ETV Bharat / business

చౌకగా విద్యుత్తు వాహనాలు.. 'బ్యాటరీ మార్పిడి సేవ' విస్తరణతో

author img

By

Published : Feb 27, 2022, 10:38 AM IST

EV battery swapping policy: విద్యుత్​ వాహనాల వినియోగాన్ని ప్రభుత్వం ప్రోత్సాహిస్తున్నా.. ప్రజలు ఆశించిన స్థాయిలో ఆ దిశగా ముందడుగు వేయడం లేదు. ఎలక్ట్రిక్​ వాహనాలతో పాటు వాటిల్లో వాడే బ్యాటరీ ధరలు అధికంగా ఉండటమే అందుకు కారణం. దీనికి పరిష్కారంగా 'బ్యాటరీ మార్పిడి సేవ' సేవను విస్తరించాలని కేంద్రం నిర్ణయించింది. ఇంతకీ ఇదేంటంటే?

battery swapping policy
electric vehicles

EV battery swapping policy: పర్యావరణాన్ని పరిరక్షించేందుకు విద్యుత్తు వాహనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఈ వాహనాల తయారీ, వినియోగాన్ని వేగవంతం చేసేందుకు ఫేమ్‌ పథకాన్ని ప్రభుత్వం ఆవిష్కరించింది. అయినా విద్యుత్తు వాహనాల వాడకం ఆశించిన స్థాయిలో పెరగడం లేదు. విద్యుత్తు వాహనాలతో పాటు వాటిల్లో వినియోగించే బ్యాటరీ ధర అధికంగా ఉండటం దీనికి ప్రధాన కారణం. బ్యాటరీ ఛార్జింగ్‌ సదుపాయాలు కూడా విస్తరించాల్సి ఉంది. ప్రస్తుత బ్యాటరీలతో విద్యుత్తు వాహనాలు సుదూర ప్రయాణాలు చేయలేకపోతున్నాయి. అందువల్లే బ్యాటరీ మార్పిడి సేవ (బీఏఏఎస్‌- బ్యాటరీ యాజ్‌ ఏ సర్వీస్‌) కు సంబంధించి ప్రత్యేక విధి విధానాలను 4 నెలల్లో ఆవిష్కరించాలని 'నీతి ఆయోగ్‌' నిర్ణయించింది. పెట్రోల్‌/డీజిల్‌ పోయించుకున్నట్లే.. బ్యాటరీ ఛార్జింగ్‌ అయిపోతుందని గ్రహించగానే, వాహనదారుడు సమీపంలోని ఛార్జింగ్‌ స్టేషనుకు వెళ్లి, వాహనంలోని ఛార్జింగ్‌ అయిపోయిన బ్యాటరీని తీసి, పూర్తిఛార్జింగ్‌తో ఉన్న బ్యాటరీ అమర్చుకుని వెళ్లేందుకు ఈ విధానం ఉపకరిస్తుందని చెబుతున్నారు.

battery swapping policy
.

'పట్టణాలు/ నగరాల్లో స్థలాభావం కారణంగా ఛార్జింగ్‌ స్టేషన్లను అధిక సంఖ్యలో ఏర్పాటు చేయలేకపోతున్నారు. పైగా ఛార్జింగ్‌కు అధికసమయం పడుతుంది కనుక వాహనాలను ప్రయాణం మధ్యలో అంతసేపు నిలపడమూ కష్టమే'.. ఈ బాధలు తీరేలా బ్యాటరీ మార్పిడి విధానాన్ని తీసుకువస్తామని కేంద్ర బడ్జెట్‌లోనూ పేర్కొన్నారు. ఈ మార్పులతో విద్యుత్తు వాహనాల ధర దిగివస్తుందని అంచనా వేస్తున్నారు.

ఏ విధంగా మేలు?

విద్యుత్తు వాహనాలను కంపెనీలు రెండు విధాలుగా ఉత్పత్తి చేస్తున్నాయి. 'ఫిక్స్‌డ్‌' బ్యాటరీ ఉండే వాహనాలను ఇంటి దగ్గర/లేదా సంబంధిత కేంద్రాల్లో ఛార్జింగ్‌ చేసుకోవాల్సిందే. మరొక రకం వాహనాల్లో బ్యాటరీ ఉండదు. కేవలం వాహనాన్ని మాత్రమే వినియోగదార్లు కొనుగోలు చేస్తారు. బ్యాటరీని అద్దెకు తీసుకుంటారు. ఛార్జింగ్‌ అయిపోగానే మార్పిడి కేంద్రానికి వెళ్లి ఆ బ్యాటరీ ఇచ్చేసి.. ఛార్జింగ్‌ ఉన్న బ్యాటరీని తీసుకోవచ్చు. ఇటువంటి వాహనాల ధర సగానికి సగం తక్కువగా ఉంటుంది. బ్యాటరీ మార్పిడికి ఎక్కువ సమయం పట్టదు కనుక, ప్రయాణాలు ఆలస్యం కావు. ఛార్జింగ్‌ స్టేషన్లను నగరాల్లోని ప్రధాన రహదార్లలో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉండదు.

