ETV Bharat / business

వడ్డీరేట్లు యథాతథం.. భవిష్యత్​ ఆందోళనకరం!

author img

By

Published : Feb 6, 2020, 3:07 PM IST

Updated : Feb 29, 2020, 10:01 AM IST

ఆర్​బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్షలో కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతూ నిర్ణయం తీసుంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి 6 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. ద్రవ్యోల్బణ అనిశ్చితిలు కొనసాగుతాయని చెప్పడం ద్వారా భవిష్యత్ అగమ్యగోచరంగా ఉందని చెప్పకనే చెప్పింది.

CPI inflation raises; overall outlook 'highly uncertain': RBI
ద్రవ్యోల్బణ అనిశ్చితితో భవిష్యత్ అగమ్యగోచరమే!

ఆర్​బీఐ 2019-20 ఆర్థిక సంవత్సరానికిగాను ఆరో ద్రవ్య పరపతి విధాన సమీక్షను నిర్వహించింది. రెపోరేటు 5.15 శాతం, రివర్స్​ రెపోరేటు 5.40 వద్ద యథాతథంగా ఉంచింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి 6 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణ అనిశ్చితిలు కొనసాగే అవకాశముందని... భవిష్యత్ కాస్త ఆందోళనకరమని ​చెప్పకనే చెప్పింది.

ఆర్​బీఐ ద్రవ్యపరపతి విధాన నిర్ణయాలు

  • ప్రస్తుత ఆర్థిక సంవత్సర చివరి త్రైమాసికంలో 6.5 శాతంగా ద్రవ్యోల్బణం ఉంది. అయితే వృద్ధిని పునరుద్ధరించడానికి తోడ్పాటు అందిస్తామని వెల్లడి
  • కూరగాయలు, పప్పుధాన్యాలు, పాల ధరల పెరుగుదల కారణంగా మొత్తం ఆహార ధరలు పెరిగే అవకాశం.
  • రిటైల్​ ద్రవ్యోల్బణం జనవరి-మార్చి త్రైమాసికంలో 6.5 శాతానికి చేరుకోవచ్చని అంచనా.
  • కరోనా వ్యాప్తి.. పర్యటకుల రాకను, ప్రపంచ వాణిజ్యాన్ని ప్రభావితం చేస్తుందని వెల్లడి
  • దేశీయ డిమాండ్​కు మద్దతుగా 2020-21 బడ్జెట్​లో వ్యక్తిగత ఆదాయపన్ను రేట్ల రేషనలైజేషన్​
  • చిన్న పొదుపు పథకాలపై వడ్డీరేట్లు సర్దుబాటు చేయాల్సిన అవసరం ఉంది.
  • మధ్యస్థ సంస్థలకు బ్యాంకులు అందించే రుణాలు (ప్రైసింగ్ ఆఫ్​ లోన్స్) ఏప్రిల్ 1నుంచి ఎక్స్​టర్నల్ బెంచ్​మార్క్​తో అనుసంధానం అవుతుంది.
  • జీఎస్టీ, రిజిస్టర్డ్ ఎంఎస్​ఎమ్​ఈ రుణాల పునర్నిర్మాణానికున్న గడువును ప్రస్తుతమున్న 2020 మార్చి నుంచి 2020 డిసెంబర్​ వరకు పొడిగింపు.
  • హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలకు సవరించిన నిబంధనలు జారీ అవుతాయి.
  • డిజిటల్ చెల్లింపుల పరిధిని తెలుసుకునేందుకు... జులై 2020 నుంచి డిజిటల్ చెల్లింపుల సూచిక (డీపీఐ)ని క్రమానుగతంగా ప్రచురించడం.
  • డిజిటల్ చెల్లింపుల కోసం స్వీయ-నియంత్రణ సంస్థ (ఎస్​ఆర్​ఓ) ఏర్పాటుకు ముసాయిదా రూపొందించడం.
  • పాన్​ ఇండియా చెక్ ట్రంకేషన్ సిస్టమ్ (సీటీఎస్)ను సెప్టెంబర్​ నాటికి అమలు చేయడం.
  • ముడిచమురు ధరలు అస్థిరంగా ఉండొచ్చు.
  • 2020 ఫిబ్రవరి 4 నాటికి విదేశీ మారక నిల్వలు 471.4 బిలియన్ డాలర్లు.
  • నికర విదేశీ పెట్టుబడులు (ఎఫ్​డీఐ) 2019 ఏప్రిల్​-నవంబర్​లో 24.4 బిలియన్​ డాలర్లకు పెరిగింది. అంతకు ముందటి ఏడాది ఇది 21.2 బిలియన్​ డాలర్లుగా ఉంది
  • నికర విదేశీ పోర్ట్​ఫోలియో పెట్టుబడి (ఎఫ్​పీఐ) 2019-20లో (ఫిబ్రవరి 4 వరకు) 8.6 బిలియన్ డాలర్లుగా ఉంది.
  • ద్రవ్య విధాన కమిటీలోని ఆరుగురు సభ్యులు ఈ కీలక వడ్డీ రేటును యథాతథ స్థితిని కొనసాగించడానికి అనుకూలంగా ఓటు వేస్తారు
  • తదుపరి ఎంపీసీ సమావేశం 2020 మార్చి 31, ఏప్రిల్ 1, 3 తేదీల్లో జరగనుంది.

