ETV Bharat / business

ఆ రోజే స్టాక్​ మార్కెట్లో పేటీఎం షేర్స్​ లిస్టింగ్.. ఆరంభ ధర ఎంతంటే?

author img

By

Published : Nov 12, 2021, 4:06 PM IST

ప్రముఖ డిజిటల్‌ నగదు బదిలీ సంస్థ పేటీఎం(Paytm IPO) షేర్లు అతి త్వరలో స్టాక్​ మార్కెట్లో నమోదుకానున్నాయి. దీనికోసం ఒక్కో షేరు ధరను రూ.2,150గా కంపెనీ నిర్ణయించింది. రూ.18,300కోట్ల సమీకరణే లక్ష్యంగా పేటీఎం చేపట్టిన ఐపీఓ ఇటీవలే ముగియగా.. 1.89 రెట్లు అధికంగా సబ్‌స్క్రైబ్ అయింది.

paytm
పేటీఎం

డిజిటల్ చెల్లింపులు, ఆర్థిక సేవలందించే ప్రముఖ సంస్థ పేటీఎం(paytm ipo) ఒక్కో షేర్ ప్రారంభ ధరను రూ.2,150గా నిర్ణయించింది. ఈ మేరకు రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌కు సమర్పించిన నివేదికలో పేర్కొంది.

ఇటీవలే పేటీఎం ఐపీఓ(Paytm IPO date) ముగియగా.. నవంబర్ 18న పేటీఎం షేర్లు స్టాక్​ మార్కెట్లో లిస్ట్ అయ్యే అవకాశముంది. కంపెనీ మొత్తం విలువను రూ.1.39 లక్షల కోట్లుగా లెక్కగట్టిన పేటీం.. ఒక్కో షేరు ధరను రూ.2,080-2,150 మధ్య నిర్ణయించింది.

పేటీఎం ఐపీఓ హైలెట్స్ ఓసారి గమనిస్తే..

  • రూ.18,300 కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంతో పబ్లిక్‌ ఇష్యూ చేపట్టగా.. 1.89 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్(paytm ipo subscription) అయింది.
  • ఐపీఓ ద్వారా రూ.18,300 కోట్ల సమీకరించి.. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోనే అతిపెద్ద ఫిన్​టెక్ కంపెనీగా పేటీఎం అవతరించింది.
  • స్పెయిన్​కు చెందిన 'ఆల్‌ ఫండ్స్' తర్వాత 2021లో రెండో అతిపెద్ద ఐపీఓ ఇదే. మొత్తంగా.. ప్రపంచవ్యాప్తంగా నాలుగో అతిపెద్ద ఐపీఓగా పేటీఎం నిలిచింది.
  • విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు, దేశీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థల భాగస్వామ్యంతో తమ షేర్లు ఓవర్‌ సబ్‌స్క్రైబ్ అయినట్లు నియంత్రణ సంస్థలకు ఇచ్చిన సమాచారంలో పేటీఎం వెల్లడించింది.
  • ఐపీఓలో సేకరించిన మొత్తం రూ.18,300 కోట్ల నుంచి బుక్​ రన్నింగ్ మేనేజర్లకు(బీఆర్​ల్ఎం) రూ.323.9 కోట్లు(1.8 శాతం) పేటీఎం చెల్లించనుంది. దేశంలో ఇప్పటివరకు జరిగిన ఐపీఓ చెల్లింపుల్లో ఇదొకటి కావడం విశేషం.

తన ఐపీఓ కోసం మోర్గాన్ స్టాన్లీ, గోల్డ్‌మన్ శాక్స్, యాక్సిస్ క్యాపిటల్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, జేపీ మోర్గాన్, సిటీ బ్యాంక్, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్‌లను బీఆర్​ఎల్​ఎంగా పేటీఎం నియమించుకుంది.

ఇవీ చదవండి:

డిజిటల్ చెల్లింపులు, ఆర్థిక సేవలందించే ప్రముఖ సంస్థ పేటీఎం(paytm ipo) ఒక్కో షేర్ ప్రారంభ ధరను రూ.2,150గా నిర్ణయించింది. ఈ మేరకు రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌కు సమర్పించిన నివేదికలో పేర్కొంది.

ఇటీవలే పేటీఎం ఐపీఓ(Paytm IPO date) ముగియగా.. నవంబర్ 18న పేటీఎం షేర్లు స్టాక్​ మార్కెట్లో లిస్ట్ అయ్యే అవకాశముంది. కంపెనీ మొత్తం విలువను రూ.1.39 లక్షల కోట్లుగా లెక్కగట్టిన పేటీం.. ఒక్కో షేరు ధరను రూ.2,080-2,150 మధ్య నిర్ణయించింది.

పేటీఎం ఐపీఓ హైలెట్స్ ఓసారి గమనిస్తే..

  • రూ.18,300 కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంతో పబ్లిక్‌ ఇష్యూ చేపట్టగా.. 1.89 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్(paytm ipo subscription) అయింది.
  • ఐపీఓ ద్వారా రూ.18,300 కోట్ల సమీకరించి.. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోనే అతిపెద్ద ఫిన్​టెక్ కంపెనీగా పేటీఎం అవతరించింది.
  • స్పెయిన్​కు చెందిన 'ఆల్‌ ఫండ్స్' తర్వాత 2021లో రెండో అతిపెద్ద ఐపీఓ ఇదే. మొత్తంగా.. ప్రపంచవ్యాప్తంగా నాలుగో అతిపెద్ద ఐపీఓగా పేటీఎం నిలిచింది.
  • విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు, దేశీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థల భాగస్వామ్యంతో తమ షేర్లు ఓవర్‌ సబ్‌స్క్రైబ్ అయినట్లు నియంత్రణ సంస్థలకు ఇచ్చిన సమాచారంలో పేటీఎం వెల్లడించింది.
  • ఐపీఓలో సేకరించిన మొత్తం రూ.18,300 కోట్ల నుంచి బుక్​ రన్నింగ్ మేనేజర్లకు(బీఆర్​ల్ఎం) రూ.323.9 కోట్లు(1.8 శాతం) పేటీఎం చెల్లించనుంది. దేశంలో ఇప్పటివరకు జరిగిన ఐపీఓ చెల్లింపుల్లో ఇదొకటి కావడం విశేషం.

తన ఐపీఓ కోసం మోర్గాన్ స్టాన్లీ, గోల్డ్‌మన్ శాక్స్, యాక్సిస్ క్యాపిటల్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, జేపీ మోర్గాన్, సిటీ బ్యాంక్, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్‌లను బీఆర్​ఎల్​ఎంగా పేటీఎం నియమించుకుంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.