కొన్ని సంస్థల ఆసక్తి

సన్‌ మొబిలిటీ, గొగోరో అనే సంస్థలు బ్యాటరీ మార్పిడి సేవ (బాస్‌) ను మనదేశంలో ఆవిష్కరించడానికి ముందుకు వస్తున్నాయి. తైవాన్‌లో 2,500 బ్యాటరీ స్వాపింగ్‌ స్టేషన్లు నిర్వహిస్తున్న గొగోరో మనదేశానికి చెందిన హీరో మోటోకార్ప్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. బెంగళూరుకు చెందిన బౌన్స్‌ అనే అంకుర సంస్థ, ఇప్పటికే 10 లక్షలకు పైగా స్వాప్‌ (బ్యాటరీ మార్పిడి) లను నమోదు చేసినట్లు తెలిపింది.

ఇవీ సవాళ్లు

  • బ్యాటరీ మార్పిడి విధానం విజయవంతం కావాలంటే ఒకే తరహా సాంకేతిక పరిజ్ఞానం, సామర్థ్యం, పరిమాణంలోని బ్యాటరీలను ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లు, బస్సులకు..అనుగుణంగా ఆవిష్కరించాలి. దీనివల్ల తమ ప్రత్యేకతను, బ్రాండింగ్‌ చేసుకునే అవకాశాన్ని కోల్పోతామని వాహన తయారీ సంస్థలు భావిస్తున్నాయి.
  • బ్యాటరీ మార్పిడి అవకాశం ఉన్న విద్యుత్తు వాహనాలకు ప్రభుత్వం అమలు చేస్తున్న ఫేమ్‌-2 రాయితీ లభించడం లేదు. బ్యాటరీతో పాటు వాహనాన్ని కొనుగోలు చేస్తే 5% జీఎస్‌టీ సరిపోతుంది. బ్యాటరీ స్వాపింగ్‌ వాహనాలకు, ఛార్జింగ్‌ రుసుముతో పాటు ప్రతిసారి 18% జీఎస్‌టీ చెల్లించాలి. ఇందులో మార్పులు చేయాలి.

ఇవీ చూడండి:

భారత్​లో ఇక విద్యుత్​ వాహనాలదే హవా!

Union Budget 2022: బడ్జెట్​లో 'ఎలక్ట్రిక్'​కు మరింత కిక్​!

'ఎవరైనా, ఎక్కడైనా.. పబ్లిక్‌ ఛార్జింగ్‌ స్టేషన్‌ ఏర్పాటు చేయొచ్చు'

EV battery swapping policy: పర్యావరణాన్ని పరిరక్షించేందుకు విద్యుత్తు వాహనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఈ వాహనాల తయారీ, వినియోగాన్ని వేగవంతం చేసేందుకు ఫేమ్‌ పథకాన్ని ప్రభుత్వం ఆవిష్కరించింది. అయినా విద్యుత్తు వాహనాల వాడకం ఆశించిన స్థాయిలో పెరగడం లేదు. విద్యుత్తు వాహనాలతో పాటు వాటిల్లో వినియోగించే బ్యాటరీ ధర అధికంగా ఉండటం దీనికి ప్రధాన కారణం. బ్యాటరీ ఛార్జింగ్‌ సదుపాయాలు కూడా విస్తరించాల్సి ఉంది. ప్రస్తుత బ్యాటరీలతో విద్యుత్తు వాహనాలు సుదూర ప్రయాణాలు చేయలేకపోతున్నాయి. అందువల్లే బ్యాటరీ మార్పిడి సేవ (బీఏఏఎస్‌- బ్యాటరీ యాజ్‌ ఏ సర్వీస్‌) కు సంబంధించి ప్రత్యేక విధి విధానాలను 4 నెలల్లో ఆవిష్కరించాలని 'నీతి ఆయోగ్‌' నిర్ణయించింది. పెట్రోల్‌/డీజిల్‌ పోయించుకున్నట్లే.. బ్యాటరీ ఛార్జింగ్‌ అయిపోతుందని గ్రహించగానే, వాహనదారుడు సమీపంలోని ఛార్జింగ్‌ స్టేషనుకు వెళ్లి, వాహనంలోని ఛార్జింగ్‌ అయిపోయిన బ్యాటరీని తీసి, పూర్తిఛార్జింగ్‌తో ఉన్న బ్యాటరీ అమర్చుకుని వెళ్లేందుకు ఈ విధానం ఉపకరిస్తుందని చెబుతున్నారు.

battery swapping policy
.

