ETV Bharat / business

కరోనా నుంచి త్వరగానే కోలుకుంటాం: నాదెళ్ల

author img

By

Published : Mar 26, 2020, 8:17 AM IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్​ విజృంభిస్తున్నప్పటికీ.. ఆ ప్రభావం నుంచి త్వరగా కోలుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశారు మైక్రోసాఫ్ట్​ సీఈఓ సత్య నాదెళ్ల. ముఖ్యంగా ప్రజల భద్రతపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు.

Microsoft will get out of COVID-19 crisis 'pretty strong': Nadella
మైక్రోసాఫ్ట్‌ ఆర్థిక మూలాలు పటిష్ఠం: నాదెళ్ల

మైక్రోసాఫ్ట్‌ మూలాలు పటిష్ఠమని, కరోనా వైరస్‌ ప్రభావం నుంచి వెంటనే బయటపడతామనే నమ్మకం తమకు ఉందని మైక్రోసాప్ట్‌ సీఈఓ సత్య నాదెళ్ల అన్నారు. అయితే అమెరికా, ఐరోపా, ఇతర అభివృద్ధి చెందిన విపణుల్లో గిరాకీపై ఏ మేర ప్రభావం పడిందన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారిందని ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

ఇంటి నుంచే క్లయింట్ల అవసరాలను తీరుస్తున్న విధానంపై ఆయన సంతృప్తిని వ్యక్తం చేశారు. అయితే సరఫరా విషయంలోనే అవరోధాలు ఎదురవుతున్నాయని అన్నారు. ఈ ఏడాది చివరిలోగా ఎక్స్‌బాక్స్‌ గేమింగ్‌ కన్సోల్‌ సహా పలు సర్ఫేస్‌ డివైజెస్‌ను విడుదల చేయనున్నట్లు కొవిడ్‌ పరిణామాలకు ముందు మైక్రోసాఫ్ట్‌ హామీ ఇచ్చింది. అయితే వీటిని అందుబాటులోకి తెస్తామా లేదా అనే దాని కంటే.. నాణ్యత, గిరాకీ పరిస్థితులు, ముఖ్యంగా ప్రజల భద్రతపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నట్లు ఆయన చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.