ETV Bharat / business

'సాటిలేని వారసత్వం ఎయిర్​ఇండియా సొంతం'

author img

By

Published : Feb 13, 2020, 10:59 AM IST

Updated : Mar 1, 2020, 4:46 AM IST

యాజమాన్యం చేతులు మారినప్పటికీ ఎయిర్​ఇండియా వారసత్వం మాత్రం చెక్కుచెదరదని ఆ సంస్థ చీఫ్​ అశ్వని లొహానీ అన్నారు. నష్టాల్లో ఉన్న ఈ విమానయాన సంస్థను ప్రైవేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన తరుణంలో లొహానీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

AIR INDIA
సాటిలేని వారసత్వం ఎయిర్​ఇండియా సొంతం: లొహానీ

ఎయిర్ఇండియా యాజమాన్యం మారినప్పటికీ దాని వారసత్వం మాత్రం చెక్కుచెదరదని ఆ సంస్థ చీఫ్ అశ్వని లొహానీ అన్నారు. ఎయిర్​ఇండియా ఆధ్వర్యంలో 'సొసైటీ ఫర్ కల్చర్​ అండ్ ఎన్విరాన్మెంట్​' నిర్వహిస్తున్న ఐదు రోజుల ప్రదర్శనను ప్రారంభించిన సందర్భంగా లొహానీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ విమానయాన సంస్థను ప్రైవేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన తరుణంలో లొహానీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

దివంగత జేఆర్​డీ టాటా ప్రారంభించిన ఎయిర్​ఇండియా విమానయాన సంస్థ భారీగా నష్టపోయింది. అయినప్పటికీ ఎయిర్​ఇండియా ఇప్పటికీ చాలా గొప్ప సంస్థేనని లొహానీ పునరుద్ఘాటించారు. సాటిలేని వారసత్వం దాని సొంతమన్నారు.

"ఒక సంస్థగా ఎయిర్​ఇండియా చాలా బలంగా ఉంది. ఈ రోజుకి కూడా అసమానతలు ఉన్నప్పటికీ మేము మా కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నాం. దేశానికి అవసరమైన ప్రతిసారి ఎయిర్​ఇండియా ముందుంది. చైనాను కొవిడ్​-19 అతలాకుతలం చేస్తుంటే.. అక్కడ ఒంటరిగా మిగిలిపోయిన భారతీయులను 'ఎయిర్​ఇండియా'నే తీసుకొచ్చింది."

- అశ్వని లొహానీ, ఎయిర్​ఇండియా చీఫ్​

దానికీ, దీనికీ సంబంధం లేదు..

ఎయిర్​ఇండియా ప్రైవేటీకరణకు, తాజాగా నిర్వహిస్తున్న ప్రదర్శనకు ఎలాంటి సంబంధం లేదని లొహానీ స్పష్టం చేశారు. 'ప్రదర్శన నిర్వహించాలని సొసైటీ ఫర్ కల్పర్​ అండ్ ఎన్విరాన్మెంట్ కార్యదర్శి మీరాదాస్​ మమ్మల్ని సంప్రదించారు. అందుకు మేము మా మద్దతిచ్చాం.' అని లొహానీ స్పష్టం చేశారు.

ప్రైవేటీకరణ దిశగా

నష్టాల్లో ఉన్న ఎయిర్​ఇండియాను ప్రైవేటీకరించాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించినప్పటికీ... గతేడాది ఎలాంటి బిడ్లు దాఖలు కాలేదు. ఈ నేపథ్యంలో ఎన్​ఆర్​ఐలకు పూర్తి యాజమాన్యంలో సహా, ఏ ప్రైవేటు పార్టీకైనా విమానయాన సంస్థలో 100 శాతం ఈక్విటీని విక్రయించడానికి కేంద్రం అనుమతించింది.

2007-08లో తీవ్ర నష్టాల్లో ఉన్న ఇండియన్ ఎయిర్​లైన్స్​ను ఎయిర్ఇండియాలో విలీనం చేసింది. అప్పటి నుంచి సంస్థకు ఇబ్బందులు ప్రారంభమయ్యాయి. లాభం రాకపోగా.. నష్టాల్లో కూరుకుపోయింది. ఫలితంగా ఎయిర్​ఇండియాకు మొత్తం 60 వేల కోట్ల రూపాయల వరకు అప్పు ఏర్పడింది. అయితే విక్రయ ప్రక్రియను సులభతరం చేయడానికి కొత్తగా హోల్డింగ్ కంపెనీని సృష్టించిన తరువాత ఎయిర్ఇండియా అప్పులు రూ.23,000 కోట్లకు దిగొచ్చాయి.

