కరోనా కాలంలో థియేటర్లు మూతపడడం వల్ల ఓటీటీలో సినిమాలు చూసే వారి సంఖ్య పెరిగింది. దాంతో ఈ కరోనా కాలం నెట్ఫ్లిక్స్కు బాగా కలిసొచ్చిందనే చెప్పొచ్చు. తమ వినియోగదారుల సంఖ్య 20కోట్లను దాటినట్లు ఆ సంస్థ తెలిపింది. మొత్తంగా ఒక్క 2020లోనే 3 కోట్ల 70 లక్షల వినియోగదారులు పెరిగారని పేర్కొంది. 2020లో 25 బిలియన్ల డాలర్ల ఆదాయాన్ని ఆర్జించినట్లు ప్రకటించింది.
నెట్ఫ్లిక్స్ను స్థాపించిన 2018 నుంచి ఇప్పటి వరకు వినియోగదారుల సంఖ్య 111 మిలియన్ల నుంచి 204 మిలియన్లకు చేరింది. విదేశీ మారక ద్రవ్యంలో ఒడుదొడుకులు ఎదురైనప్పటికీ సగటు వినియోగదారుడు చెల్లించే రుసుము రూ.721 (9.88 డాలర్ల) నుంచి రూ.804 (11.02 డాలర్ల)కు పెరిగింది. దీనివల్ల కొన్ని సంవత్సరాలుగా నెట్ఫ్లిక్స్కు నాలుగు నుంచి 5 బిలియన్ డాలర్ల ఆదాయం సమకూరింది.
-నెట్ఫ్లిక్స్
ఒక్క నాలుగో త్రైమాసికంలోనే 85 లక్షల వినియోగదారులు నెట్ఫ్లిక్స్లో చేరినట్లు ప్రకటించింది. దాంతో నాలుగో త్రైమాసికంలో 6.64 బిలియన్ల ఆదాయం వచ్చిందని పేర్కొంది.
ఇదీ చూడండి: ఓటీటీ.. నీకు ఇంత క్రేజ్ ఎందుకమ్మా?