ETV Bharat / business

వరుసగా మూడోరోజు పెరిగిన పెట్రో​ ధరలు

author img

By

Published : Jun 9, 2020, 9:14 AM IST

Updated : Jun 9, 2020, 10:39 AM IST

petrol price hike
మళ్లీ పెరిగిన పెట్రోల్ ధరలు

10:23 June 09

వరుసగా మూడోరోజూ పెట్రోల్​, డీజిల్​ ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్ ధర (దిల్లీలో) 54పైసలు పెరిగి రూ.73కు చేరింది. డీజిల్ ధర లీటర్​కు 58 పైసలు పెరిగి రూ.72.46 వద్దకు చేరింది.

ఈ మూడు రోజుల్లో పెట్రోల్​ ధర (లీటర్​పై) మొత్తం రూ.1.74, డీజిల్ ధర (లీటర్​పై) రూ.1.78 పెరిగింది.

లాక్​డౌన్ నేపథ్యంలో దాదాపు 82 రోజుల తర్వాత రోజువారీ చమురు ధరల సవరణలను ఆదివారం నుంచి పునరుద్ధరించాయి ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు. ఇందులో భాగంగా అంతర్జాతీయంగా పెరిగిన ముడి చమురు ధరలకు అనుగుణంగా వరుసగా మూడో రోజూ పెట్రోల్​, డీజిల్ ధరలను పెంచాయి.

సుంకాల వడ్డింపు..

అంతర్జాతీయ మార్కెట్​లో అనిశ్చితి కారణంగా విమాన ఇంధనం ఏటీఎఫ్, వంటగ్యాస్​ ధరలను క్రమంగా సవరించాయి. పెట్రో ధరలపై మాత్రం మార్చి 16 నుంచి ఎలాంటి మార్పులు చేయలేదు. అంతర్జాతీయంగా ధరలు తగ్గిన నేపథ్యంలో పెట్రోల్​, డీజిల్​పై ఎక్సైజ్​ సుంకాలను వడ్డించింది కేంద్ర ప్రభుత్వం. తొలుత రూ.3 సుంకం పెంచిన కేంద్రం, అనంతరం పెట్రోల్​పై రూ.10, డీజిల్​పై రూ.13 పెంచింది.  

ఆయిల్​ కంపెనీలు కూడా బీఎస్​-6 విధానానికి మారిన తర్వాత ఇదే సూత్రాన్ని పాటించాయి. అంతర్జాతీయంగా తగ్గిన ధరల నుంచి లాభాలను స్వీకరించి.. ఆ లాభాలను వినియోగదారులకు బదిలీ చేయలేదు. అయితే ఇటీవల పెరిగిన చమురు ధరల భారాన్ని మాత్రం వినియోగదారులపై మోపుతున్నాయి.

09:10 June 09

మళ్లీ పెరిగిన పెట్రో ధరలు

వరుసగా మూడో రోజూ పెట్రో ధరలు పెరిగాయి. పెట్రోల్​పై లీటర్​కు 54పైసలు, డీజిల్​పై 58 పైసలు పెంచాయి దేశీయ చమురు సంస్థలు. 

ప్రభుత్వ యాజమాన్యంలోని చమురు సంస్థలు 82 రోజుల విరామం తర్వాత రోజువారీ సవరణలను ఆదివారం నుంచి పునరుద్ధరించాయి. తొలి రెండు రోజులు పెట్రోల్​, డీజిల్​పై లీటర్​కు 60పైసలు చొప్పున పెంచాయి ఆయిల్ కంపెనీలు.

10:23 June 09

వరుసగా మూడోరోజూ పెట్రోల్​, డీజిల్​ ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్ ధర (దిల్లీలో) 54పైసలు పెరిగి రూ.73కు చేరింది. డీజిల్ ధర లీటర్​కు 58 పైసలు పెరిగి రూ.72.46 వద్దకు చేరింది.

ఈ మూడు రోజుల్లో పెట్రోల్​ ధర (లీటర్​పై) మొత్తం రూ.1.74, డీజిల్ ధర (లీటర్​పై) రూ.1.78 పెరిగింది.

లాక్​డౌన్ నేపథ్యంలో దాదాపు 82 రోజుల తర్వాత రోజువారీ చమురు ధరల సవరణలను ఆదివారం నుంచి పునరుద్ధరించాయి ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు. ఇందులో భాగంగా అంతర్జాతీయంగా పెరిగిన ముడి చమురు ధరలకు అనుగుణంగా వరుసగా మూడో రోజూ పెట్రోల్​, డీజిల్ ధరలను పెంచాయి.

సుంకాల వడ్డింపు..

అంతర్జాతీయ మార్కెట్​లో అనిశ్చితి కారణంగా విమాన ఇంధనం ఏటీఎఫ్, వంటగ్యాస్​ ధరలను క్రమంగా సవరించాయి. పెట్రో ధరలపై మాత్రం మార్చి 16 నుంచి ఎలాంటి మార్పులు చేయలేదు. అంతర్జాతీయంగా ధరలు తగ్గిన నేపథ్యంలో పెట్రోల్​, డీజిల్​పై ఎక్సైజ్​ సుంకాలను వడ్డించింది కేంద్ర ప్రభుత్వం. తొలుత రూ.3 సుంకం పెంచిన కేంద్రం, అనంతరం పెట్రోల్​పై రూ.10, డీజిల్​పై రూ.13 పెంచింది.  

ఆయిల్​ కంపెనీలు కూడా బీఎస్​-6 విధానానికి మారిన తర్వాత ఇదే సూత్రాన్ని పాటించాయి. అంతర్జాతీయంగా తగ్గిన ధరల నుంచి లాభాలను స్వీకరించి.. ఆ లాభాలను వినియోగదారులకు బదిలీ చేయలేదు. అయితే ఇటీవల పెరిగిన చమురు ధరల భారాన్ని మాత్రం వినియోగదారులపై మోపుతున్నాయి.

09:10 June 09

మళ్లీ పెరిగిన పెట్రో ధరలు

వరుసగా మూడో రోజూ పెట్రో ధరలు పెరిగాయి. పెట్రోల్​పై లీటర్​కు 54పైసలు, డీజిల్​పై 58 పైసలు పెంచాయి దేశీయ చమురు సంస్థలు. 

ప్రభుత్వ యాజమాన్యంలోని చమురు సంస్థలు 82 రోజుల విరామం తర్వాత రోజువారీ సవరణలను ఆదివారం నుంచి పునరుద్ధరించాయి. తొలి రెండు రోజులు పెట్రోల్​, డీజిల్​పై లీటర్​కు 60పైసలు చొప్పున పెంచాయి ఆయిల్ కంపెనీలు.

Last Updated : Jun 9, 2020, 10:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.