ఇదీ చూడండి: వృద్ధి భయాలతో.. నష్టాల్లో స్టాక్​ మార్కెట్లు

ఎయిర్ఇండియా యాజమాన్యం మారినప్పటికీ దాని వారసత్వం మాత్రం చెక్కుచెదరదని ఆ సంస్థ చీఫ్ అశ్వని లొహానీ అన్నారు. ఎయిర్​ఇండియా ఆధ్వర్యంలో 'సొసైటీ ఫర్ కల్చర్​ అండ్ ఎన్విరాన్మెంట్​' నిర్వహిస్తున్న ఐదు రోజుల ప్రదర్శనను ప్రారంభించిన సందర్భంగా లొహానీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ విమానయాన సంస్థను ప్రైవేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన తరుణంలో లొహానీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

దివంగత జేఆర్​డీ టాటా ప్రారంభించిన ఎయిర్​ఇండియా విమానయాన సంస్థ భారీగా నష్టపోయింది. అయినప్పటికీ ఎయిర్​ఇండియా ఇప్పటికీ చాలా గొప్ప సంస్థేనని లొహానీ పునరుద్ఘాటించారు. సాటిలేని వారసత్వం దాని సొంతమన్నారు.

"ఒక సంస్థగా ఎయిర్​ఇండియా చాలా బలంగా ఉంది. ఈ రోజుకి కూడా అసమానతలు ఉన్నప్పటికీ మేము మా కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నాం. దేశానికి అవసరమైన ప్రతిసారి ఎయిర్​ఇండియా ముందుంది. చైనాను కొవిడ్​-19 అతలాకుతలం చేస్తుంటే.. అక్కడ ఒంటరిగా మిగిలిపోయిన భారతీయులను 'ఎయిర్​ఇండియా'నే తీసుకొచ్చింది."

- అశ్వని లొహానీ, ఎయిర్​ఇండియా చీఫ్​

దానికీ, దీనికీ సంబంధం లేదు..

ఎయిర్​ఇండియా ప్రైవేటీకరణకు, తాజాగా నిర్వహిస్తున్న ప్రదర్శనకు ఎలాంటి సంబంధం లేదని లొహానీ స్పష్టం చేశారు. 'ప్రదర్శన నిర్వహించాలని సొసైటీ ఫర్ కల్పర్​ అండ్ ఎన్విరాన్మెంట్ కార్యదర్శి మీరాదాస్​ మమ్మల్ని సంప్రదించారు. అందుకు మేము మా మద్దతిచ్చాం.' అని లొహానీ స్పష్టం చేశారు.

ప్రైవేటీకరణ దిశగా

నష్టాల్లో ఉన్న ఎయిర్​ఇండియాను ప్రైవేటీకరించాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించినప్పటికీ... గతేడాది ఎలాంటి బిడ్లు దాఖలు కాలేదు. ఈ నేపథ్యంలో ఎన్​ఆర్​ఐలకు పూర్తి యాజమాన్యంలో సహా, ఏ ప్రైవేటు పార్టీకైనా విమానయాన సంస్థలో 100 శాతం ఈక్విటీని విక్రయించడానికి కేంద్రం అనుమతించింది.

2007-08లో తీవ్ర నష్టాల్లో ఉన్న ఇండియన్ ఎయిర్​లైన్స్​ను ఎయిర్ఇండియాలో విలీనం చేసింది. అప్పటి నుంచి సంస్థకు ఇబ్బందులు ప్రారంభమయ్యాయి. లాభం రాకపోగా.. నష్టాల్లో కూరుకుపోయింది. ఫలితంగా ఎయిర్​ఇండియాకు మొత్తం 60 వేల కోట్ల రూపాయల వరకు అప్పు ఏర్పడింది. అయితే విక్రయ ప్రక్రియను సులభతరం చేయడానికి కొత్తగా హోల్డింగ్ కంపెనీని సృష్టించిన తరువాత ఎయిర్ఇండియా అప్పులు రూ.23,000 కోట్లకు దిగొచ్చాయి.

ఇదీ చూడండి: వృద్ధి భయాలతో.. నష్టాల్లో స్టాక్​ మార్కెట్లు

Last Updated : Mar 1, 2020, 4:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.