'పట్టణాలు/ నగరాల్లో స్థలాభావం కారణంగా ఛార్జింగ్‌ స్టేషన్లను అధిక సంఖ్యలో ఏర్పాటు చేయలేకపోతున్నారు. పైగా ఛార్జింగ్‌కు అధికసమయం పడుతుంది కనుక వాహనాలను ప్రయాణం మధ్యలో అంతసేపు నిలపడమూ కష్టమే'.. ఈ బాధలు తీరేలా బ్యాటరీ మార్పిడి విధానాన్ని తీసుకువస్తామని కేంద్ర బడ్జెట్‌లోనూ పేర్కొన్నారు. ఈ మార్పులతో విద్యుత్తు వాహనాల ధర దిగివస్తుందని అంచనా వేస్తున్నారు.

ఏ విధంగా మేలు?

విద్యుత్తు వాహనాలను కంపెనీలు రెండు విధాలుగా ఉత్పత్తి చేస్తున్నాయి. 'ఫిక్స్‌డ్‌' బ్యాటరీ ఉండే వాహనాలను ఇంటి దగ్గర/లేదా సంబంధిత కేంద్రాల్లో ఛార్జింగ్‌ చేసుకోవాల్సిందే. మరొక రకం వాహనాల్లో బ్యాటరీ ఉండదు. కేవలం వాహనాన్ని మాత్రమే వినియోగదార్లు కొనుగోలు చేస్తారు. బ్యాటరీని అద్దెకు తీసుకుంటారు. ఛార్జింగ్‌ అయిపోగానే మార్పిడి కేంద్రానికి వెళ్లి ఆ బ్యాటరీ ఇచ్చేసి.. ఛార్జింగ్‌ ఉన్న బ్యాటరీని తీసుకోవచ్చు. ఇటువంటి వాహనాల ధర సగానికి సగం తక్కువగా ఉంటుంది. బ్యాటరీ మార్పిడికి ఎక్కువ సమయం పట్టదు కనుక, ప్రయాణాలు ఆలస్యం కావు. ఛార్జింగ్‌ స్టేషన్లను నగరాల్లోని ప్రధాన రహదార్లలో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉండదు.

కొన్ని సంస్థల ఆసక్తి

సన్‌ మొబిలిటీ, గొగోరో అనే సంస్థలు బ్యాటరీ మార్పిడి సేవ (బాస్‌) ను మనదేశంలో ఆవిష్కరించడానికి ముందుకు వస్తున్నాయి. తైవాన్‌లో 2,500 బ్యాటరీ స్వాపింగ్‌ స్టేషన్లు నిర్వహిస్తున్న గొగోరో మనదేశానికి చెందిన హీరో మోటోకార్ప్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. బెంగళూరుకు చెందిన బౌన్స్‌ అనే అంకుర సంస్థ, ఇప్పటికే 10 లక్షలకు పైగా స్వాప్‌ (బ్యాటరీ మార్పిడి) లను నమోదు చేసినట్లు తెలిపింది.

ఇవీ సవాళ్లు

  • బ్యాటరీ మార్పిడి విధానం విజయవంతం కావాలంటే ఒకే తరహా సాంకేతిక పరిజ్ఞానం, సామర్థ్యం, పరిమాణంలోని బ్యాటరీలను ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లు, బస్సులకు..అనుగుణంగా ఆవిష్కరించాలి. దీనివల్ల తమ ప్రత్యేకతను, బ్రాండింగ్‌ చేసుకునే అవకాశాన్ని కోల్పోతామని వాహన తయారీ సంస్థలు భావిస్తున్నాయి.
  • బ్యాటరీ మార్పిడి అవకాశం ఉన్న విద్యుత్తు వాహనాలకు ప్రభుత్వం అమలు చేస్తున్న ఫేమ్‌-2 రాయితీ లభించడం లేదు. బ్యాటరీతో పాటు వాహనాన్ని కొనుగోలు చేస్తే 5% జీఎస్‌టీ సరిపోతుంది. బ్యాటరీ స్వాపింగ్‌ వాహనాలకు, ఛార్జింగ్‌ రుసుముతో పాటు ప్రతిసారి 18% జీఎస్‌టీ చెల్లించాలి. ఇందులో మార్పులు చేయాలి.

ఇవీ చూడండి:

భారత్​లో ఇక విద్యుత్​ వాహనాలదే హవా!

Union Budget 2022: బడ్జెట్​లో 'ఎలక్ట్రిక్'​కు మరింత కిక్​!

'ఎవరైనా, ఎక్కడైనా.. పబ్లిక్‌ ఛార్జింగ్‌ స్టేషన్‌ ఏర్పాటు చేయొచ్చు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.