ETV Bharat / business

వరుసగా తొమ్మిదో సారీ ముకేశుడే నంబర్ 1

author img

By

Published : Sep 29, 2020, 3:37 PM IST

Updated : Sep 29, 2020, 4:51 PM IST

వరుసగా తొమ్మిదో సారి దేశంలో అత్యంత సంపన్నుడిగా నిలిచారు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ. 'వెల్త్ హరూన్ ఇండియా రిచ్​ లిస్ట్ 2020' ద్వారా ఈ విషయం తెలిసింది. ఇంతకీ ముకేశ్ అంబానీ సంపద ఎంతో తెలుసా?

Mukesh Ambani tops IIFL Hurun Rich List for 9th straight year
తొమ్మదో సారీ అత్యంత సంపన్నుడిగా ముకేశ్​

దేశీయ దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ వరుసగా తొమ్మిదో సారి భారత్​లో అత్యంత ధనవంతుడిగా నిలిచారు. ఐఐఎఫ్​ఎల్​ 'వెల్త్ హరూన్ ఇండియా రిచ్​ లిస్ట్ 2020' నివేదికలో ఈ విషయం వెల్లడైంది. ఈ నివేదిక ప్రకారం ముకేశ్ సంపద విలువ రూ.6.58 లక్షల కోట్లుగా ఉంది.

గత 12 నెలల్లో ముకేశ్ సంపద ఏకంగా 73 శాతం పెరిగినట్లు ఐఐఎఫ్​ఎల్​ పేర్కొంది. దీనితో ఆయన ఆసియాలోనూ అత్యంత సంపన్నుడిగా, ప్రపంచ కుబేరుల్లో 4వ స్థానంలో నిలిచినట్లు తెలిపింది.

ఈ జాబితాలో.. హిందుజా సోదరులు (ఎస్​పీ హిందుజా ముగ్గురు సోదరులు) రెండో స్థానంలో(సంపద రూ.1.43 లక్షల కోట్లు), హెచ్​సీఎల్​టెక్ వ్యవస్థాపకుడు శివ్ నాడర్ మూడో స్థానంలో (సంపద రూ.1.41 లక్షల కోట్లు) నిలిచారు. గౌతమ్ అదానీ, కుటుంబ సభ్యులు, అజీమ్ ప్రేమ్​జీలు వరుసగా 4, 5 స్థానాల్లో ఉన్నారు.

హరూన్ రిచ్​ లిస్ట్​లోలో.. రూ.32,400 కోట్లతో స్మితా వి క్రిష్ణ అత్యంత సంపన్న మహిళగా నిలిచారు. కిరణ్ మంజుందార్ (రూ.31,600 కోట్లు) రెండో స్థానంలో ఉన్నారు.

ఇదీ చూడండి:గూగుల్‌కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?

దేశీయ దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ వరుసగా తొమ్మిదో సారి భారత్​లో అత్యంత ధనవంతుడిగా నిలిచారు. ఐఐఎఫ్​ఎల్​ 'వెల్త్ హరూన్ ఇండియా రిచ్​ లిస్ట్ 2020' నివేదికలో ఈ విషయం వెల్లడైంది. ఈ నివేదిక ప్రకారం ముకేశ్ సంపద విలువ రూ.6.58 లక్షల కోట్లుగా ఉంది.

గత 12 నెలల్లో ముకేశ్ సంపద ఏకంగా 73 శాతం పెరిగినట్లు ఐఐఎఫ్​ఎల్​ పేర్కొంది. దీనితో ఆయన ఆసియాలోనూ అత్యంత సంపన్నుడిగా, ప్రపంచ కుబేరుల్లో 4వ స్థానంలో నిలిచినట్లు తెలిపింది.

ఈ జాబితాలో.. హిందుజా సోదరులు (ఎస్​పీ హిందుజా ముగ్గురు సోదరులు) రెండో స్థానంలో(సంపద రూ.1.43 లక్షల కోట్లు), హెచ్​సీఎల్​టెక్ వ్యవస్థాపకుడు శివ్ నాడర్ మూడో స్థానంలో (సంపద రూ.1.41 లక్షల కోట్లు) నిలిచారు. గౌతమ్ అదానీ, కుటుంబ సభ్యులు, అజీమ్ ప్రేమ్​జీలు వరుసగా 4, 5 స్థానాల్లో ఉన్నారు.

హరూన్ రిచ్​ లిస్ట్​లోలో.. రూ.32,400 కోట్లతో స్మితా వి క్రిష్ణ అత్యంత సంపన్న మహిళగా నిలిచారు. కిరణ్ మంజుందార్ (రూ.31,600 కోట్లు) రెండో స్థానంలో ఉన్నారు.

ఇదీ చూడండి:గూగుల్‌కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?

Last Updated : Sep 29, 2020, 4:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.