ETV Bharat / business

నీరవ్ కేసులో ట్విస్ట్- అప్రూవర్​గా మారిన సోదరి

author img

By

Published : Jan 7, 2021, 5:30 PM IST

నీరవ్ మోదీ సోదరి పూర్వి, ఆమె భర్త మయాంక్ మెహతా అప్రూవర్లుగా మారారని ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ వెల్లడించింది. భారత్​ సహా విదేశాల్లోని ఫ్లాట్ల జప్తుతో పాటు.. బ్యాంకు ఖాతాల్లోని నగదు మోసాలపై సహకరిస్తామని ఇరువురు తెలిపారని ఈడీ స్పష్టం చేసింది.

Nirav
నీరవ్ కేసులో ట్విస్ట్- అప్రూవర్లుగా మారిన ఇద్దరు

పంజాబ్ నేషనల్ బ్యాంకుకు వేల కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నీరవ్ సోదరి పూర్వి మోదీ, ఆమె భర్త మయాంక్ మెహతా అప్రూవర్లుగా మారారు. న్యూయార్క్​లో రెండు ఫ్లాట్లు, లండన్, ముంబయిలో ఒక్కో ఫ్లాట్​ను జప్తు చేసేందుకు సహకరిస్తామని తెలిపారు. ఈ విషయాన్ని ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ వెల్లడించింది

మరోవైపు, ముంబయిలోని ఓ బ్యాంకు ఖాతా సహా స్విస్ బ్యాంకులోని రెండు ఖాతాల్లోని రూ. 579 కోట్ల నిధుల విషయంలో జరిగిన మోసాల కేసుల్లోనూ వీరు అప్రూవర్లుగా మారారని ఈడీ తెలిపింది.

ఇవీ చదవండి:

పంజాబ్ నేషనల్ బ్యాంకుకు వేల కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నీరవ్ సోదరి పూర్వి మోదీ, ఆమె భర్త మయాంక్ మెహతా అప్రూవర్లుగా మారారు. న్యూయార్క్​లో రెండు ఫ్లాట్లు, లండన్, ముంబయిలో ఒక్కో ఫ్లాట్​ను జప్తు చేసేందుకు సహకరిస్తామని తెలిపారు. ఈ విషయాన్ని ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ వెల్లడించింది

మరోవైపు, ముంబయిలోని ఓ బ్యాంకు ఖాతా సహా స్విస్ బ్యాంకులోని రెండు ఖాతాల్లోని రూ. 579 కోట్ల నిధుల విషయంలో జరిగిన మోసాల కేసుల్లోనూ వీరు అప్రూవర్లుగా మారారని ఈడీ తెలిపింది.

ఇవీ చదవండి:

మరో 28 రోజులు రిమాండ్​లోనే నీరవ్​ మోదీ​

రూ.1350 కోట్ల ఆస్తులు స్వాధీనం

నీరవ్​ సోదరుడిపై మోసం కేసు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.