ఇదీ చూడండి: వడ్డీరేట్లే కాదు మా దగ్గర మరిన్ని అస్త్రాలున్నాయి: దాస్​

ఆర్​బీఐ 2019-20 ఆర్థిక సంవత్సరానికిగాను ఆరో ద్రవ్య పరపతి విధాన సమీక్షను నిర్వహించింది. రెపోరేటు 5.15 శాతం, రివర్స్​ రెపోరేటు 5.40 వద్ద యథాతథంగా ఉంచింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి 6 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణ అనిశ్చితిలు కొనసాగే అవకాశముందని... భవిష్యత్ కాస్త ఆందోళనకరమని ​చెప్పకనే చెప్పింది.

ఆర్​బీఐ ద్రవ్యపరపతి విధాన నిర్ణయాలు

  • ప్రస్తుత ఆర్థిక సంవత్సర చివరి త్రైమాసికంలో 6.5 శాతంగా ద్రవ్యోల్బణం ఉంది. అయితే వృద్ధిని పునరుద్ధరించడానికి తోడ్పాటు అందిస్తామని వెల్లడి
  • కూరగాయలు, పప్పుధాన్యాలు, పాల ధరల పెరుగుదల కారణంగా మొత్తం ఆహార ధరలు పెరిగే అవకాశం.
  • రిటైల్​ ద్రవ్యోల్బణం జనవరి-మార్చి త్రైమాసికంలో 6.5 శాతానికి చేరుకోవచ్చని అంచనా.
  • కరోనా వ్యాప్తి.. పర్యటకుల రాకను, ప్రపంచ వాణిజ్యాన్ని ప్రభావితం చేస్తుందని వెల్లడి
  • దేశీయ డిమాండ్​కు మద్దతుగా 2020-21 బడ్జెట్​లో వ్యక్తిగత ఆదాయపన్ను రేట్ల రేషనలైజేషన్​
  • చిన్న పొదుపు పథకాలపై వడ్డీరేట్లు సర్దుబాటు చేయాల్సిన అవసరం ఉంది.
  • మధ్యస్థ సంస్థలకు బ్యాంకులు అందించే రుణాలు (ప్రైసింగ్ ఆఫ్​ లోన్స్) ఏప్రిల్ 1నుంచి ఎక్స్​టర్నల్ బెంచ్​మార్క్​తో అనుసంధానం అవుతుంది.
  • జీఎస్టీ, రిజిస్టర్డ్ ఎంఎస్​ఎమ్​ఈ రుణాల పునర్నిర్మాణానికున్న గడువును ప్రస్తుతమున్న 2020 మార్చి నుంచి 2020 డిసెంబర్​ వరకు పొడిగింపు.
  • హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలకు సవరించిన నిబంధనలు జారీ అవుతాయి.
  • డిజిటల్ చెల్లింపుల పరిధిని తెలుసుకునేందుకు... జులై 2020 నుంచి డిజిటల్ చెల్లింపుల సూచిక (డీపీఐ)ని క్రమానుగతంగా ప్రచురించడం.
  • డిజిటల్ చెల్లింపుల కోసం స్వీయ-నియంత్రణ సంస్థ (ఎస్​ఆర్​ఓ) ఏర్పాటుకు ముసాయిదా రూపొందించడం.
  • పాన్​ ఇండియా చెక్ ట్రంకేషన్ సిస్టమ్ (సీటీఎస్)ను సెప్టెంబర్​ నాటికి అమలు చేయడం.
  • ముడిచమురు ధరలు అస్థిరంగా ఉండొచ్చు.
  • 2020 ఫిబ్రవరి 4 నాటికి విదేశీ మారక నిల్వలు 471.4 బిలియన్ డాలర్లు.
  • నికర విదేశీ పెట్టుబడులు (ఎఫ్​డీఐ) 2019 ఏప్రిల్​-నవంబర్​లో 24.4 బిలియన్​ డాలర్లకు పెరిగింది. అంతకు ముందటి ఏడాది ఇది 21.2 బిలియన్​ డాలర్లుగా ఉంది
  • నికర విదేశీ పోర్ట్​ఫోలియో పెట్టుబడి (ఎఫ్​పీఐ) 2019-20లో (ఫిబ్రవరి 4 వరకు) 8.6 బిలియన్ డాలర్లుగా ఉంది.
  • ద్రవ్య విధాన కమిటీలోని ఆరుగురు సభ్యులు ఈ కీలక వడ్డీ రేటును యథాతథ స్థితిని కొనసాగించడానికి అనుకూలంగా ఓటు వేస్తారు
  • తదుపరి ఎంపీసీ సమావేశం 2020 మార్చి 31, ఏప్రిల్ 1, 3 తేదీల్లో జరగనుంది.

ఇదీ చూడండి: వడ్డీరేట్లే కాదు మా దగ్గర మరిన్ని అస్త్రాలున్నాయి: దాస్​

ZCZC
PRI GEN LGL NAT
.NEWDELHI LGD17
DL-COURT-NIRBHAYA
Nirbhaya: Tihar authorities move court for fresh death warrants, Court seeks convicts response
         New Delhi, Feb 6 (PTI) A Delhi court has sought response by Friday of the four death row convicts in the Nirbhaya gang rape and murder case on an application seeking issuance of fresh death warrants against them.
          Additional Sessions Judge Dharmendra Rana sought the convicts' response on an application moved on Thursday by the Tihar Jail authorities for the fresh death warrants.
          The trial court had on January 31 stayed "till further orders" execution of the four convicts in the case -- Mukesh Kumar Singh (32), Pawan Gupta (25), Vinay Kumar Sharma (26) and Akshay Kumar (31), who are lodged in Tihar Jail. PTI UK LLP LLP
RDM
RDM
02061348
NNNN
Last Updated : Feb 29, 2020, 10:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.