ETV Bharat / business

ఇకపై అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లోనూ..

ఆన్​లైన్ విక్రయ వేదికలు అమెజాన్​, ఫ్లిప్​కార్ట్​లు... ఉత్పత్తుల దేశీయ మూలాలను ప్రదర్శించేందుకు అంగీకరించాయి. ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ, ఇంటర్నల్ ట్రేడ్​ సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నాయి. రెండు వారాల్లోగా ఉత్పత్తుల దేశీయ మూలాలని ప్రదర్శిస్తామని ఈ దిగ్గజ సంస్థలు చెప్పినట్లు సమాచారం.

author img

By

Published : Jun 25, 2020, 4:02 AM IST

online retailers such as Amazon and Flipkart have agreed to showcase the product's domestic roots
ఇకపై అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లోనూ

ఉత్పత్తుల దేశీయ మూలాలను ప్రదర్శించేందుకు ఆన్‌లైన్‌ విక్రయ వేదికలైన అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ అంగీకరించాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పరిశ్రమ వర్గాలతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నాయని వెల్లడించాయి.

ప్రభుత్వ ఈ-మార్కెట్‌ వెబ్‌సైట్‌లో ఇకపై విక్రయించే ఉత్పత్తుల దేశీయ మూలాలను ప్రదర్శించాలని సంబంధిత అధికారులు మంగళవారం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఒక ఉత్పత్తిలో వినియోగించిన స్థానిక వనరుల శాతాన్నీ ప్రదర్శించాలని అధికారులు ఆదేశించారు. విక్రయదారులు ఈ ఆదేశాలను పాటించకపోతే వెబ్‌సైట్‌ నుంచి సంబంధిత ఉత్పత్తులను తొలగిస్తామని హెచ్చరించారు.

రెండు వారాల్లోగా..

ప్రైవేటు ఈ కామర్స్‌ కంపెనీలకు ఈ నిబంధన వర్తిస్తుందో లేదో తెలియనప్పటికీ అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ ఇందుకు ముందుకు రావడం గమనార్హం. ఈ రోజు జరిగిన ప్రమోషన్‌ ఆఫ్ ఇండస్ట్రీ, ఇంటర్నల్‌ ట్రేడ్‌ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నాయి. రెండు వారాల్లోగా దేశీయ మూలాలను ప్రదర్శిస్తామని చెప్పినట్టు సమాచారం.

గల్వాన్‌ లోయలో భారత్‌, చైనా సైనికుల మధ్య జరిగిన తీవ్ర ఘర్షణలో 20 మంది భారత జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా చైనా వస్తువుల బహిష్కరణ ప్రచారం పుంజుకుంది. వివిధ పరిశ్రమలకు చెందిన సంఘాలు సైతం ఈ ప్రచారానికి మద్దతు ప్రకటిస్తున్నాయి. ప్రభుత్వ ఈ-మార్కెట్‌ వేదిక నిబంధనల్లో మార్పు చేయగానే అమెజాన్‌ వంటి వెబ్‌సైట్లలోనూ ఈ మార్పులు తీసుకురావాలని ఆర్‌ఎస్‌ఎస్‌ మంగళవారం సూచించడం గమనార్హం.

ఇదీ చూడండి: ఆదాయపు పన్ను రిటర్ను దాఖలు గడువు పెంపు

ఉత్పత్తుల దేశీయ మూలాలను ప్రదర్శించేందుకు ఆన్‌లైన్‌ విక్రయ వేదికలైన అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ అంగీకరించాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పరిశ్రమ వర్గాలతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నాయని వెల్లడించాయి.

ప్రభుత్వ ఈ-మార్కెట్‌ వెబ్‌సైట్‌లో ఇకపై విక్రయించే ఉత్పత్తుల దేశీయ మూలాలను ప్రదర్శించాలని సంబంధిత అధికారులు మంగళవారం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఒక ఉత్పత్తిలో వినియోగించిన స్థానిక వనరుల శాతాన్నీ ప్రదర్శించాలని అధికారులు ఆదేశించారు. విక్రయదారులు ఈ ఆదేశాలను పాటించకపోతే వెబ్‌సైట్‌ నుంచి సంబంధిత ఉత్పత్తులను తొలగిస్తామని హెచ్చరించారు.

రెండు వారాల్లోగా..

ప్రైవేటు ఈ కామర్స్‌ కంపెనీలకు ఈ నిబంధన వర్తిస్తుందో లేదో తెలియనప్పటికీ అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ ఇందుకు ముందుకు రావడం గమనార్హం. ఈ రోజు జరిగిన ప్రమోషన్‌ ఆఫ్ ఇండస్ట్రీ, ఇంటర్నల్‌ ట్రేడ్‌ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నాయి. రెండు వారాల్లోగా దేశీయ మూలాలను ప్రదర్శిస్తామని చెప్పినట్టు సమాచారం.

గల్వాన్‌ లోయలో భారత్‌, చైనా సైనికుల మధ్య జరిగిన తీవ్ర ఘర్షణలో 20 మంది భారత జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా చైనా వస్తువుల బహిష్కరణ ప్రచారం పుంజుకుంది. వివిధ పరిశ్రమలకు చెందిన సంఘాలు సైతం ఈ ప్రచారానికి మద్దతు ప్రకటిస్తున్నాయి. ప్రభుత్వ ఈ-మార్కెట్‌ వేదిక నిబంధనల్లో మార్పు చేయగానే అమెజాన్‌ వంటి వెబ్‌సైట్లలోనూ ఈ మార్పులు తీసుకురావాలని ఆర్‌ఎస్‌ఎస్‌ మంగళవారం సూచించడం గమనార్హం.

ఇదీ చూడండి: ఆదాయపు పన్ను రిటర్ను దాఖలు గడువు పెంపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.