ETV Bharat / business

ఎస్​ బ్యాంకుకు ఆర్బీఐ అండ- క్రెడిట్​ లైన్ పెంపు​

author img

By

Published : Mar 19, 2020, 5:39 PM IST

సంక్షోభంలోకి వెళ్లిన ఎస్​ బ్యాంకులో నగదు సమస్యను అధిగమించేందుకు క్రెడిట్​ లైన్​ను రూ.60 వేల కోట్లకు పెంచింది భారతీయ రిజర్వ్​ బ్యాంకు (ఆర్బీఐ). ఈ నిర్ణయంతో ఖాతాదారులకు సరిపడా నగదు అందుబాటులో ఉంటుందని కేంద్ర బ్యాంకు వర్గాలు తెలిపాయి.

credit line to Yes Bank
ఎస్​ బ్యాంకు

ఎస్​ బ్యాంకుపై మారటోరియం ఎత్తివేసిన భారతీయ రిజర్వ్​ బ్యాంకు​ (ఆర్బీఐ) మరో కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకులో నగదు సమస్యను అధిగమించేందుకు క్రెడిట్​ లైన్​ను రూ.60,000 కోట్లకు పెంచింది. దీంతో ఖాతాదారులకు సరిపడా నగదు లభ్యమయ్యే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.

సంక్షోభంలో కూరుకుపోయిన ఎస్​ బ్యాంకులో నగదు కొరత మినహా ఎలాంటి సమస్యలు లేవని ఆర్బీఐ గుర్తించినట్లు కేంద్ర బ్యాంకు అధికార వర్గాలు తెలిపాయి. ఒక షరతుతో లైన్​ ఆఫ్​ క్రెడిట్​ను పెంచినట్లు పేర్కొన్నారు అధికారులు. ఆర్బీఐ నుంచి నిధులను పొందాలంటే ముందుగా బ్యాంకులోని సొమ్మును పూర్తిగా ఖాళీ చేయాల్సి ఉంటుందన్నారు.

గవర్నర్​ భరోసా..

లైన్ ఆఫ్​ క్రెడిట్​ ​పెంపుపై గత సోమవారమే ఆర్బీఐ గవర్నర్​ శక్తికాంత దాస్​ భరోసా కల్పించారు. మారటోరియం ఎత్తివేసిన తర్వాత నగదు అవసరమైతే అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఎస్​ బ్యాంకులో తగినంత నగదు అందుబాటులో ఉందన్నారు. ఇప్పటివరకు భారత చరిత్రలో ఏ బ్యాంకు ఖాతాదారులు తమ సొమ్మును కోల్పోయిన దాఖలాలు లేవని స్పష్టం చేశారు.

ఆర్బీఐ చట్టం 1934లోని సెక్షన్​ 17 ప్రకారం.. కేంద్ర బ్యాంకు దేశంలోని ఇతర బ్యాంకులకు రుణాలు, అడ్వాన్సుల రూపంలో నగదు సహాయం అందిస్తుంది.

మారటోరియం విధింపుతో..

అప్పుల ఉబిలో కూరుకుపోయే పరిస్థితుల్లో ఉన్న ఎస్​ బ్యాంకుపై మార్చి 5న మారటోరియం విధించింది ఆర్బీఐ. నగదు ఉపసంహరణను రూ.50 వేలకు పరిమితం చేయటం సహా పలు ఆంక్షలు విధించింది. అప్పటి నుంచి బ్యాంకు ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చింది.

ఎస్​ బ్యాంకుపై మారటోరియం ఎత్తివేసిన భారతీయ రిజర్వ్​ బ్యాంకు​ (ఆర్బీఐ) మరో కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకులో నగదు సమస్యను అధిగమించేందుకు క్రెడిట్​ లైన్​ను రూ.60,000 కోట్లకు పెంచింది. దీంతో ఖాతాదారులకు సరిపడా నగదు లభ్యమయ్యే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.

సంక్షోభంలో కూరుకుపోయిన ఎస్​ బ్యాంకులో నగదు కొరత మినహా ఎలాంటి సమస్యలు లేవని ఆర్బీఐ గుర్తించినట్లు కేంద్ర బ్యాంకు అధికార వర్గాలు తెలిపాయి. ఒక షరతుతో లైన్​ ఆఫ్​ క్రెడిట్​ను పెంచినట్లు పేర్కొన్నారు అధికారులు. ఆర్బీఐ నుంచి నిధులను పొందాలంటే ముందుగా బ్యాంకులోని సొమ్మును పూర్తిగా ఖాళీ చేయాల్సి ఉంటుందన్నారు.

గవర్నర్​ భరోసా..

లైన్ ఆఫ్​ క్రెడిట్​ ​పెంపుపై గత సోమవారమే ఆర్బీఐ గవర్నర్​ శక్తికాంత దాస్​ భరోసా కల్పించారు. మారటోరియం ఎత్తివేసిన తర్వాత నగదు అవసరమైతే అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఎస్​ బ్యాంకులో తగినంత నగదు అందుబాటులో ఉందన్నారు. ఇప్పటివరకు భారత చరిత్రలో ఏ బ్యాంకు ఖాతాదారులు తమ సొమ్మును కోల్పోయిన దాఖలాలు లేవని స్పష్టం చేశారు.

ఆర్బీఐ చట్టం 1934లోని సెక్షన్​ 17 ప్రకారం.. కేంద్ర బ్యాంకు దేశంలోని ఇతర బ్యాంకులకు రుణాలు, అడ్వాన్సుల రూపంలో నగదు సహాయం అందిస్తుంది.

మారటోరియం విధింపుతో..

అప్పుల ఉబిలో కూరుకుపోయే పరిస్థితుల్లో ఉన్న ఎస్​ బ్యాంకుపై మార్చి 5న మారటోరియం విధించింది ఆర్బీఐ. నగదు ఉపసంహరణను రూ.50 వేలకు పరిమితం చేయటం సహా పలు ఆంక్షలు విధించింది. అప్పటి నుంచి బ్యాంకు ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.