగ్గడం నుంచి ఆహార ద్రవ్యోల్బణం కిందకు దిగి వస్తోంది. ఆ తర్వాత పప్పు ధాన్యాలు, ఇంధనాలు సహకరించాయి. వచ్చే మార్చి చివరకు ద్రవ్యోల్బణ అంచనా అయిన 5.3 శాతాన్ని సాధించడానికి వీలవుతుంది. ఆ లక్ష్యం నిర్ణయించినప్పుడు పెట్రోలు, డీజిల్‌ ధరల కోతను పరిగణనలోకి తీసుకోలేదు. ఇపుడు ఆ చర్య మరింత సానుకూలంగా మారింది.

ప్రభుత్వమే కారణం..: ఈ ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు అంచనా వేసినట్లుగానే 9.5 శాతానికి చేరగలదన్న విశ్వాసం మాకుంది. ఆర్థిక వ్యవస్థ అంచనాలను మించి వేగంగా రికవరీ చెందడానికి ప్రభుత్వమే కారణం.

ఇదీ చూడండి: 'డిజిటల్‌ పేమెంట్స్‌'పై ఆర్‌బీఐ హాకథాన్‌- గెలిస్తే రూ.40 లక్షలు!

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణ లక్ష్యమైన 5.3 శాతానికి ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాబోవని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) గవర్నర్‌ శక్తికాంత దాస్‌ పేర్కొన్నారు. డీజిల్‌, పెట్రోలుపై ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించడం వల్ల ఆహార సరఫరా వైపు సమస్యలు తొలగుతాయని, తద్వారా ద్రవ్యోల్బణ నిర్వహణకు ఈ చర్యలు సానుకూలంగా మారాయని ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన అన్నారు. దాస్‌ ఇంకా ఏమన్నారంటే..

అంతర్జాతీయంగా ప్రతికూలతలు..: ద్రవ్యోల్బణం అనేది చాలా వరకు సరఫరా వైపు సమస్యగా ఉంటోంది. ప్రభుత్వ చర్యల వల్ల ఆహార ద్రవ్యోల్బణం నియంత్రణలోకి వచ్చింది. టోకు ద్రవ్యోల్బణం వైపు ఇంకా కొన్ని సమస్యలను పరిష్కరించాల్సి ఉంది. వంటనూనెల ధరలు తగ్గడం నుంచి ఆహార ద్రవ్యోల్బణం కిందకు దిగి వస్తోంది. ఆ తర్వాత పప్పు ధాన్యాలు, ఇంధనాలు సహకరించాయి. వచ్చే మార్చి చివరకు ద్రవ్యోల్బణ అంచనా అయిన 5.3 శాతాన్ని సాధించడానికి వీలవుతుంది. ఆ లక్ష్యం నిర్ణయించినప్పుడు పెట్రోలు, డీజిల్‌ ధరల కోతను పరిగణనలోకి తీసుకోలేదు. ఇపుడు ఆ చర్య మరింత సానుకూలంగా మారింది.

ప్రభుత్వమే కారణం..: ఈ ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు అంచనా వేసినట్లుగానే 9.5 శాతానికి చేరగలదన్న విశ్వాసం మాకుంది. ఆర్థిక వ్యవస్థ అంచనాలను మించి వేగంగా రికవరీ చెందడానికి ప్రభుత్వమే కారణం.

ఇదీ చూడండి: 'డిజిటల్‌ పేమెంట్స్‌'పై ఆర్‌బీఐ హాకథాన్‌- గెలిస్తే రూ.40 లక్షలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.